ఆటోనగర్ సూర్య.. విలక్షణ దర్శకుడు దేవా కట్టా కెరీర్ను అల్లకల్లోలం చేసిన సినిమా. మొదలు పెట్టిన మూడేళ్లకు కానీ ఇది పూర్తి కాలేదు. షూటింగ్ మధ్యలో ఆగిపోయి, విడుదల కోసం చాలా కాలం ఎదురు చూసిందీ చిత్రం. మేకింగ్ దశలో చాలా ఇబ్బందుల్ని అధిగమించి అతి కష్టం మీద ఈ సినిమాను బయటికి తీసుకొచ్చాడు దేవా. చివరికి ఆ సినిమా ఆశించిన ఫలితాన్నందుకోలేదు. దీని వల్ల దేవా కెరీర్లో విలువైన కాలం వృథా అయింది. ఆ సినిమా తర్వాత అతను ఏ దశలోనూ కోలుకోలేదు. కెరీర్లో మరింత గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత చేసిన డైనమైట్ కూడా ఆడలేదు. హిందీలో చేసిన ప్రస్థానం కూడా తేడా కొట్టింది. చివరికిప్పుడు సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ పొలిటికల్ థ్రిల్లర్ మొదలుపెట్టాడు. లాక్ డౌన్ తర్వాత ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది.
ఐతే తన కెరీర్ దెబ్బ తినడానికి కారణమైన ఆటోనగర్ సూర్య సినిమా అలా తయారవడానికి నిర్మాతలే కారణమని ఓ ఇంటర్వ్యూలో దేవా అసహనం వ్యక్తం చేశాడు. నిర్మాతలు అని కానీ.. వారి పేర్లు కానీ చెప్పకుండా ఆ సినిమా విషయంలో తాను కొందరు దొంగల ముఠా కారణంగా మోసానికి గురయ్యానని దేవా చెప్పాడు. వెన్నెల, ప్రస్థానం సినిమాలు మాత్రమే పూర్తిగా తన నియంత్రణతో తెరకెక్కాయని.. తర్వాత తాను చేసిన సినిమాలు తన చేతులు దాటి వెళ్లిపోయాయని దేవా అన్నాడు. ఆటోనగర్ సూర్య సినిమాను నిర్మించింది ఆర్ఆర్ మూవీ మేకర్స్. ఒక దశలో మంచి ఊపుతో కనిపించిన ఈ సంస్థ.. ఉన్నట్లుండి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఆటోనగర్ సూర్య కంటే ముందు నాగార్జున నటించిన ఢమరుకం సైతం ఇలాగే ఇబ్బందుల్లో చిక్కుకుని ఆలస్యంగా విడుదలైంది. ఆటోనగర్ సూర్య తర్వాత ఈ సంస్థ మూతపడిపోయిన సంగతి తెలిసిందే.
This post was last modified on April 27, 2020 10:14 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…