ఆటోనగర్ సూర్య.. విలక్షణ దర్శకుడు దేవా కట్టా కెరీర్ను అల్లకల్లోలం చేసిన సినిమా. మొదలు పెట్టిన మూడేళ్లకు కానీ ఇది పూర్తి కాలేదు. షూటింగ్ మధ్యలో ఆగిపోయి, విడుదల కోసం చాలా కాలం ఎదురు చూసిందీ చిత్రం. మేకింగ్ దశలో చాలా ఇబ్బందుల్ని అధిగమించి అతి కష్టం మీద ఈ సినిమాను బయటికి తీసుకొచ్చాడు దేవా. చివరికి ఆ సినిమా ఆశించిన ఫలితాన్నందుకోలేదు. దీని వల్ల దేవా కెరీర్లో విలువైన కాలం వృథా అయింది. ఆ సినిమా తర్వాత అతను ఏ దశలోనూ కోలుకోలేదు. కెరీర్లో మరింత గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత చేసిన డైనమైట్ కూడా ఆడలేదు. హిందీలో చేసిన ప్రస్థానం కూడా తేడా కొట్టింది. చివరికిప్పుడు సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ పొలిటికల్ థ్రిల్లర్ మొదలుపెట్టాడు. లాక్ డౌన్ తర్వాత ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది.
ఐతే తన కెరీర్ దెబ్బ తినడానికి కారణమైన ఆటోనగర్ సూర్య సినిమా అలా తయారవడానికి నిర్మాతలే కారణమని ఓ ఇంటర్వ్యూలో దేవా అసహనం వ్యక్తం చేశాడు. నిర్మాతలు అని కానీ.. వారి పేర్లు కానీ చెప్పకుండా ఆ సినిమా విషయంలో తాను కొందరు దొంగల ముఠా కారణంగా మోసానికి గురయ్యానని దేవా చెప్పాడు. వెన్నెల, ప్రస్థానం సినిమాలు మాత్రమే పూర్తిగా తన నియంత్రణతో తెరకెక్కాయని.. తర్వాత తాను చేసిన సినిమాలు తన చేతులు దాటి వెళ్లిపోయాయని దేవా అన్నాడు. ఆటోనగర్ సూర్య సినిమాను నిర్మించింది ఆర్ఆర్ మూవీ మేకర్స్. ఒక దశలో మంచి ఊపుతో కనిపించిన ఈ సంస్థ.. ఉన్నట్లుండి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఆటోనగర్ సూర్య కంటే ముందు నాగార్జున నటించిన ఢమరుకం సైతం ఇలాగే ఇబ్బందుల్లో చిక్కుకుని ఆలస్యంగా విడుదలైంది. ఆటోనగర్ సూర్య తర్వాత ఈ సంస్థ మూతపడిపోయిన సంగతి తెలిసిందే.
This post was last modified on April 27, 2020 10:14 am
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…