సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్ల పంచాయతీని తెంచేందుకు ఆయా చిత్రాల నిర్మాతలు, ఇతర సినీ పెద్దలతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిర్మాతల మండలి అధ్యక్షుడు దిల్ రాజు.. ఒక ఆసక్తికర కామెంట్ చేశారు. హీరోల స్థాయి ఆధారంగా సంక్రాంతి సినిమాల్లో ప్రయారిటీ నంబరింగ్ ఇచ్చారాయన. దీని ప్రకారం మహేష్ బాబు సినిమా గుంటూరు కారంకి నంబర్ వన్ రేటింగ్ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాతి స్థానాల్లో నాగార్జున, వెంకటేష్ చిత్రాలు నా సామి రంగ, సైంధవ్ లను నిలబెట్టాడు. చివరి స్థానాన్ని హనుమాన్ చిత్రానికి కేటాయించాడు.
అయితే హీరోల రేంజిని బట్టి ఆయన నంబరింగ్ ఉండగా.. ప్రేక్షకాసక్తి విషయంలో హనుమాన్ అగ్రస్థానంలో ఉందన్న విషయం దిల్ రాజు మర్చిపోతున్నారు. ఇందుకు ఒక రుజువు కూడా ఉంది.
కొత్త సినిమాల పట్ల ప్రేక్షకుల ఆసక్తిని ఈమధ్య బుక్ మై షో లో ఇంట్రెస్ట్స్ నంబరును బట్టి అంచనా వేస్తున్నారు. అందులో హనుమాన్ సినిమాకే నంబర్ వన్ ర్యాంకింగ్ ఉండడం విశేషం. ఈ సినిమాకు బీఎంఎస్ లో ఏకంగా 2 లక్షలకు పైగా ఇంట్రెస్ట్స్ ఉండడం విశేషం.
గుంటూరు కారం కంటే ఒక వెయ్యి మంది ఎక్కువగానే ఈ సినిమా పట్ల ఆసక్తి చూపించారు. మిగతా రెండు సంక్రాంతి సినిమాలు నా సామిరంగ, సైంధవ్ వరుసగా 47 వేలు, 69 వేలు ఇంట్రెస్ట్స్ తో సాగుతున్నాయి. మరి ప్రేక్షకుల ఆసక్తి ఏ సినిమా పట్ల ఎక్కువగా ఉందన్నది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంత క్రేజ్ ఉన్న సినిమాకు జనవరి 12న హైదరాబాద్లో గుంటూరు కారంతో పోలిస్తే 10% స్క్రీన్లు కూడా ఇవ్వకపోవడం అన్యాయం కాక మరేంటి?
This post was last modified on January 5, 2024 9:35 pm
కేంద్రంలోని బీజేపీతోను.. ఇటు రాష్ట్రంలోని బీజేపీతోనూ కయ్యానికి సుముఖంగా లేమని వైసీపీ స్పష్టం చేస్తోంది. నిజానికి ఆది నుంచి కూడా…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఈవీవీ సత్యనారాయణ గారు అలీబాబా అరడజను దొంగలు అనే సినిమా తీశారు. రాజేంద్ర ప్రసాద్…
గత కొంత కాలంగా సౌత్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ తన స్థాయికి తగ్గ మ్యూజిక్ ఇవ్వడం లేదని సంగీత ప్రియులు…
సచిన్ అంటే ఒక బ్రాండ్. అందుకే ఆయన బ్రాండ్ విలువ ఏమాత్రం తగ్గలేదు. దేశంలోని ప్రముఖ కంపెనీలు ఆయనను బ్రాండ్…
``దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చేందుకు మన వాళ్లు తుపాకీ తూటాలకే వెనుకాడలేదు. మీరు ఎంపీ అయి ఉండి.. కోడిగుడ్లకు భయపడతారా?``అంటూ.. తృణమూల్…
ప్రస్తుతం వైసీపీ పెట్టుకున్న లక్ష్యం.. మంత్రి నారా లోకేష్ తో రాజీనామా చేయించడం. గత వారం రోజులుగా ఈ విషయాన్ని…