సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్ల పంచాయతీని తెంచేందుకు ఆయా చిత్రాల నిర్మాతలు, ఇతర సినీ పెద్దలతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిర్మాతల మండలి అధ్యక్షుడు దిల్ రాజు.. ఒక ఆసక్తికర కామెంట్ చేశారు. హీరోల స్థాయి ఆధారంగా సంక్రాంతి సినిమాల్లో ప్రయారిటీ నంబరింగ్ ఇచ్చారాయన. దీని ప్రకారం మహేష్ బాబు సినిమా గుంటూరు కారంకి నంబర్ వన్ రేటింగ్ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాతి స్థానాల్లో నాగార్జున, వెంకటేష్ చిత్రాలు నా సామి రంగ, సైంధవ్ లను నిలబెట్టాడు. చివరి స్థానాన్ని హనుమాన్ చిత్రానికి కేటాయించాడు.
అయితే హీరోల రేంజిని బట్టి ఆయన నంబరింగ్ ఉండగా.. ప్రేక్షకాసక్తి విషయంలో హనుమాన్ అగ్రస్థానంలో ఉందన్న విషయం దిల్ రాజు మర్చిపోతున్నారు. ఇందుకు ఒక రుజువు కూడా ఉంది.
కొత్త సినిమాల పట్ల ప్రేక్షకుల ఆసక్తిని ఈమధ్య బుక్ మై షో లో ఇంట్రెస్ట్స్ నంబరును బట్టి అంచనా వేస్తున్నారు. అందులో హనుమాన్ సినిమాకే నంబర్ వన్ ర్యాంకింగ్ ఉండడం విశేషం. ఈ సినిమాకు బీఎంఎస్ లో ఏకంగా 2 లక్షలకు పైగా ఇంట్రెస్ట్స్ ఉండడం విశేషం.
గుంటూరు కారం కంటే ఒక వెయ్యి మంది ఎక్కువగానే ఈ సినిమా పట్ల ఆసక్తి చూపించారు. మిగతా రెండు సంక్రాంతి సినిమాలు నా సామిరంగ, సైంధవ్ వరుసగా 47 వేలు, 69 వేలు ఇంట్రెస్ట్స్ తో సాగుతున్నాయి. మరి ప్రేక్షకుల ఆసక్తి ఏ సినిమా పట్ల ఎక్కువగా ఉందన్నది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంత క్రేజ్ ఉన్న సినిమాకు జనవరి 12న హైదరాబాద్లో గుంటూరు కారంతో పోలిస్తే 10% స్క్రీన్లు కూడా ఇవ్వకపోవడం అన్యాయం కాక మరేంటి?
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…