2019 ఎన్నికలకు ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రని నేపధ్యంగా తీసుకుని చేసిన యాత్ర బాగానే ఆదరణ దక్కించుకుంది. దర్శకుడు మహి వి రాఘవ్ పొలిటికల్ అజెండాతో రూపొందించినా అందులో ఎమోషన్ కనెక్ట్ అవ్వడంతో పాస్ అయ్యింది. సరిగ్గా అయిదేళ్లకు మళ్ళీ ఎలక్షన్లు దగ్గర పడుతున్న టైంలో ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కథను చెప్పేందుకు పూనుకున్నారు. అదే యాత్ర 2. తమిళ నటుడు రంగం ఫేమ్ జీవా ప్రధాన పాత్ర పోషిస్తుండగా మమ్ముట్టి, మహేష్ మంజ్రేకర్ మినహాయించి దాదాపు అందరూ కొత్తవాళ్లే కనిపిస్తున్నారు.
రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన పని చేసిన పార్టీ జగన్(జీవా)ని నయానో భయానో లొంగదీసుకోవాలని చూస్తుంది. కానీ సాధ్యం కాకపోవడంతో జైలుకు పంపి అణిచేందుకు సిద్ధ పడుతుంది. దీనికి ప్రతిపక్ష నాయకుడు(మహేష్ మంజ్రేకర్) తోడవ్వడంతో జగన్ లక్ష కోట్ల స్కాము మీద కటకటాల పాలవుతాడు. అయినా సరే తన తండ్రికి ఇచ్చిన మాట కోసం, జనం సంక్షేమం కోసం బెయిలు మీద బయటికి వచ్చాక పాదయాత్ర ద్వారా ప్రజల్ని కలుసుకుంటాడు. ఈ క్రమంలో ఒడిదుడుకులను ఎలా దాటుకున్నాడు, అధికార పీఠం దాకా ఎలా చేరుకున్నాడనేది అసలు కథ.
అపోజిషన్ లీడర్ల పేర్లను నేరుగా ప్రస్తావించకపోయినా స్పష్టంగా జగన్, రాజశేఖర్ రెడ్డిల బయోపిక్ గా చూపించడం వల్ల చాలా సులభంగా పాత్రధారులను గుర్తించేలా చేశారు. జగన్ రాజకీయ ప్రస్థానాన్ని ఎలివేట్ చేయడానికి మహి వి రాఘవ్ మళ్ళీ భావోద్వేగాల మార్గాన్నే ఎంచుకున్నాడు. తెలుగు బాషా గ్రామర్ ప్రకారం చెప్పాలంటే వర్మ వ్యూహం వికృతి అయితే మహి యాత్ర 2 ప్రకృతి. అంతే తేడా. చెప్పాలనుకున్న విషయం ఒకటే అయినా ఎంచుకున్న పంథా, లక్ష్యాలు వేరు. ఫిబ్రవరి 8 విడుదల కాబోతున్న యాత్ర 2కి మాదీ ఛాయాగ్రహణం, సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు.
This post was last modified on January 5, 2024 11:45 am
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…