పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే ఏ దర్శకుడికైనా ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. సరైన బ్లాక్ బస్టర్ పడిందా దశ తిరిగిపోతుంది. హరిహర వీరమల్లు ఆఫర్ ఒప్పుకున్నప్పుడు క్రిష్ ఫీలింగ్ ఇదే అయ్యుంటుంది. కానీ జరిగింది వేరు. షూటింగ్ లో విపరీతమైన జాప్యం, సెట్లు కూలిపోవడం, పవన్ జనసేనలో బిజీగా కావడం, వేగంగా ఓ రెండు రీమేకులు చేయాలని నిర్ణయించుకోవడం ఇవన్నీ తీవ్ర ప్రభావం చూపించాయి. ఆ గ్యాప్ లోనే వైష్ణవ్ తేజ్ తో కొండపొలం తీశాడు కానీ అది దారుణంగా డిజాస్టర్ కావడంతో పేరు రాలేదు సరికదా అసలది క్రిష్ తీసిన విషయమే ఆడియన్స్ మర్చిపోయారు.
ఇంకో వైపు వెబ్ సిరీస్ లకు టర్న్ తీసుకుని తన ఆధ్వర్యంలోనే వేరే దర్శకుడితో ప్రముఖ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా 9 అవర్స్ తీయించారు. చనిపోక ముందు తారకరత్న నటించిన మొదటి మరియు చివరి సిరీస్ ఇదే. తర్వాత కన్యాశుల్కం ఆధారంగా అంజలి-అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో శేష సిందూరావు డైరెక్షన్ లో ఇంకో సిరీస్ పూర్తి చేశారు. ఇలా టైం వేస్ట్ కాకుండా వీలైనంత బిజీగా ఉంటున్నారు కానీ మెగా ఫోన్ చేపడితే వచ్చే ఆనందం, సంతృప్తి నిర్మాణంలో రాదు. అందుకే ఓ లేడీ ఓరియెంటెడ్ కథని సిద్ధం చేసుకుని హీరోయిన్ కోసం చూస్తున్నారట.
మొదటి ఆప్షన్ గా వేదంలో చేసిన అనుష్క, రెండో ఛాయస్ గా కృష్ణం వందే జగద్గురుంలో నటించిన నయనతారను అడిగే ఆలోచనలో ఉన్నారట. స్వీటీ చిరంజీవి విశ్వంభరనే చేయాలో వద్దో తేల్చుకోలేని అయోమయంలో ఉంది. అలాంటప్పుడు క్రిష్ చెప్పే కథ మీద ఆసక్తి చూపించడం అనుమానమే. ఇక నయనతార రెమ్యునరేషన్ తట్టుకోవాలంటే బడ్జెట్ భారీగా ఉండాలి. కానీ కమర్షియల్ గా తమిళంలో తప్ప తెలుగులో ఆమెకు మార్కెట్ లేదు. సో ఇవన్నీ లెక్కలు వేసుకుని దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎంతలేదన్నా వీరమల్లుకి ఇంకో ఏడాది పట్టేలా ఉంది.
This post was last modified on January 4, 2024 10:40 am
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…