Hero Venkatesh
ఇప్పటిదాకా రీ రిలీజ్ ట్రెండ్ లో అందరు స్టార్ హీరోలవి కవరయ్యాయి కానీ విక్టరీ వెంకటేష్ ది మాత్రం బ్యాలన్స్ ఉండిపోయింది. అభిమానులు వాళ్ళ డిమాండ్ ని నిర్మాత సురేష్ బాబు దృష్టికి తీసుకెళ్తున్నారు కానీ ఇప్పటిదాకా ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు. మొన్న డిసెంబర్ 13 వెంకీ పుట్టినరోజు సందర్భంగా ప్రేమించుకుందాం రా లేదా జయం మనదేరా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకున్నారు కానీ నెరవేరలేదు. అసలు వెంకటేష్ మనసులో ఏ సినిమా ఉందో తెలుసుకోవాలనే కుతూహలం కలగడం సహజం. దానికి ఇవాళ జరిగిన సైంధవ్ ట్రైలర్ లాంచ్ లో స్పష్టమైన సమాధానం దొరికింది.
వెంకటేష్ చూడాలనుకుంటున్న రీ రిలీజ్ నువ్వు నాకు నచ్చావ్. ఆయనే స్వయంగా ఈ మాట చెప్పడంతో అక్కడున్న వాళ్ళు చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. హాయిగా నవ్వుతూ ఎంజాయ్ చేయడానికి ఇంత కంటే మంచి ఆప్షన్ ఉండదని చెప్పడం చూస్తే దగ్గర్లోనే ప్లానింగ్ ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ మూవీ నిర్మాత స్రవంతి రవికిశోర్ గత ఏడాది నువ్వే నువ్వేని పునఃవిడుదల చేశారు. ఆ టైంలోనే నువ్వు నాకు నచ్చావ్ ప్రింట్ ని 4కె చేయించి పెట్టారు. సో ప్రింట్ సిద్ధంగా ఉంది కాబట్టి మంచి టైమింగ్ చూసుకుంటే చాలు. తెలుగు రాష్ట్రాల థియేటర్లు నవ్వులతో తడిసిపోతాయి.
కె విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వల్లే త్రివిక్రమ్ శ్రీనివాస్ స్థాయి స్టార్ రైటర్ గా మరింత ఎదిగింది. ఇప్పటికీ బోలెడు మీమ్స్ లో దీని రిఫరెన్సులు వాడుతూనే ఉంటారు. కోటి స్వరపరిచిన ఎవర్ గ్రీన్ ఆల్బమ్ మ్యూజిక్ లవర్స్ కి ఆల్ టైం ఫెవరెట్. అసలు ఒక్క ఫైట్ లేకుండా, విలన్లను పెట్టకుండా, సెకండ్ హీరోయిన్ ప్రస్తావన తేకుండా మూడు గంటల పాటు థియేటర్లలో ఆడియన్స్ ని కూర్చోబెట్టడం కష్టం. నువ్వు నాకు నచ్చావ్ ఈజీగా దాన్ని చేసి చూపించి బ్లాక్ బస్టర్ అందుకుంది. 23 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ చూసేందుకు ఇంత కన్నా బెస్ట్ ఛాయస్ కావాలా.
This post was last modified on January 3, 2024 1:13 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…