ఒకపక్క వాయిదా లేదహో అంటూ ఈగల్ నిర్మాతలు పోస్టర్లు వదులుతూనే ఉన్నారు. నిన్న ఎంత పోస్ట్ పోన్ ప్రచారం జరిగినప్పటికీ సాయంత్రం సెన్సార్ వచ్చిందన్న సమాచారంతో జనవరి 13 డేట్ ని మరోసారి ధృవీకరిస్తూ కొత్త స్టిల్ ఇవ్వడం రవితేజ ఫ్యాన్స్ ని రిలాక్స్ అయ్యేలా చేసింది. అయితే అది కేవలం కొద్దిగంటలకే పరిమితమయ్యింది. ఉదయం లేవగానే మళ్ళీ ఈగల్ వార్తలు షురూ. జనవరి 26 రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆ తేదీకి షిఫ్ట్ చేశారనే కొన్ని ట్వీట్లను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ఒకరు రీ పోస్ట్ చేయడంతో అనుమానం కాస్తా నిజమయ్యిందని అభిమానులు ఆందోళన చెందారు.
ఇప్పటిదాకా ఈగల్ తరఫున పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఎలాంటి అఫీషియల్ వాయిదా నోట్ రాలేదు. ఒకవేళ తప్పుకోవడం కన్ఫర్మ్ అయితే ఆ అవకాశం నా సామిరంగకు బంగారం అయిపోతుంది. ఎందుకంటే మాస్ మహారాజా కోసం బ్లాక్ చేసిన థియేటర్లు అధిక శాతం నాగార్జునకు వచ్చేస్తాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ లు సరిపడా స్క్రీన్ కౌంట్ తో పక్కా ప్లానింగ్ తో ఉన్నాయి. నాగ్ కు సైతం అన్నపూర్ణ రూపంలో స్వంత డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ఉన్నప్పటికీ తన స్థాయికి తగ్గట్టు కౌంట్ తెచ్చుకోవడం సవాల్ గా మారింది. అందుకే ఈగల్ పక్కకెళ్ళడం చాలా ప్లస్ అవుతుంది.
వీలైనంత త్వరగా వీటికి చెక్ పెట్టేలా సదరు నిర్మాతలు పూనుకుంటే మంచిది. ఫ్యాన్స్ మాత్రం వాయిదా మంచిదేనని ఫీలవుతున్నారు. ఇంత పోటీ మధ్య ఈగల్ లాంటి సీరియస్ మాస్ ఎంటర్ టైనర్ తేవడం కరెక్ట్ కాదని, దాని బదులు నెలాఖరుకు వెళ్తే మంచి ఓపెనింగ్స్ తో పాటు పాజిటివ్ టాక్ వసూళ్లకు అనుకూలంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. రవితేజ మాత్రం నాలుగైదు రోజుల నుంచి ఈగల్ కు సంబంధించిన ట్వీట్లు పెట్టడం లేదు. పబ్లిసిటీ కోసం చేసిన రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూని మేకర్స్ ఇంకా వదల్లేదు. సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తున్న ఈ రిలీజ్ డ్రామా క్లైమాక్స్ ఏంటో చూడాలి.
This post was last modified on January 4, 2024 12:33 pm
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…