Movie News

త్రిప్తి డిమ్రి కొత్త సినిమా ఒప్పుకుంది

యానిమల్ లో పేరుకు సెకండ్ హీరోయిన్ అయినా రష్మిక మందన్నని మించి పేరు తెచ్చుకున్న త్రిప్తి డిమ్రి మీద ఆఫర్ల వర్షం కురుస్తున్నా తను మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. సౌత్ నుంచి పెద్ద ఎత్తున కాల్స్ వెళ్లాయి కానీ తనే స్పందించలేదని ముంబై టాక్. రవితేజ మిస్టర్ బచ్చన్ లో తీసుకున్నారనే ప్రచారం జరిగింది తర్వాత అదంతా పుకారేనని అర్థమైపోయింది. ఇప్పటిదాకా వెబ్ సిరీస్, సపోర్టింగ్ రోల్స్ తో నెట్టుకుంటూ వచ్చిన త్రిప్తి డిమ్రికి సరైన అవకాశాలు తలుపు తడుతున్నాయి. అందులో భాగంగా క్రేజీ సీక్వెల్ లో నటించేందుకు సంతకం పెట్టిందని సమాచారం.

తొంబై దశకం 1990లో యూత్ ని ఊపేసిన ఆషీకీకి కొనసాగింపు 2013లో వచ్చింది. రెండూ మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ గా సంగీత ప్రియుల హృదయాల్లో ప్రత్యేక చోటు సంపాదించుకున్నాయి. అప్పటి నుంచి మూడో భాగం కావాలనే డిమాండ్ వచ్చింది కానీ ఫైనల్ గా ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. అనురాగ్ బసు దర్శకత్వంలో ఆషీకీ 3ని తెరకెక్కించబోతున్నారు. యానిమల్ నిర్మించిన టి సిరీస్ భూషణ్ కుమార్ దీనికి నిర్మాత కావడం గమనించాల్సిన విషయం. ఆషీకీ ఫ్రాంచైజ్ మీద సర్వ హక్కులు కొనసాగిస్తున్న ఈ సంస్థ థర్డ్ పార్ట్ ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు.

హీరో ఎవరయ్యా అంటే కార్తిక్ ఆర్యన్ కథానాయకుడిగా కనిపించబోతున్నాడు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో ఇవ్వబోతున్నారు. 2024 ఏప్రిల్ లోగా షూటింగ్ మొదలుపెట్టి ఆపై ఏడాది ప్రథమార్థంలో విడుదల చేసేలా ప్రణాళిక వేస్తున్నారు. త్రిప్తి డిమ్రి ఇప్పుడో బ్రాండ్ గా మారడంతో ఆషికి 3కి క్రేజ్ మరింత తోడవుతుంది. మంచి ఛాన్స్ వస్తే తెలుగు తమిళ సినిమాల్లోనూ నటించేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతున్న త్రిప్తి డిమ్రికి కథలు చెప్పి ఒప్పించే దర్శకులు కావాలి. ఒక టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోతో జోడి సెట్ చేసేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇన్ సైడ్ టాక్.

This post was last modified on December 26, 2023 7:22 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

బాలయ్య బ్యాక్ టు డ్యూటీ

ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…

23 mins ago

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

2 hours ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

3 hours ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

3 hours ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

3 hours ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

4 hours ago