ఆటోనగర్ సూర్య.. విలక్షణ దర్శకుడు దేవా కట్టా కెరీర్ను అల్లకల్లోలం చేసిన సినిమా. మొదలు పెట్టిన మూడేళ్లకు కానీ ఇది పూర్తి కాలేదు. షూటింగ్ మధ్యలో ఆగిపోయి, విడుదల కోసం చాలా కాలం ఎదురు చూసిందీ చిత్రం. మేకింగ్ దశలో చాలా ఇబ్బందుల్ని అధిగమించి అతి కష్టం మీద ఈ సినిమాను బయటికి తీసుకొచ్చాడు దేవా. చివరికి ఆ సినిమా ఆశించిన ఫలితాన్నందుకోలేదు. దీని వల్ల దేవా కెరీర్లో విలువైన కాలం వృథా అయింది. ఆ సినిమా తర్వాత అతను ఏ దశలోనూ కోలుకోలేదు. కెరీర్లో మరింత గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత చేసిన డైనమైట్ కూడా ఆడలేదు. హిందీలో చేసిన ప్రస్థానం కూడా తేడా కొట్టింది. చివరికిప్పుడు సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ పొలిటికల్ థ్రిల్లర్ మొదలుపెట్టాడు. లాక్ డౌన్ తర్వాత ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది.
ఐతే తన కెరీర్ దెబ్బ తినడానికి కారణమైన ఆటోనగర్ సూర్య సినిమా అలా తయారవడానికి నిర్మాతలే కారణమని ఓ ఇంటర్వ్యూలో దేవా అసహనం వ్యక్తం చేశాడు. నిర్మాతలు అని కానీ.. వారి పేర్లు కానీ చెప్పకుండా ఆ సినిమా విషయంలో తాను కొందరు దొంగల ముఠా కారణంగా మోసానికి గురయ్యానని దేవా చెప్పాడు. వెన్నెల, ప్రస్థానం సినిమాలు మాత్రమే పూర్తిగా తన నియంత్రణతో తెరకెక్కాయని.. తర్వాత తాను చేసిన సినిమాలు తన చేతులు దాటి వెళ్లిపోయాయని దేవా అన్నాడు. ఆటోనగర్ సూర్య సినిమాను నిర్మించింది ఆర్ఆర్ మూవీ మేకర్స్. ఒక దశలో మంచి ఊపుతో కనిపించిన ఈ సంస్థ.. ఉన్నట్లుండి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఆటోనగర్ సూర్య కంటే ముందు నాగార్జున నటించిన ఢమరుకం సైతం ఇలాగే ఇబ్బందుల్లో చిక్కుకుని ఆలస్యంగా విడుదలైంది. ఆటోనగర్ సూర్య తర్వాత ఈ సంస్థ మూతపడిపోయిన సంగతి తెలిసిందే.
This post was last modified on April 27, 2020 10:14 am
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…