సలార్ టీజర్ వచ్చినప్పుడు అందులో ప్రభాస్ ని సరిగా చూపించలేకపోయినా టినూ ఆనంద్ తో చెప్పించిన డైనోసర్ డైలాగు ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చింది. అడవిలో ఎన్ని జంతువులు ఉన్నా ఒక్క రాకాసి బల్లి ఉండగా అవన్నీ బలాదూర్ అనే రేంజ్ లో జనాలకా మాట బాగా కనెక్ట్ అయిపోయింది. తీరా థియేటర్ లో ఆ సీన్ ఎప్పుడు వస్తుందాని ఎదురు చూస్తే ఇంతకీ రాకపోవడం ఫ్యాన్స్ నే కాదు సగటు ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఎవరి దాకో ఎందుకు సాక్ష్యాత్తు రాజమౌళి కేవలం ఈ ఒక్క ఎపిసోడ్ కోసమే థియేటర్ కు వెళ్తానని వీడియో ఇంటర్వ్యూలో చెప్పడం ప్రత్యక్షంగా చూశాం.
కట్ చేస్తే దానికి కారణమేంటో అంతర్గతంగా తెలుస్తోంది. అది ఎడిటింగ్ లో పోలేదట. సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వంలో దేవా తండ్రిగా వచ్చే అసలు ప్రభాస్ ఎంట్రీకి దాన్ని వాడుకుంటారట. ఈశ్వరిరావుని భర్తను చూపించకుండా తెలివిగా మేనేజ్ చేసిన ప్రశాంత్ నీల్ ఎండ్ టైటిల్స్ లో ఒక రాతి విగ్రహం లుక్ లో కోరమీసాలతో ప్రభాస్ ని చూపించి చూపించకుండా రివీల్ చేశాడు. అదే తర్వాత భాగంలో మనం చూడబోయే అసలు విశ్వరూపం. ఇవాళ వచ్చిన మూడో లిరికల్ వీడియోని నిశితంగా గమనిస్తే ఇది అర్థమైపోతుంది. సో డైనోసర్ ఎందుకు లేడో క్లారిటీ వచ్చేసిందిగా.
కాకపోతే సలార్ 2 కోసం కాస్త ఎక్కువ వెయిటింగ్ చేయక తప్పేలా లేదు. ఎందుకంటే చాలా షూటింగ్ బ్యాలన్స్ ఉంది. ప్రభాస్ ముందు కల్కి ఆ తర్వాత మారుతీ సినిమా పూర్తి చేయాలి. సందీప్ వంగా స్పిరిట్ మొదలుపెట్టేలోగా సలార్ 2కి శ్రీకారం చుట్టకపోవచ్చు. బాహుబలి లాగా సీక్వెల్ కోసం కనీసం రెండేళ్లు ఎదురు చూడాల్సి వచ్చేలా ఉంది. అప్డేట్ ఇవ్వడానికి చాలా టైం పట్టొచ్చు. సలార్ ఫైనల్ రన్ అయ్యాకే దీని గురించి ప్రకటన ఇస్తారు. ఆర్టిస్టుల కాల్ షీట్స్ తీసుకుంటే తప్ప కన్ఫర్మ్ గా ఎప్పుడనేది చెప్పలేమని సలార్ కు పని చేస్తున్న యూనిట్ సభ్యుల మాట. వెయిట్ చేయాలి మరి.
This post was last modified on December 26, 2023 9:50 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…