నిన్న విజయవాడలో వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. తాను ఎవరిని ఉద్దేశించి తీయలేదని చెబుతూ వచ్చిన వర్మ ఇది పూర్తిగా జగన్ సర్కార్ కి ప్రయోజనం కలిగించేలా, చంద్రబాబు-లోకేష్-పవన్ లను పర్సనల్ గా టార్గెట్ చేసేలా ఉందని ట్రైలర్, పోస్టర్లు చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. నిన్న ఏపీ అధికార పార్తీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కావడం చూస్తే చెప్పొచ్చు ఎజెండా ఏమై ఉంటుందో. మినిస్టర్ రోజా తన ప్రసంగంలో భాగంగా వర్మ మీద పొగడ్తల వర్షం కురిపించారు. బెజవాడ గడ్డ మీద పుట్టిన ముద్దుబిడ్డ అంటూ బాలీవుడ్ దాకా ఎదిగిన వైనాన్ని ప్రశంసల రూపంలో గుప్పించారు.
ఆవిడ చెప్పిన మాటలు ఒక పది పదిహేనేళ్ల క్రితం వరకు అందరూ ఒప్పుకునేవే. శివ లాంటి పాత్ బ్రేకింగ్ మూవీతో టాలీవుడ్ వేగాన్ని మార్చింది ఈయనే. రంగీలా, సత్య, సర్కార్ లతో తెలుగువాడి సత్తాని ముంబైలో చాటింది కూడా వర్మనే. కృష్ణవంశీ, పూరి జగన్నాథ్, తేజ లాంటి ఎన్నో యంగ్ టాలెంట్స్ అయన శిష్యరికం నుంచి వచ్చినవే. కానీ చాలా కాలంగా వర్మ తమ ముద్రను కోల్పోయి కేవలం బ్రాండ్ ని క్యాష్ చేసుకోవడం కోసం వివాదాలను ఎంచుకుని దాని మీద సినిమాలు తీయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా వైసిపితో చేతులు కలిపినప్పటి నుంచి ఇది మరీ ఎక్కువయ్యింది.
ఇప్పుడీ వ్యూహం కూడా అందులో భాగంగా వచ్చిందే. ఈవెంట్ కి జనం పెద్దగా రాలేదు. స్టార్ అట్రాక్షన్ లేకపోవడంతో స్వచ్చందంగా తరలి వచ్చిన వాళ్ళు లేరు. ఉన్నంతలో మంత్రుల అనుచరగణాల హంగామానే ఎక్కువగా కనిపించింది. 29 విడుదల కాబోతున్న వ్యూహంకు ఇంకా రూట్ క్లియర్ కాలేదు. 27న కోర్టు వాయిదా ఉంది. ఆ రోజు కనక తీర్పు ప్రతికూలంగా వస్తే రిలీజ్ కు బ్రేకులు పడతాయి. లేదూ సానుకూలంగా వస్తే మాత్రం థియేటర్లలో అడుగు పెడుతుంది. కళ్యాణ్ రామ్ డెవిల్, బబుల్ గమ్ పోటీ ఉంది కాబట్టి బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ తెచ్చుకోవడం వ్యూహంకు పెద్ద సవాలే
This post was last modified on December 24, 2023 12:05 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…