మాములుగా ఎంత పెద్ద బ్లాక్ బస్టరైనా సరే వీకెండ్ తర్వాత నెమ్మదించడం సహజం. దానికి ఎవరూ మినహాయింపు కాదు. చాలా అరుదుగా అది కూడా ఎక్కువ సెలవులు ఉన్న టైంలో హౌస్ ఫుల్స్ కొనసాగుతుంటాయి. కానీ సలార్ కు అయోమయంతో కూడిన విచిత్రమైన పరిస్థితి ఎదురవుతోంది. నిన్న హఠాత్తుగా బుధు, గురువారాలకు సంబంధించిన హిందీ వెర్షన్ బుకింగ్స్ పలు మల్టీప్లెక్సులు మొదలుపెట్టాయి. అందులో ఏముంది అనుకోవద్దు. తెల్లవారుఝమున అయిదు, ఆరు గంటలకు షోలు చూపించి వాటిని బ్లాక్ చేసి పెట్టారు. అంటే హౌస్ ఫుల్ అని జనం అనుకునేలా.
నిజానికి ఇంత చలిలో వర్కింగ్ డే రోజు అంత ఉదయాన్నే టికెట్లు మొత్తం అమ్ముడుపోవడం అసాధ్యం. దీన్ని పట్టుకుని నార్త్ ట్రేడ్ విశ్లేషకులు, తమను దెబ్బ కొట్టారన్న దుగ్దతో ఉన్న షారుఖ్ ఖాన్ అభిమానులు స్క్రీన్ షాట్లు తీసి ఇదిగో కార్పొరేట్ బుకింగ్ అంటూ బురద జల్లడం మొదలుపెట్టారు. ఏదో ఒకటి రెండు చోట్ల అంటే ఏమో అనుకోవచ్చు. కానీ అన్ని మల్టీప్లెక్సుల్లో ప్రతి ఉదయం ఆట ఫుల్ కావడమంటే అనుమానించాల్సిన విషయమే. ఇది ట్రోలింగ్ కి దారి తీస్తోంది. కొందరు రిలీజ్ కు ముందు పివిఆర్ ఐనాక్స్ తో షోల షేరింగ్ తో తలెత్తిన సమస్యతో దీన్ని ముడిపెడుతున్నారు.
నిజానిజాలు వీలైనంత త్వరగా హోంబాలే ఫిలింస్ తవ్వి తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కావాలని కలెక్షన్ల కోసం ఇలా స్పెషల్ షోలను ఫుల్ చేసి చూపిస్తున్నారనే యాంటీ ఫ్యాన్స్ విమర్శలకు సమాధానం చెప్పకపోతే అది తప్పుడు సంకేతాలకు దారి తీస్తుంది. హిందీలో సలార్ రికార్డులు బద్దలు కొట్టకపోయినా వంద కోట్లను దాటికి మంచి రన్ కొనసాగిస్తోంది. అలాంటప్పుడు ఇలాంటి ప్రచారాలు జరగడం ఎంత మాత్రం మంచిది కాదు. క్రిస్మస్ తర్వాత తెలుగులోనే వేయని స్పెషల్ షోలు ఢిల్లీ, ముంబై, కోల్కతాలో వేశారంటే ఇదేదో కుట్రలాగే ఉందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
This post was last modified on December 27, 2023 10:48 am
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…
ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్కు…
ఎన్నికలు ఏవైనా.. ప్రజలకు 'ఫ్రీ బీస్' ఉండాల్సిందే. అవి స్థానికమా.. అసెంబ్లీనా, పార్లమెంటా? అనే విషయంతో సంబంధం లేకుండా పోయింది.…