మాస్ మహారాజా రవితేజ హనుమాన్ లోని కోటి అనే కీలకమైన ఒక కోతి పాత్రకు డబ్బింగ్ చెప్పడం ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తుతోంది. ఈగల్ కు ఒక రోజు ముందు పోటీగా వస్తున్నా సరే అదేమీ పట్టించుకోకుండా తన వంతు చేయూతనివ్వడం మంచిదే. మాస్ మహారాజా ఇలా గొంతు ఇవ్వడం ఇది మొదటిసారి కాదు. రాజమౌళి ‘మర్యాదరామన్న’లో సునీల్ తొక్కే సైకిల్ కి ఆయన ఇచ్చిన మాటలు థియేటర్లో మాములుగా పేలలేదు. మంచు విష్ణు ‘దూసుకెళ్తా’లో వాయిస్ ఓవర్, నాని నిర్మించిన ‘అ!’ లో చెట్టుకి తనే స్వరం కావడం, ‘మహావీరుడు’లో ఆకాశవాణిగా వినిపించడం ఇవన్నీ హిట్లే.
ఇదంతా బాగానే ఉంది కానీ కోటికి గొంతు రవితేజ ఇస్తున్నప్పుడు మరి అసలైన హనుమంతుడికి ఎవరు ఇస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి ట్రైలర్ చూశాక ఆ కళ్ళు చిరంజీవిని పోలి ఉన్నాయని, ఇష్టమైన దైవం కనక ఆయనేమైనా స్పెషల్ క్యామియో చేశారేమోనని ఫ్యాన్స్ సందేహపడ్డారు. కానీ అలాంటిదేమి లేదట. హనుమాన్ సాక్షాత్కారం ఉంటుంది కానీ అది ఎవరూ పోషించలేదని, పూర్తిగా విజువల్ ఎఫెక్ట్స్ సృష్టించిన ఒక రూపాన్ని మాత్రమే చూస్తారని, మాటలు కూడా ఉండవని యూనిట్ నుంచి వస్తున్న సమాచారం. తేజ సజ్జ బాడీలోకి ప్రవేశించి తనతోనే పలుకుతాడట.
సో ఒక ముఖ్యమైన డౌట్ తీరిపోయినట్టే. జనవరి 12 విడుదల కాబోతున్న హనుమాన్ ని ముందో వెనుకో వచ్చేలా డేట్ మార్చుకోమని ఎంత ఒత్తిడి వస్తున్నా సరే నిర్మాత మాత్రం తగ్గడం లేదు. తెలుగులో థియేటర్లు తక్కువ దొరికినా సరే మంచి టైంలో నార్త్ ఇండియాలో దొరికిన అవకాశాన్ని పోగొట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారని తెలిసింది. గ్రాఫిక్స్ మూవీ అయినప్పటికీ ఎమోషన్ ప్లస్ డివోషన్ సరైన పాళ్ళలో కలిపి దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త అనుభూతినిస్తాడని అంటున్నారు. కాకపోతే మహేష్ బాబు, వెంకటేష్, రవితేజ, నాగార్జునలతో పోటీ అయితే అంత సులభం కాదు.
This post was last modified on December 27, 2023 2:56 pm
ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ పెద్ది ఏప్రిల్ 30 రావడం లేదనే వార్త సోషల్ మీడియాని కుదిపేస్తోంది. ఖచ్చితంగా రిలీజ్…
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, దీనికి సంబంధించి నియమించిన పీసీ ఘోష్ నివేదిక అంశాలపై తెలంగాణ అసెంబ్లీలో నిన్న స్వల్పకాలిక చర్చ…
విశాఖపట్నం గాజువాక పరిధిలోని ఎల్వీ నగర్లో దారుణ ఘటన వెలుగుచూసింది. నేవీ ఉద్యోగి రవీంద్ర తనకు పరిచయమైన మౌనిక (29)ను…
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ రంగంలో అడుగు పెట్టి.. హీరోగా ఒక స్థాయి అందుకోవడం తేలికైన విషయం కాదు. చాలా…
ఆదివారం రోజు దురంధర్ ది రివెంజ్ తర్వాత మల్టీప్లెక్సుల ప్రీమియం స్క్రీన్లలో టికెట్లు దొరకని సినిమా ఏదంటే ప్రాజెక్ట్ హెయిల్…
తమిళనాడులో మొన్న ఉగాదికి విడుదలైన యూత్ పదకొండు రోజులకే యాభై కోట్ల వసూళ్లు దాటేసి సూపర్ హిట్ ముద్ర వేయించేసుకుంది.…