ఈ ఏడాది సంక్రాంతి రేసులోకి చాలా లేటుగా వచ్చిన సినిమా నా సామి రంగ. మిగతా పండుగ సినిమాలన్నీ షూటింగ్ సగం, అంతకంటే ఎక్కువ పూర్తి చేసుకుని సంక్రాంతి విడుదల ఖాయం చేసుకుంటున్న దశలో ఈ సినిమాను అనౌన్స్ చేయడం విశేషం. అయితే అనౌన్స్మెంట్లోనే సంక్రాంతి రిలీజ్ అని కన్ఫర్మ్ చేసేసింది చిత్ర బృందం. లేటుగా సెట్స్ మీదికి వెళ్ళినప్పటికీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకున్న నా సామి రంగ.. ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే రావాలని పట్టుదలతో సాగింది.
ప్రమోషన్లు కొంచెం ఆలస్యంగా మొదలైనప్పటికీ సినిమాకు డీసెంట్ బజ్ క్రియేట్ అయింది. నాగార్జున చాకచక్యంగా ఈ సినిమాకు మార్కెటింగ్, బిజినెస్ కూడా చక్కబెట్టేశాడు. తన భాగస్వామ్యం ఉన్న మాటీవీకి నాన్ థియేట్రికల్ హక్కులన్నీ మంచి రేటుకు అమ్మించాడు. అయితే ఎంత ప్రణాళికతో అడుగులు వేసినప్పటికీ ఈ సినిమా చిత్రీకరణ కొంచెం ఆలస్యం అవుతున్నట్లు సమాచారం.
నా సామి రంగ విడుదలకు 10 రోజులు మాత్రమే సమయం ఉండగా.. ఇంకా కొంతమేర చిత్రీకరణ మిగిలే ఉందట. టాకీ అంతా పూర్తి కావడానికి అటు ఇటుగా ఇంకో ఐదు రోజులు పట్టొచ్చు అని అంటున్నారు. షూటింగ్ ఇలా జరుగుతుండగానే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. దీంతో టీం కొంచెం కిందా మీదా అవుతున్నట్లు సమాచారం. ఇంత హడావిడిలో థియేటర్లు చూసుకోవాలి. రిలీజ్ పక్కాగా ఉండేలా జాగ్రత్త పడాలి. మరోవైపు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయాలి. మొత్తంగా నాగ్ అండ్ టీం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు చిత్రవర్గాల సమాచారం.
అయితే సంక్రాంతి పండక్కి పక్కాగా సూట్ అయ్యే సినిమా కావడంతో ఈ సీజన్ మిస్ అవ్వడానికి వీల్లేదని చిత్ర బృందం పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతోంది. కంటెంట్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండడంతో సంక్రాంతికి నా సామిరంగ కచ్చితంగా మంచి హిట్ అయి తమ కష్టానికి ఫలితం చిత్త బృందం ధీమాగా ఉంది. కొరియాగ్రాఫర్ విజయ్ బిన్నీ డైరెక్ట్ చేస్తున్న నా సామిరంగ జనవరి 14న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 4, 2024 11:11 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…