ఆటోనగర్ సూర్య.. విలక్షణ దర్శకుడు దేవా కట్టా కెరీర్ను అల్లకల్లోలం చేసిన సినిమా. మొదలు పెట్టిన మూడేళ్లకు కానీ ఇది పూర్తి కాలేదు. షూటింగ్ మధ్యలో ఆగిపోయి, విడుదల కోసం చాలా కాలం ఎదురు చూసిందీ చిత్రం. మేకింగ్ దశలో చాలా ఇబ్బందుల్ని అధిగమించి అతి కష్టం మీద ఈ సినిమాను బయటికి తీసుకొచ్చాడు దేవా. చివరికి ఆ సినిమా ఆశించిన ఫలితాన్నందుకోలేదు. దీని వల్ల దేవా కెరీర్లో విలువైన కాలం వృథా అయింది. ఆ సినిమా తర్వాత అతను ఏ దశలోనూ కోలుకోలేదు. కెరీర్లో మరింత గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత చేసిన డైనమైట్ కూడా ఆడలేదు. హిందీలో చేసిన ప్రస్థానం కూడా తేడా కొట్టింది. చివరికిప్పుడు సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ పొలిటికల్ థ్రిల్లర్ మొదలుపెట్టాడు. లాక్ డౌన్ తర్వాత ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది.
ఐతే తన కెరీర్ దెబ్బ తినడానికి కారణమైన ఆటోనగర్ సూర్య సినిమా అలా తయారవడానికి నిర్మాతలే కారణమని ఓ ఇంటర్వ్యూలో దేవా అసహనం వ్యక్తం చేశాడు. నిర్మాతలు అని కానీ.. వారి పేర్లు కానీ చెప్పకుండా ఆ సినిమా విషయంలో తాను కొందరు దొంగల ముఠా కారణంగా మోసానికి గురయ్యానని దేవా చెప్పాడు. వెన్నెల, ప్రస్థానం సినిమాలు మాత్రమే పూర్తిగా తన నియంత్రణతో తెరకెక్కాయని.. తర్వాత తాను చేసిన సినిమాలు తన చేతులు దాటి వెళ్లిపోయాయని దేవా అన్నాడు. ఆటోనగర్ సూర్య సినిమాను నిర్మించింది ఆర్ఆర్ మూవీ మేకర్స్. ఒక దశలో మంచి ఊపుతో కనిపించిన ఈ సంస్థ.. ఉన్నట్లుండి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఆటోనగర్ సూర్య కంటే ముందు నాగార్జున నటించిన ఢమరుకం సైతం ఇలాగే ఇబ్బందుల్లో చిక్కుకుని ఆలస్యంగా విడుదలైంది. ఆటోనగర్ సూర్య తర్వాత ఈ సంస్థ మూతపడిపోయిన సంగతి తెలిసిందే.
This post was last modified on April 27, 2020 10:14 am
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…
ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…
రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్ ట్రిబ్యునల్…