సంక్రాంతి రేసులో అందరికంటే చిన్న హీరోని పెట్టుకుని పెద్ద బడ్జెట్ తో వస్తున్న హనుమాన్ మీద క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. టీమ్ క్రమం తప్పకుండా ప్రమోషన్లు యాక్టివ్ గా ఉండేలా చూసుకుంటోంది. ఒకవైపు సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అప్డేట్స్ ఇస్తూ ఇంకో వైపు ఇంటర్వ్యూలు, ఈవెంట్లు గట్రా చక్కగా ప్లాన్ చేస్తోంది. ప్రత్యేకంగా దీని మీదే ఆసక్తి ఉన్న ఆడియన్స్ కున్న టెన్షన్ ఒకటే. జనవరి 12 అదే రోజు విడుదల కాబోతున్న గుంటూరు కారం తాకిడిని ఈ ఫాంటసీ మూవీ ఎలా తట్టుకుంటుందాని. దాని కోసమే ఒక మంచి వ్యూహం సిద్ధం చేసినట్టు వినిపిస్తోంది.
అదేంటంటే ఎర్లీ ప్రీమియర్లు. గత రెండేళ్లలో చాలా సినిమాలకు ముందు రోజు సాయంత్రం లేదా రాత్రి షోలు వేయడం బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు హనుమాన్ కి అదే అనుసరించాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. దీని వల్ల ఒక లాభం ఉంది. క్రేజ్ ఉన్న పాన్ ఇండియా మూవీ. జనవరి 10 రాత్రే షోలు వేస్తే ప్రేక్షకులు ఎగబడి వస్తారు. ఎలాగూ మరుసటి రోజు మహేష్ బాబుకి ఇచ్చేయాలన్న ఉద్దేశంతో ముందే చూడాలని ఫిక్సవుతారు. పైగా మహేష్ ఫ్యాన్స్ సైతం తమ పోటీదారు కంటెంట్ ఎలా ఉందోననే ఆసక్తితో భారీ సంఖ్యలో టికెట్లు కొన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
హనుమాన్ బృందం నమ్మకాన్ని తగ్గట్టు రాత్రే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందా అది ఓ రేంజ్ లో హెల్ప్ అవుతుంది. వెంటనే కాకపోయినా ఆ టాక్ తాలూకు ప్రభావం క్రమంగా ఆఫ్ లైన్ నుంచి ఆన్ లైన్ కు వెళ్ళిపోయి పండగ సెలవుల్లో ఉన్న పిల్లలను, ఫ్యామిలీలను కదుపుతుంది. గుంటూరు కారం టికెట్లు అంత సులభంగా దొరికే ఛాన్స్ తక్కువ కాబట్టి ముందైతే హనుమాన్ చూసేద్దాం అనుకునే బాపతు ఎక్కువ ఉంటారు. ఈ విశ్లేషణలు లోతుగా చేసుకున్నాకే హనుమంతుడు ప్రీమియర్లకు జై కొట్టాడని తెలిసింది. హైదరాబాద్ లో వేసే షోకు టాలీవుడ్ సెలబ్రిటీస్ మొత్తాన్ని పిలుస్తారట.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…