సరిగ్గా ఇంకో ఇరవై రోజుల్లో గుంటూరు కారం విడుదల. జనవరి 12 అట్టే దూరంలో లేదు. షూటింగ్ విపరీతమైన ఒత్తిడి మధ్య ఆఘమేఘాల మీద జరుగుతోంది. శ్రీలీల తన ఎంబిబిఎస్ పరీక్షలు వదులుకుని మరీ చిత్రీకరణలో పాల్గొంటోంది. ఒకవేళ ఎగ్జామ్స్ రాయాల్సి వస్తే వారం గ్యాప్ తీసుకోవాలి. అదే జరిగితే విడుదల వాయిదా వేయాల్సి వస్తుంది. అందుకే సప్లిమెంటరీ రాసుకోవాలని నిర్ణయించుకుంది. ఇంకొక్క పాట బాలన్స్ షూట్ జరుపుతున్నారు. ఈలోగా మహేష్ కు పాటలు నచ్చడం లేదని, మళ్ళీ చేసుకుని రమ్మని చెబుతున్నారని రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అవి నిజమైనా కాకపోయినా చేతిలో ఉన్న అతి తక్కువ టైంలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం అంత సులభం కాదు. ట్రైలర్ వదలాలి. లిరికల్ వీడియోలు సిద్ధం చేయాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేయాలనేది నిర్ణయించాలి. ఎవరెవరికి ఇంటర్వ్యూలు ఇవ్వాలనేది చూసుకోవాలి. చివరి అయిదారు రోజులు ఫైనల్ రీ రికార్డింగ్, సెన్సార్ ఫార్మాలిటీ, ఓవర్సీస్ లకు హార్డ్ డిస్క్ డిస్ప్యాచ్ లాంటి బోలెడు తతంగాలు ఉంటాయి. అంటే నికరంగా చేతిలో ఉన్నది రెండు వారాలే అనుకోవాలి. మాములుగా న్యూ ఇయర్ విదేశాల ట్రిప్ ప్లాన్ చేసుకునే మహేష్ ఇప్పుడు వెళ్తాడో లేదో తెలియదు.
సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలన్నీ ప్రాపర్ టీజర్, ట్రైలర్లు వదిలేశాయి. పాటలు కూడా తిరుగుతున్నాయి. గుంటూరు కారంకు సంబంధించి మాత్రం ఓ మై బేబీ మీద జరిగిన నెగటివ్ ప్రాపగండానే పెద్ద పీఠ తీసుకుంది. ఆరు నూరైనా సరే జనవరి 12 విడుదల చేయాల్సిన ప్రెజర్ ని తట్టుకోవడం మాటల్లో అనుకున్నంత తేలిక కాదు. ఏ మాత్రం మార్చాలని చూసినా స్వంత ఫ్యాన్స్ నుంచే తీవ్ర నిరశన వ్యక్తమవుతుంది. ఇంత హడవిడిలోనూ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇవ్వబోయే క్వాలిటీ గురించి అనుమాన పడొద్దని యూనిట్ నుంచి వినిపిస్తున్న మాట. బిజినెస్ మాత్రం యమా క్రేజీగా జరిగిపోయింది.
This post was last modified on December 22, 2023 3:21 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…