సంక్రాంతి రేసులో అందరికంటే చిన్న హీరోని పెట్టుకుని పెద్ద బడ్జెట్ తో వస్తున్న హనుమాన్ మీద క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. టీమ్ క్రమం తప్పకుండా ప్రమోషన్లు యాక్టివ్ గా ఉండేలా చూసుకుంటోంది. ఒకవైపు సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అప్డేట్స్ ఇస్తూ ఇంకో వైపు ఇంటర్వ్యూలు, ఈవెంట్లు గట్రా చక్కగా ప్లాన్ చేస్తోంది. ప్రత్యేకంగా దీని మీదే ఆసక్తి ఉన్న ఆడియన్స్ కున్న టెన్షన్ ఒకటే. జనవరి 12 అదే రోజు విడుదల కాబోతున్న గుంటూరు కారం తాకిడిని ఈ ఫాంటసీ మూవీ ఎలా తట్టుకుంటుందాని. దాని కోసమే ఒక మంచి వ్యూహం సిద్ధం చేసినట్టు వినిపిస్తోంది.
అదేంటంటే ఎర్లీ ప్రీమియర్లు. గత రెండేళ్లలో చాలా సినిమాలకు ముందు రోజు సాయంత్రం లేదా రాత్రి షోలు వేయడం బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు హనుమాన్ కి అదే అనుసరించాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. దీని వల్ల ఒక లాభం ఉంది. క్రేజ్ ఉన్న పాన్ ఇండియా మూవీ. జనవరి 10 రాత్రే షోలు వేస్తే ప్రేక్షకులు ఎగబడి వస్తారు. ఎలాగూ మరుసటి రోజు మహేష్ బాబుకి ఇచ్చేయాలన్న ఉద్దేశంతో ముందే చూడాలని ఫిక్సవుతారు. పైగా మహేష్ ఫ్యాన్స్ సైతం తమ పోటీదారు కంటెంట్ ఎలా ఉందోననే ఆసక్తితో భారీ సంఖ్యలో టికెట్లు కొన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
హనుమాన్ బృందం నమ్మకాన్ని తగ్గట్టు రాత్రే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందా అది ఓ రేంజ్ లో హెల్ప్ అవుతుంది. వెంటనే కాకపోయినా ఆ టాక్ తాలూకు ప్రభావం క్రమంగా ఆఫ్ లైన్ నుంచి ఆన్ లైన్ కు వెళ్ళిపోయి పండగ సెలవుల్లో ఉన్న పిల్లలను, ఫ్యామిలీలను కదుపుతుంది. గుంటూరు కారం టికెట్లు అంత సులభంగా దొరికే ఛాన్స్ తక్కువ కాబట్టి ముందైతే హనుమాన్ చూసేద్దాం అనుకునే బాపతు ఎక్కువ ఉంటారు. ఈ విశ్లేషణలు లోతుగా చేసుకున్నాకే హనుమంతుడు ప్రీమియర్లకు జై కొట్టాడని తెలిసింది. హైదరాబాద్ లో వేసే షోకు టాలీవుడ్ సెలబ్రిటీస్ మొత్తాన్ని పిలుస్తారట.
This post was last modified on January 4, 2024 12:59 pm
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…