నిన్న విజయవాడలో వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. తాను ఎవరిని ఉద్దేశించి తీయలేదని చెబుతూ వచ్చిన వర్మ ఇది పూర్తిగా జగన్ సర్కార్ కి ప్రయోజనం కలిగించేలా, చంద్రబాబు-లోకేష్-పవన్ లను పర్సనల్ గా టార్గెట్ చేసేలా ఉందని ట్రైలర్, పోస్టర్లు చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. నిన్న ఏపీ అధికార పార్తీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కావడం చూస్తే చెప్పొచ్చు ఎజెండా ఏమై ఉంటుందో. మినిస్టర్ రోజా తన ప్రసంగంలో భాగంగా వర్మ మీద పొగడ్తల వర్షం కురిపించారు. బెజవాడ గడ్డ మీద పుట్టిన ముద్దుబిడ్డ అంటూ బాలీవుడ్ దాకా ఎదిగిన వైనాన్ని ప్రశంసల రూపంలో గుప్పించారు.
ఆవిడ చెప్పిన మాటలు ఒక పది పదిహేనేళ్ల క్రితం వరకు అందరూ ఒప్పుకునేవే. శివ లాంటి పాత్ బ్రేకింగ్ మూవీతో టాలీవుడ్ వేగాన్ని మార్చింది ఈయనే. రంగీలా, సత్య, సర్కార్ లతో తెలుగువాడి సత్తాని ముంబైలో చాటింది కూడా వర్మనే. కృష్ణవంశీ, పూరి జగన్నాథ్, తేజ లాంటి ఎన్నో యంగ్ టాలెంట్స్ అయన శిష్యరికం నుంచి వచ్చినవే. కానీ చాలా కాలంగా వర్మ తమ ముద్రను కోల్పోయి కేవలం బ్రాండ్ ని క్యాష్ చేసుకోవడం కోసం వివాదాలను ఎంచుకుని దాని మీద సినిమాలు తీయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా వైసిపితో చేతులు కలిపినప్పటి నుంచి ఇది మరీ ఎక్కువయ్యింది.
ఇప్పుడీ వ్యూహం కూడా అందులో భాగంగా వచ్చిందే. ఈవెంట్ కి జనం పెద్దగా రాలేదు. స్టార్ అట్రాక్షన్ లేకపోవడంతో స్వచ్చందంగా తరలి వచ్చిన వాళ్ళు లేరు. ఉన్నంతలో మంత్రుల అనుచరగణాల హంగామానే ఎక్కువగా కనిపించింది. 29 విడుదల కాబోతున్న వ్యూహంకు ఇంకా రూట్ క్లియర్ కాలేదు. 27న కోర్టు వాయిదా ఉంది. ఆ రోజు కనక తీర్పు ప్రతికూలంగా వస్తే రిలీజ్ కు బ్రేకులు పడతాయి. లేదూ సానుకూలంగా వస్తే మాత్రం థియేటర్లలో అడుగు పెడుతుంది. కళ్యాణ్ రామ్ డెవిల్, బబుల్ గమ్ పోటీ ఉంది కాబట్టి బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ తెచ్చుకోవడం వ్యూహంకు పెద్ద సవాలే
This post was last modified on December 24, 2023 12:05 pm
ఏపీలోని కోనసీమ ప్రాంతంలో కొబ్బరి సాగు ఎక్కువ. దేశంలో కేరళ తర్వాత.. కోనసీమలో భారీ ఎత్తున కొబ్బరి సాగు చేస్తున్నారు.…
సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్ రన్ తో రికార్డులు సృష్టించిన మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా స్లో అయిపోయింది.…
ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక…
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…
టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…
2023లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న…