బాలీవుడ్లో ఐదేళ్ల కిందట మంచి విజయం సాధించిన థ్రిల్లర్ సినిమా.. రైడ్. అజయ్ దేవగణ్ హీరోగా రాజ్ కుమార్ గుప్తా ఈ చిత్రాన్ని రూపొందించాడు. సౌరభ్ శుక్లా, ఇలియానా ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. 40 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం.. అప్పట్లో 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్బస్టర్ రేంజ్ అందుకుంది.
ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. రకరకాల కాంబినేషన్లు అనుకోగా ఏదీ వర్కౌట్ కాలేదు. చివరికి ఇటీవలే హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఈ రీమేక్ మొదలైంది. ఈ చిత్రానికి మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్ ఒక షెడ్యూల్ కూడా అయిపోయింది. ఈ సమయంలో రైడ్ సినిమాకి హిందీలో సీక్వెల్ అనూస్ చేయడం విశేషం.
అజయ్ దేవగణ్ నే హీరోగా రైడ్ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నాడు రాజ్ కుమార్ గుప్తా. టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ మరికొందరు నిర్మాతలతో కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. రైడ్ మూవీలో అజయ్ పోషించిన అమేయ్ పట్నాయక్ పాత్రనే ఇందులోనూ కొనసాగబోతున్నట్లు అనౌన్స్మెంట్ పోస్టర్లోనే హింట్ ఇచ్చారు. కాబట్టి ఇది ప్రాపర్ సీక్వెల్ అన్నమాట. ఇందులో సౌరభ్ శుక్లా పాత్ర కూడా కొనసాగబోతోంది. ఇలియానా ఈమధ్య అస్సలు సినిమాలో నటించట్లేదు కాబట్టి ఆమె పాత్ర ఉండకపోవచ్చు. సినిమా ప్రకటిస్తూనే రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసింది చిత్ర బృందం.
ఈ ఏడాది నవంబర్ 15న దీపావళి కానుకగా రైడ్-2 విడుదల అవుతుంది. ఈలోపు రైడ్ రీమేక్ తెలుగులో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అది వర్క్ అవుట్ అయి.. హిందీలో సీక్వెల్ కూడా క్లిక్ అయితే తెలుగులో దాని రీమేక్ కూడా వచ్చే అవకాశాలను కొట్టి పారేయలేం.
This post was last modified on January 6, 2024 5:42 pm
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…