ఎప్పుడూ లేనిది రామ్ చరణ్ ఈ మధ్య ముంబైకి బాగా తిరిగేస్తున్నాడు. మొదట్లో ఏదో పర్సనల్ ట్రిప్ కోసమని అందరూ అనుకున్నారు కానీ ఏకంగా ఒక ఫ్లాట్ తీసుకుని మరీ వెళ్ళినప్పుడంతా అక్కడ మకాం వేయడం కొత్త వార్తలకు చోటిచ్చింది. అధిక సందర్భాల్లో సతీ సమేతంగా వెళ్లిన చరణ్ తన పర్యటనకు సంబంధించి ఎయిర్ పోర్ట్, గుళ్ళు గోపురాల ఫోటోలు వీడియోలు తప్ప ఇంకేదీ బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ధూమ్ 4ని యష్ రాజ్ ఫిలిమ్స్ షారుఖ్ ఖాన్ తో ప్లాన్ చేస్తోందని, అందులో మరో హీరోగా చరణ్ నే అనుకుంటున్నారని ప్రచారం మొదలైపోయింది.
వాస్తవానికి ధూమ్ 4 ప్రతిపాదన నిజమే కానీ అది షారుఖ్ చరణ్ కాంబినేషన్ లో మాత్రం కాదని ముంబై వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ ఏడాది మూడు సినిమాలతో అభిమానులకు నాన్ స్టాప్ ట్రీట్ ఇచ్చిన బాద్షా 2024లో తెరమీద కనిపించకపోవచ్చు. బ్రేక్ తీసుకునే ఆలోచనలో ఉన్నాడు. అసలు ధూమ్ 4 కథే తన దగ్గరకు వెళ్లలేదని వినికిడి. ఒకవేళ చరణ్ తో నిజంగా ఫిక్స్ చేయాలనుకున్నా ఆ మల్టీస్టారర్లో వేరే హీరోని భాగం చేస్తారని తెలిసింది. ఇది కాసేపు పక్కనపెడితే పలువురు బాలీవుడ్ ఫిలిం మేకర్స్ తో రామ్ చరణ్ చర్చలు జరిపి వస్తున్న మాట వాస్తవం.
జంజీర్ టైంలో తనను ట్రోలింగ్ చేసే రేంజ్ లో వార్తలు రాసిన నార్త్ మీడియాతోనే మెచ్చుకోలు పొందాలంటే ఒక స్ట్రెయిట్ హిందీ మూవీ ద్వారా ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని చూస్తున్న చరణ్ దాన్ని ఆర్ఆర్ఆర్ తో కొంత భాగం నెరవేర్చుకున్నా అది డబ్బింగ్ మూవీ కావడం వల్ల టార్గెట్ పూర్తిగా చేరుకున్నట్టు కాదు. సంజయ్ లీలా భన్సాలీ, మధుర్ బండార్కర్, అశుతోష్ గోవరికర్ తదితరులు టాలీవుడ్ స్టార్లతో సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు కానీ సాధ్యపడటం లేదు. రామ్ చరణ్ తో డిజిటల్ డెబ్యూ చేయించేందుకు నెట్ ఫ్లిక్స్ కూడా గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్టు ఓటిటి వర్గాల కథనం.
ఇప్పుడు టాలీవుడ్లో ఏదైనా సినిమా వేడుక జరిగిందంటే చాలు.. అందులో పరిశ్రమ కష్టాల గురించి తప్పకుండా ప్రస్తావన ఉంటుంది. తెలుగు…
ఏపీ రాజధాని అమరావతిలో పనుల నిర్మాణం వేగంగా జరుగుతోందని మంత్రి నారాయణ తెలిపారు. ఇక్కడ సంస్థలను ఏర్పాటు చేసేందుకు అనేక…
సంచలన తీర్పును వెలువరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. వేశ్యావృత్తికి సంబంధించి చట్టపరమైన స్థితిని.. సెక్స్ వర్కర్ల ప్రాథమిక హక్కులపై…
తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన వారసత్వం ఉన్న కుటుంబాల్లో నందమూరి వారిది ముందు వరుసలో ఉంటుంది. సీనియర్ ఎన్టీఆర్ లెగసీని…
సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద బూతు అన్నట్లుగా కొందరు నాయకులు చేసే కామెంట్లు హిందువులకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తుంటాయి.…
వైసీపీ అధికారంలో ఉండగా.. ఆపార్టీకి చెందిన నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…