కొత్త హీరో ఎవరైనా లాంచ్ అయ్యే సమయంలో డెబ్యూ రిలీజ్ డేట్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. వీలైనంత ఎక్కువ ప్రేక్షకులకు చేరుకోవాలంటే ప్రమోషన్లతో పాటు రిలీజ్ టైమింగ్ చాలా ముఖ్యం. యాంకర్ సుమ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజీవ్ కనకాల వారసుడు రోషన్ కనకాల హీరోగా పరిచయమవుతున్న బబుల్ గమ్ ఈ నెల 29న విడుదల కాబోతోంది. పబ్లిసిటీ గట్రా బాగానే చేస్తున్నారు. ట్రైలర్ కట్ యూత్ కి నచ్చేలా చూసుకున్నారు . కృష్ణ అండ్ హిజ్ లీలని బాగా డీల్ చేసిన రవికాంత్ పేరేపు మరోసారి టీనేజ్ ఎలిమెంట్స్ టచ్ చేసిన తీరు అంచనాలైతే రేపగలిగింది. ఇక్కడి దాకా ఓకే.
అసలే సలార్ వచ్చిన వారానికే బబుల్ గమ్ రిలీజ్. టాక్ సంగతి ఎలా ఉన్నా కనీసం రెండు వారాల పాటు ప్రభాస్ సినిమాకు సాలిడ్ రన్ ఉంటుందని బయ్యర్లు కన్ఫర్మ్ చేసుకున్నారు. అగ్రిమెంట్లు కూడా దానికి తగ్గట్టే జరిగాయి. ఓపెనింగ్స్ తాకిడి, అధిక టికెట్ రేట్లు చూసి సెకండ్ వీక్ లో చూద్దామని ఆగిపోయిన ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. సో ఇది మొదటి ముప్పు. మరొకటి అదే 29న కళ్యాణ్ రామ్ డెవిల్ ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లానింగ్ జరిగిపోయింది. దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ కావడం వల్ల దర్శకుడు కం నిర్మాత అభిషేక్ నామాకు థియేటర్ల సమస్య లేకుండా గ్రౌండ్ రెడీ అయిపోయింది.
సో బబుల్ గమ్ ఈ రెండు ఒత్తిళ్ల మధ్య తట్టుకోవాల్సి ఉంటుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అండగా ఉండటం ప్లస్సే కానీ ఆ బ్రాండ్ జనాలను థియేటర్లకు రప్పించడానికి సరిపోదు. కాకపోతే వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమా కాదు కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ. ఏది ఎలా ఉన్నా బబుల్ గమ్ చేతిలో రెండు వారాలు మాత్రమే టైం ఉంటుంది. సంక్రాంతి హడావిడి జనవరి 12 నుంచి మొదలవుతుంది కాబట్టి ఆలోగానే మొత్తం రాబట్టుకోవాలి. శ్రీకాంత్ కొడుకు రోషన్ మెల్లగా కుదురుకుంటున్న టైంలో ఇప్పుడీ కొత్త రోషన్ ఎలాంటి ఎంట్రీ అందుకుంటాడో వచ్చే వారం తేలిపోతుంది.
This post was last modified on December 23, 2023 11:17 am
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…