పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే ఏ దర్శకుడికైనా ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. సరైన బ్లాక్ బస్టర్ పడిందా దశ తిరిగిపోతుంది. హరిహర వీరమల్లు ఆఫర్ ఒప్పుకున్నప్పుడు క్రిష్ ఫీలింగ్ ఇదే అయ్యుంటుంది. కానీ జరిగింది వేరు. షూటింగ్ లో విపరీతమైన జాప్యం, సెట్లు కూలిపోవడం, పవన్ జనసేనలో బిజీగా కావడం, వేగంగా ఓ రెండు రీమేకులు చేయాలని నిర్ణయించుకోవడం ఇవన్నీ తీవ్ర ప్రభావం చూపించాయి. ఆ గ్యాప్ లోనే వైష్ణవ్ తేజ్ తో కొండపొలం తీశాడు కానీ అది దారుణంగా డిజాస్టర్ కావడంతో పేరు రాలేదు సరికదా అసలది క్రిష్ తీసిన విషయమే ఆడియన్స్ మర్చిపోయారు.
ఇంకో వైపు వెబ్ సిరీస్ లకు టర్న్ తీసుకుని తన ఆధ్వర్యంలోనే వేరే దర్శకుడితో ప్రముఖ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా 9 అవర్స్ తీయించారు. చనిపోక ముందు తారకరత్న నటించిన మొదటి మరియు చివరి సిరీస్ ఇదే. తర్వాత కన్యాశుల్కం ఆధారంగా అంజలి-అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో శేష సిందూరావు డైరెక్షన్ లో ఇంకో సిరీస్ పూర్తి చేశారు. ఇలా టైం వేస్ట్ కాకుండా వీలైనంత బిజీగా ఉంటున్నారు కానీ మెగా ఫోన్ చేపడితే వచ్చే ఆనందం, సంతృప్తి నిర్మాణంలో రాదు. అందుకే ఓ లేడీ ఓరియెంటెడ్ కథని సిద్ధం చేసుకుని హీరోయిన్ కోసం చూస్తున్నారట.
మొదటి ఆప్షన్ గా వేదంలో చేసిన అనుష్క, రెండో ఛాయస్ గా కృష్ణం వందే జగద్గురుంలో నటించిన నయనతారను అడిగే ఆలోచనలో ఉన్నారట. స్వీటీ చిరంజీవి విశ్వంభరనే చేయాలో వద్దో తేల్చుకోలేని అయోమయంలో ఉంది. అలాంటప్పుడు క్రిష్ చెప్పే కథ మీద ఆసక్తి చూపించడం అనుమానమే. ఇక నయనతార రెమ్యునరేషన్ తట్టుకోవాలంటే బడ్జెట్ భారీగా ఉండాలి. కానీ కమర్షియల్ గా తమిళంలో తప్ప తెలుగులో ఆమెకు మార్కెట్ లేదు. సో ఇవన్నీ లెక్కలు వేసుకుని దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎంతలేదన్నా వీరమల్లుకి ఇంకో ఏడాది పట్టేలా ఉంది.
This post was last modified on January 4, 2024 10:40 am
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…