2019 ఎన్నికలకు ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రని నేపధ్యంగా తీసుకుని చేసిన యాత్ర బాగానే ఆదరణ దక్కించుకుంది. దర్శకుడు మహి వి రాఘవ్ పొలిటికల్ అజెండాతో రూపొందించినా అందులో ఎమోషన్ కనెక్ట్ అవ్వడంతో పాస్ అయ్యింది. సరిగ్గా అయిదేళ్లకు మళ్ళీ ఎలక్షన్లు దగ్గర పడుతున్న టైంలో ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కథను చెప్పేందుకు పూనుకున్నారు. అదే యాత్ర 2. తమిళ నటుడు రంగం ఫేమ్ జీవా ప్రధాన పాత్ర పోషిస్తుండగా మమ్ముట్టి, మహేష్ మంజ్రేకర్ మినహాయించి దాదాపు అందరూ కొత్తవాళ్లే కనిపిస్తున్నారు.
రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన పని చేసిన పార్టీ జగన్(జీవా)ని నయానో భయానో లొంగదీసుకోవాలని చూస్తుంది. కానీ సాధ్యం కాకపోవడంతో జైలుకు పంపి అణిచేందుకు సిద్ధ పడుతుంది. దీనికి ప్రతిపక్ష నాయకుడు(మహేష్ మంజ్రేకర్) తోడవ్వడంతో జగన్ లక్ష కోట్ల స్కాము మీద కటకటాల పాలవుతాడు. అయినా సరే తన తండ్రికి ఇచ్చిన మాట కోసం, జనం సంక్షేమం కోసం బెయిలు మీద బయటికి వచ్చాక పాదయాత్ర ద్వారా ప్రజల్ని కలుసుకుంటాడు. ఈ క్రమంలో ఒడిదుడుకులను ఎలా దాటుకున్నాడు, అధికార పీఠం దాకా ఎలా చేరుకున్నాడనేది అసలు కథ.
అపోజిషన్ లీడర్ల పేర్లను నేరుగా ప్రస్తావించకపోయినా స్పష్టంగా జగన్, రాజశేఖర్ రెడ్డిల బయోపిక్ గా చూపించడం వల్ల చాలా సులభంగా పాత్రధారులను గుర్తించేలా చేశారు. జగన్ రాజకీయ ప్రస్థానాన్ని ఎలివేట్ చేయడానికి మహి వి రాఘవ్ మళ్ళీ భావోద్వేగాల మార్గాన్నే ఎంచుకున్నాడు. తెలుగు బాషా గ్రామర్ ప్రకారం చెప్పాలంటే వర్మ వ్యూహం వికృతి అయితే మహి యాత్ర 2 ప్రకృతి. అంతే తేడా. చెప్పాలనుకున్న విషయం ఒకటే అయినా ఎంచుకున్న పంథా, లక్ష్యాలు వేరు. ఫిబ్రవరి 8 విడుదల కాబోతున్న యాత్ర 2కి మాదీ ఛాయాగ్రహణం, సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు.
ప్రభాస్ అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్ లో కూడా విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా కల్కి 2. ఆల్రెడీ…
ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…
నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…