మొత్తానికి ప్రభాస్ అభిమానుల నిరీక్షణ ఫలించింది. బాహుబలి తర్వాత ప్రభాస్ వాళ్ళ కోరుకున్న విధంగా కనిపించాడు సలాడ్ సినిమాలో. ప్రభాస్ కటౌట్ ఇమేజ్ కు తగ్గట్టుగా సలార్ సినిమాను తీర్చిదిద్దాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. కథపరంగా పూర్తి సంతృప్తిని ఇవ్వకపోయినా.. ఎలివేషన్లు, యాక్షన్ ఘట్టాలు అద్భుతంగా పండడంతో అభిమానులు, మాస్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సగటు ప్రేక్షకులకు సినిమా పైసా వసూల్ అనిపిస్తోంది కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర పాస్ అయిపోయినట్లే.
కానీ సలార్ సినిమా విషయంలో అనేక అభ్యంతరాలు, సందేహాలు ఉన్నమాట వాస్తవం. హీరో క్యారెక్టర్ గ్రాఫ్ సరిగా లేదని.. ఇద్దరు మిత్రుల మధ్య స్నేహం, వైరం సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదని.. కథను గందరగోళంగా నడిపించారని.. చాలా విషయాలు కన్ఫ్యూజన్లో పెట్టేశారని.. ఇలా రకరకాల కంప్లైంట్లు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో.
అయితే ఈ అసంతృప్తికి, ప్రశ్నలకు సలార్ సెకండ్ పార్ట్ సమాధానంగా నిలుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సలార్ పార్ట్-1లో హీరో పాత్ర తాలూకు అన్ని కోణాలను పూర్తిస్థాయిలో చూపించలేదు ప్రశాంత్ నీల్. అతను దాచిపెట్టిన, చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని క్లైమాక్స్ చూస్తే అర్థమవుతుంది. అలాగే పృథ్విరాజ్ తో ప్రభాస్ వైరం గురించి కూడా ఊరికే అలా మాటల్లో చెప్పారు తప్ప తెరపై చూపించింది పెద్దగా లేదు. ప్రాణ స్నేహితులు ఎందుకు బద్ధ శత్రువులుగా మారారు.. అలా అయ్యాక వారి మధ్య పోరాటం ఎలా సాగింది అన్నది ఆసక్తి ఎక్కించి ఇచ్చే విషయం.
ఇక ఫస్ట్ పార్ట్ లో పై పైన కనిపించిన జగపతిబాబు పాత్ర కూడా రెండో భాగంలో హైలెట్ అయ్యే అవకాశం ఉంది. రెండో భాగానికి సౌర్యంగన పర్వం అంటూ ఆసక్తికర టైటిల్ పెట్టడమే కాక.. ప్రభాస్ పాత్రకు సంబంధించి కొత్త కోణాన్ని అందులో ఆవిష్కరించడానికి, కథ మొత్తం అతడి చుట్టూనే నడపడానికి ఒక బేస్ సిద్ధం చేశాడు. కాబట్టి సలార్ ఫస్ట్ పార్ట్ కంటే రెండో పార్ట్ ఇంకా బెటర్ గా గ్రిప్పింగ్ గా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రేక్షకులు దానిమీద ఎక్కువ అంచనాలే పెట్టుకోవచ్చు.
This post was last modified on December 22, 2023 9:41 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…