ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక చైల్డ్ యాక్టర్ హీరోగా మారాక అతనికి పెద్ద అవకాశాలు రావడం అంత సులభం కాదు. భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరికే సరైన బ్రేక్ దక్కక సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. అలాంటిది తేజ సజ్జకి క్రేజీ ప్రాజెక్టులు చేతికి రావడం చూస్తే మాములు సుడి అనిపించడం లేదు. హనుమాన్ మీద ఇప్పటికే నేషనల్ వైడ్ క్రేజ్ వచ్చింది. కంటెంట్ బాగుండి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యి మెప్పించిందా బ్లాక్ బస్టర్ ఖాయమే. కేవలం హిందీ వెర్షన్ కే వెయ్యికి పైగా స్క్రీన్లను ప్లాన్ చేయడం మాములు విషయం కాదు. ఇక్కడితో అయిపోలేదు.
ఇది రిలీజ్ కాకుండానే తేజ సజ్జ మరో భారీ చిత్రాన్ని పాకెట్ లో వేసుకున్నారు. ఈగల్ దర్శకుడు కార్తీక ఘట్టమనేని తీస్తున్న ఇంకో మూవీలో తనదే ప్రధాన పాత్రట. ఇందులో మంచు మనోజ్, దుల్కర్ సల్మాన్ లు కూడా ఉండబోతున్నారని తెలిసింది. ఇలాంటి మల్టీస్టారర్ లో భాగం కావడమంటే పెద్ద ప్రమోషనే. ఈగల్ అవ్వగానే కార్తీక్ దీనిలో పనులు మొదలుపెట్టడు. 2024లోనే విడుదల చేసేలా ప్లానింగ్ జరుగుతోందని సమాచారం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీనే దీనికి నిర్మాతగా వ్యవహరించడం మరో విశేషం. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లోనే కథ నడుస్తుందని వినికిడి.
ఇలాంటి ప్లానింగ్ తో తేజ సజ్జ త్వరగానే మీడియం స్టార్ల లీగ్ లోకి వెళ్లిపోవచ్చు. కుర్రాడు ఇంకా లేతగానే ఉన్నప్పటికీ ఆఫర్లు మాత్రం భారీగా గట్టిగా వస్తున్నాయి. ఓ మై బేబీలో సపోర్టింగ్ ఆర్టిస్టుగా చేయడం దగ్గరి నుంచి సోలో హీరోగా ప్యాన్ ఇండియా మూవీస్ దక్కించుకోవడం వరకు తేజ ప్రయాణం మంచి జోరు మీదుంది. కాకపోతే హిట్లు పడి వాటిని నిలబెట్టుకోవడం కీలకం. హనుమాన్ కనక పెద్ద హిట్టు కొడితే బాలీవుడ్ లోనూ గుర్తింపు వస్తుంది. తద్వారా నెక్స్ట్ చేయబోయే సినిమాలకు రీమేక్, డబ్బింగ్, ఓటిటి హక్కుల పరంగా డిమాండ్ ఏర్పడుతుంది. ఇంతకన్నా అతను కోరుకునేది ఏముంటుంది.
This post was last modified on January 5, 2024 9:56 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…