పూర్తిగా సముద్రం బ్యాక్ డ్రాప్ లో సినిమాలు ఒకప్పుడు చాలానే వచ్చేవి కానీ గత కొన్నేళ్లలో తగ్గిపోయాయి. క్రమంగా మన హీరోలకు వీటి మీద మనసు పెరుగుతోంది. దానికి నిదర్శనమే ఎంచుకుంటున్న పోస్టర్లు, వాటి వెనుక ఉన్న కథలు. నాగ చైతన్య ‘తండేల్’ పూర్తిగా ఈ నేపథ్యంలో వస్తున్న సంగతి తెలిసిందే. ప్రేమకథకు ఒక విభిన్నమైన ట్రీట్ మెంట్ తో యాక్షన్, థ్రిల్ రెండూ మిక్స్ చేస్తూ దర్శకుడు చందూ మొండేటి భారీ బడ్జెట్ తో దీన్ని రూపొందిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ ఇంకా పెద్ద స్పాన్ తో ప్యాన్ ఇండియా స్థాయిలో నీటి అలల మీద జరిగే రక్తపాతంతో కొరటాల శివ తారక్ ని చూపించబోతున్నారు.
గత ఏడాది సంక్రాంతికి వచ్చిన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో హీరో చేపలు పట్టే బోటువాడిగా కనిపించాడు. వైష్ణవ్ తేజ్ డెబ్యూ ‘ఉప్పెన’లో బుచ్చిబాబు ఏకంగా హీరో హీరోయిన్ రొమాన్స్ ని పడవ మీద నడిపించి వాహ్ అనిపించి జాతీయ అవార్డు దాకా తీసుకెళ్లాడు. చూస్తుంటే సముద్రం, పడవ ఈ రెండు సక్సెస్ ఫార్ములాగా మారేలా ఉన్నాయి. అందుకే రచయితలు, దర్శకులు నీటిని మెయిన్ సబ్జెక్టుగా తీసుకుని కథలు రాస్తున్నారు. దశాబ్దాల క్రితం ఈ తరహా ట్రీట్మెంట్ తో వచ్చిన వాటిలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి. చిరంజీవి ఆరాధన, జగపతిబాబు సముద్రం కొన్ని ఉదాహరణలు.
కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కాన్సెప్ట్ కొత్త కాకపోయినా ప్రెజెంటేషన్ లో వైవిధ్యాన్ని చూపిస్తూ ఫిలిం మేకర్స్ ప్రయోగాలు చేస్తున్నారు. ఈ మధ్య ఒకటి రెండు చిన్న సినిమాలు కూడా వచ్చాయి కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోలేదు. కానీ స్టార్ హీరోలకు ఇబ్బంది లేదు. హిట్లు పడుతున్నాయి. దేవర, తండేల్ రెండూ ఈ ఏడాదే విడుదల కానున్నాయి. వీటిలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి. బడ్జెట్ కూడా ఆ కారణంగానే భారీగా పెరుగుతోంది. అన్నట్టు సూర్య కంగువ కూడా అధిక శాతం సముద్ర తీర ప్రాంతంలోనే జరుగుతుందని యూనిట్ నుంచి అందుతున్న సమాచారం.
This post was last modified on January 1, 2024 10:27 pm
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…