ఈ నెల ఒకటిన విడుదలై బాక్సాఫీస్ వద్ద విరుచుకుపడిన యానిమల్ నాలుగో వారంలో అడుగు పెట్టాక తొమ్మిది వందల కోట్లకు దగ్గరగా ఉంది. వెయ్యి లక్ష్యాన్ని చేరుకుంటుందనే అంచనాలు బలంగా ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా సలార్ ఎంట్రీ మొత్తం సీన్ నే మార్చేసింది. తెలుగు రాష్ట్రాలను పూర్తిగా కమ్మేయగా, కేరళ కర్ణాటకలో మంచి పికప్ చూపిస్తోంది. తమిళనాడులో మాత్రం ఆశించిన స్థాయిలో జోరు లేదు. డంకీ వల్ల స్క్రీన్లు సరిగా దొరక్కపోవడంతో నార్త్ ఇండియాలో ఇంకా ఊపందుకోవాల్సి ఉంది. డంకీ ఆక్యుపెన్సీలు పెద్దగా లేవని తమకు సలారే కావాలని సింగల్ థియేటర్ల యజమానులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా యానిమల్ ఇంకో వంద కోట్లను పోగేసుకుంటే సహస్రం తోడవుతుంది. అయితే అసాధ్యం అయితే కాదు. ఎందుకంటే సలార్ హిట్ టాక్ వచ్చినప్పటికీ ఉత్తరాదిలో మరీ బాహుబలి రేంజ్ లో ఆడకపోవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ డంనీ రీ ప్లేస్ చేయాలనుకుంటే మొదటి ప్రాధాన్యం దానికి ఇచ్చి ఒకవేళ వద్దనుకుంటే బెస్ట్ ఆప్షన్ గా బయ్యర్లు యానిమల్ నే ఎంచుకుంటున్నారు. క్రిస్మస్ నుంచి కొత్త సంవత్సరం ఆరంభం వరకు చెప్పుకోదగ్గ సెలవులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ మైలురాయి అందుకోవచ్చనే విశ్లేషణలు జోరుగా ఉన్నాయి.
ఇది జరిగినా జరగకపోయినా సందీప్ రెడ్డి వంగా అందుకున్న ఘనత మాత్రం చిన్నది కాదు. కేవలం మూడో సినిమాకే ఇంత పెద్ద ఫీట్ అందుకోవడం పట్ల తలలు పండిన హిందీ సినీ పండితులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దీని దెబ్బకే యానిమల్ పార్క్ డిమాండ్ పెరిగిపోయింది. ప్రభాస్ స్పిరిట్ కన్నా ముందు దీన్ని తీయాలని మూవీ లవర్స్ కోరుతున్నారు. కానీ ఇది సందీప్ చేతిలో లేదు. టి సిరీస్ తో చేతులు కలిపిన ఈ క్రియేటివ్ జీనియస్ మొత్తం మూడు ప్యాన్ ఇండియా ప్రాజెక్టులను లాక్ చేసుకున్నారు. వాటిలో అల్లు అర్జున్ తో ప్లాన్ చేసుకున్నది చివర్లో ఉంటుంది .
This post was last modified on December 22, 2023 7:24 pm
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…