Hero Venkatesh
ఇప్పటిదాకా రీ రిలీజ్ ట్రెండ్ లో అందరు స్టార్ హీరోలవి కవరయ్యాయి కానీ విక్టరీ వెంకటేష్ ది మాత్రం బ్యాలన్స్ ఉండిపోయింది. అభిమానులు వాళ్ళ డిమాండ్ ని నిర్మాత సురేష్ బాబు దృష్టికి తీసుకెళ్తున్నారు కానీ ఇప్పటిదాకా ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు. మొన్న డిసెంబర్ 13 వెంకీ పుట్టినరోజు సందర్భంగా ప్రేమించుకుందాం రా లేదా జయం మనదేరా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకున్నారు కానీ నెరవేరలేదు. అసలు వెంకటేష్ మనసులో ఏ సినిమా ఉందో తెలుసుకోవాలనే కుతూహలం కలగడం సహజం. దానికి ఇవాళ జరిగిన సైంధవ్ ట్రైలర్ లాంచ్ లో స్పష్టమైన సమాధానం దొరికింది.
వెంకటేష్ చూడాలనుకుంటున్న రీ రిలీజ్ నువ్వు నాకు నచ్చావ్. ఆయనే స్వయంగా ఈ మాట చెప్పడంతో అక్కడున్న వాళ్ళు చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. హాయిగా నవ్వుతూ ఎంజాయ్ చేయడానికి ఇంత కంటే మంచి ఆప్షన్ ఉండదని చెప్పడం చూస్తే దగ్గర్లోనే ప్లానింగ్ ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ మూవీ నిర్మాత స్రవంతి రవికిశోర్ గత ఏడాది నువ్వే నువ్వేని పునఃవిడుదల చేశారు. ఆ టైంలోనే నువ్వు నాకు నచ్చావ్ ప్రింట్ ని 4కె చేయించి పెట్టారు. సో ప్రింట్ సిద్ధంగా ఉంది కాబట్టి మంచి టైమింగ్ చూసుకుంటే చాలు. తెలుగు రాష్ట్రాల థియేటర్లు నవ్వులతో తడిసిపోతాయి.
కె విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వల్లే త్రివిక్రమ్ శ్రీనివాస్ స్థాయి స్టార్ రైటర్ గా మరింత ఎదిగింది. ఇప్పటికీ బోలెడు మీమ్స్ లో దీని రిఫరెన్సులు వాడుతూనే ఉంటారు. కోటి స్వరపరిచిన ఎవర్ గ్రీన్ ఆల్బమ్ మ్యూజిక్ లవర్స్ కి ఆల్ టైం ఫెవరెట్. అసలు ఒక్క ఫైట్ లేకుండా, విలన్లను పెట్టకుండా, సెకండ్ హీరోయిన్ ప్రస్తావన తేకుండా మూడు గంటల పాటు థియేటర్లలో ఆడియన్స్ ని కూర్చోబెట్టడం కష్టం. నువ్వు నాకు నచ్చావ్ ఈజీగా దాన్ని చేసి చూపించి బ్లాక్ బస్టర్ అందుకుంది. 23 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ చూసేందుకు ఇంత కన్నా బెస్ట్ ఛాయస్ కావాలా.
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…
తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…