సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్ల పంచాయతీని తెంచేందుకు ఆయా చిత్రాల నిర్మాతలు, ఇతర సినీ పెద్దలతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిర్మాతల మండలి అధ్యక్షుడు దిల్ రాజు.. ఒక ఆసక్తికర కామెంట్ చేశారు. హీరోల స్థాయి ఆధారంగా సంక్రాంతి సినిమాల్లో ప్రయారిటీ నంబరింగ్ ఇచ్చారాయన. దీని ప్రకారం మహేష్ బాబు సినిమా గుంటూరు కారంకి నంబర్ వన్ రేటింగ్ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాతి స్థానాల్లో నాగార్జున, వెంకటేష్ చిత్రాలు నా సామి రంగ, సైంధవ్ లను నిలబెట్టాడు. చివరి స్థానాన్ని హనుమాన్ చిత్రానికి కేటాయించాడు.
అయితే హీరోల రేంజిని బట్టి ఆయన నంబరింగ్ ఉండగా.. ప్రేక్షకాసక్తి విషయంలో హనుమాన్ అగ్రస్థానంలో ఉందన్న విషయం దిల్ రాజు మర్చిపోతున్నారు. ఇందుకు ఒక రుజువు కూడా ఉంది.
కొత్త సినిమాల పట్ల ప్రేక్షకుల ఆసక్తిని ఈమధ్య బుక్ మై షో లో ఇంట్రెస్ట్స్ నంబరును బట్టి అంచనా వేస్తున్నారు. అందులో హనుమాన్ సినిమాకే నంబర్ వన్ ర్యాంకింగ్ ఉండడం విశేషం. ఈ సినిమాకు బీఎంఎస్ లో ఏకంగా 2 లక్షలకు పైగా ఇంట్రెస్ట్స్ ఉండడం విశేషం.
గుంటూరు కారం కంటే ఒక వెయ్యి మంది ఎక్కువగానే ఈ సినిమా పట్ల ఆసక్తి చూపించారు. మిగతా రెండు సంక్రాంతి సినిమాలు నా సామిరంగ, సైంధవ్ వరుసగా 47 వేలు, 69 వేలు ఇంట్రెస్ట్స్ తో సాగుతున్నాయి. మరి ప్రేక్షకుల ఆసక్తి ఏ సినిమా పట్ల ఎక్కువగా ఉందన్నది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంత క్రేజ్ ఉన్న సినిమాకు జనవరి 12న హైదరాబాద్లో గుంటూరు కారంతో పోలిస్తే 10% స్క్రీన్లు కూడా ఇవ్వకపోవడం అన్యాయం కాక మరేంటి?
This post was last modified on January 5, 2024 9:35 pm
ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలను నిలువరించలేక పోయిన.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా కలెక్టరు, ముగ్గురు ఎస్పీలు) వేటు…
ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. సతీమణి వైఎస్ భారతి, కుమార్తెలు హర్ష,…
మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…