బాహుబలి సక్సెస్ అయిన దగ్గర నుంచి సౌత్ సినిమాల పట్ల బాలీవుడ్ జనాల్లో ఒక రకమైన అసూయ మొదలైంది. ఉత్తరాది ప్రేక్షకులు హిందీ చిత్రాలను పక్కనపెట్టి దక్షిణాది సినిమాలకు పట్టంకట్టడంతో ఆ అసూయ పెరుగుతూ పోయింది. దీంతో నెమ్మదిగా సౌత్ సినిమాల పట్ల అక్కసు వెళ్ళగక్కడం మొదలుపెట్టారు బాలీవుడ్ క్రిటిక్స్. ముఖ్యంగా ఈ క్రిస్మస్ కు డంకీకి పోటీకి సై అన్న సలార్ విషయంలో బాలీవుడ్ ఎలా స్పందించిందో అందరికీ తెలుసు.
మీడియా దగ్గర నుంచి ట్రేడ్ వర్గాలు, ఎగ్జిబిటర్స్ వరకు అందరూ ఈ సినిమా మీద శీతకన్ను వేశారు. మీడియాలో నెగిటివ్ ఆర్టికల్స్ వచ్చాయి. థియేటర్ షేరింగ్ విషయంలో అన్యాయం జరిగింది. ఇంకా అనేక రకాలుగా సలార్ ను తొక్కే ప్రయత్నం జరగడం స్పష్టంగా కనిపించింది. అదే సమయంలో డంకీ సినిమాకు ఎక్కడలేని ఎలివేషన్ ఇచ్చారు. ఆ సినిమాకు ఉత్తరాదిన రిలీజ్ పరంగా అంతా అనుకూలంగా సాగింది.
అయితే తెర వెనుక ప్రయత్నాలు ఎన్ని జరిగినా సినిమా ఫలితాన్ని నిర్దేశించేది ప్రేక్షకులే అన్నది స్పష్టం. వాళ్ల తీర్పు మాత్రం సలార్ కు పూర్తి అనుకూలంగా ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో ప్రేక్షకులు సలార్ కోసమే ఎగబడ్డారు. రిలీజ్ తర్వాత కూడా సలార్ స్పష్టమైన పైచేయి సాధిస్తోంది. డంకీకి రివ్యూలు, టాక్ అనుకూలంగా రాలేదు. ఆ ప్రభావం ఆల్రెడీ తొలి రోజు వసూళ్ల మీద పడింది. సలార్ సినిమా కూడా టాక్ అంత గొప్పగా లేకపోయినా.. అది సినిమా మీద చూపించే ప్రభావం తక్కువగానే కనిపిస్తోంది. మాస్ సినిమాలకు పైసా వసూల్ అనిపిస్తే చాలు అవి బాక్స్ ఆఫీస్ దగ్గర పాస్ అయిపోతాయి. ఓపెనింగ్స్ విషయంలో ప్రకంపనలు రేపేలా కనిపిస్తున్న సలార్.. డంకిని తొక్కుకుంటూ ముందుకెళ్ళిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on December 22, 2023 9:03 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…