Movie News

ఇక్కడ రీమేక్.. అక్కడ సీక్వెల్

బాలీవుడ్లో ఐదేళ్ల కిందట మంచి విజయం సాధించిన థ్రిల్లర్ సినిమా.. రైడ్. అజయ్ దేవగణ్ హీరోగా రాజ్ కుమార్ గుప్తా ఈ చిత్రాన్ని రూపొందించాడు. సౌరభ్ శుక్లా, ఇలియానా ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. 40 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం.. అప్పట్లో 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్బస్టర్ రేంజ్ అందుకుంది.

ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. రకరకాల కాంబినేషన్లు అనుకోగా ఏదీ వర్కౌట్ కాలేదు. చివరికి ఇటీవలే హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఈ రీమేక్ మొదలైంది. ఈ చిత్రానికి మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్ ఒక షెడ్యూల్ కూడా అయిపోయింది. ఈ సమయంలో రైడ్ సినిమాకి హిందీలో సీక్వెల్ అనూస్ చేయడం విశేషం.

అజయ్ దేవగణ్ నే హీరోగా రైడ్ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నాడు రాజ్ కుమార్ గుప్తా. టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ మరికొందరు నిర్మాతలతో కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. రైడ్ మూవీలో అజయ్ పోషించిన అమేయ్ పట్నాయక్ పాత్రనే ఇందులోనూ కొనసాగబోతున్నట్లు అనౌన్స్మెంట్ పోస్టర్లోనే హింట్ ఇచ్చారు. కాబట్టి ఇది ప్రాపర్ సీక్వెల్ అన్నమాట. ఇందులో సౌరభ్ శుక్లా పాత్ర కూడా కొనసాగబోతోంది. ఇలియానా ఈమధ్య అస్సలు సినిమాలో నటించట్లేదు కాబట్టి ఆమె పాత్ర ఉండకపోవచ్చు. సినిమా ప్రకటిస్తూనే రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసింది చిత్ర బృందం.

ఈ ఏడాది నవంబర్ 15న దీపావళి కానుకగా రైడ్-2 విడుదల అవుతుంది. ఈలోపు రైడ్ రీమేక్ తెలుగులో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అది వర్క్ అవుట్ అయి.. హిందీలో సీక్వెల్ కూడా క్లిక్ అయితే తెలుగులో దాని రీమేక్ కూడా వచ్చే అవకాశాలను కొట్టి పారేయలేం.

This post was last modified on January 6, 2024 5:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

1 hour ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago