ఈ ఏడాది సంక్రాంతి రేసులోకి చాలా లేటుగా వచ్చిన సినిమా నా సామి రంగ. మిగతా పండుగ సినిమాలన్నీ షూటింగ్ సగం, అంతకంటే ఎక్కువ పూర్తి చేసుకుని సంక్రాంతి విడుదల ఖాయం చేసుకుంటున్న దశలో ఈ సినిమాను అనౌన్స్ చేయడం విశేషం. అయితే అనౌన్స్మెంట్లోనే సంక్రాంతి రిలీజ్ అని కన్ఫర్మ్ చేసేసింది చిత్ర బృందం. లేటుగా సెట్స్ మీదికి వెళ్ళినప్పటికీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకున్న నా సామి రంగ.. ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే రావాలని పట్టుదలతో సాగింది.
ప్రమోషన్లు కొంచెం ఆలస్యంగా మొదలైనప్పటికీ సినిమాకు డీసెంట్ బజ్ క్రియేట్ అయింది. నాగార్జున చాకచక్యంగా ఈ సినిమాకు మార్కెటింగ్, బిజినెస్ కూడా చక్కబెట్టేశాడు. తన భాగస్వామ్యం ఉన్న మాటీవీకి నాన్ థియేట్రికల్ హక్కులన్నీ మంచి రేటుకు అమ్మించాడు. అయితే ఎంత ప్రణాళికతో అడుగులు వేసినప్పటికీ ఈ సినిమా చిత్రీకరణ కొంచెం ఆలస్యం అవుతున్నట్లు సమాచారం.
నా సామి రంగ విడుదలకు 10 రోజులు మాత్రమే సమయం ఉండగా.. ఇంకా కొంతమేర చిత్రీకరణ మిగిలే ఉందట. టాకీ అంతా పూర్తి కావడానికి అటు ఇటుగా ఇంకో ఐదు రోజులు పట్టొచ్చు అని అంటున్నారు. షూటింగ్ ఇలా జరుగుతుండగానే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. దీంతో టీం కొంచెం కిందా మీదా అవుతున్నట్లు సమాచారం. ఇంత హడావిడిలో థియేటర్లు చూసుకోవాలి. రిలీజ్ పక్కాగా ఉండేలా జాగ్రత్త పడాలి. మరోవైపు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయాలి. మొత్తంగా నాగ్ అండ్ టీం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు చిత్రవర్గాల సమాచారం.
అయితే సంక్రాంతి పండక్కి పక్కాగా సూట్ అయ్యే సినిమా కావడంతో ఈ సీజన్ మిస్ అవ్వడానికి వీల్లేదని చిత్ర బృందం పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతోంది. కంటెంట్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండడంతో సంక్రాంతికి నా సామిరంగ కచ్చితంగా మంచి హిట్ అయి తమ కష్టానికి ఫలితం చిత్త బృందం ధీమాగా ఉంది. కొరియాగ్రాఫర్ విజయ్ బిన్నీ డైరెక్ట్ చేస్తున్న నా సామిరంగ జనవరి 14న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…