సరిగ్గా ఇంకో ఇరవై రోజుల్లో గుంటూరు కారం విడుదల. జనవరి 12 అట్టే దూరంలో లేదు. షూటింగ్ విపరీతమైన ఒత్తిడి మధ్య ఆఘమేఘాల మీద జరుగుతోంది. శ్రీలీల తన ఎంబిబిఎస్ పరీక్షలు వదులుకుని మరీ చిత్రీకరణలో పాల్గొంటోంది. ఒకవేళ ఎగ్జామ్స్ రాయాల్సి వస్తే వారం గ్యాప్ తీసుకోవాలి. అదే జరిగితే విడుదల వాయిదా వేయాల్సి వస్తుంది. అందుకే సప్లిమెంటరీ రాసుకోవాలని నిర్ణయించుకుంది. ఇంకొక్క పాట బాలన్స్ షూట్ జరుపుతున్నారు. ఈలోగా మహేష్ కు పాటలు నచ్చడం లేదని, మళ్ళీ చేసుకుని రమ్మని చెబుతున్నారని రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అవి నిజమైనా కాకపోయినా చేతిలో ఉన్న అతి తక్కువ టైంలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం అంత సులభం కాదు. ట్రైలర్ వదలాలి. లిరికల్ వీడియోలు సిద్ధం చేయాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేయాలనేది నిర్ణయించాలి. ఎవరెవరికి ఇంటర్వ్యూలు ఇవ్వాలనేది చూసుకోవాలి. చివరి అయిదారు రోజులు ఫైనల్ రీ రికార్డింగ్, సెన్సార్ ఫార్మాలిటీ, ఓవర్సీస్ లకు హార్డ్ డిస్క్ డిస్ప్యాచ్ లాంటి బోలెడు తతంగాలు ఉంటాయి. అంటే నికరంగా చేతిలో ఉన్నది రెండు వారాలే అనుకోవాలి. మాములుగా న్యూ ఇయర్ విదేశాల ట్రిప్ ప్లాన్ చేసుకునే మహేష్ ఇప్పుడు వెళ్తాడో లేదో తెలియదు.
సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలన్నీ ప్రాపర్ టీజర్, ట్రైలర్లు వదిలేశాయి. పాటలు కూడా తిరుగుతున్నాయి. గుంటూరు కారంకు సంబంధించి మాత్రం ఓ మై బేబీ మీద జరిగిన నెగటివ్ ప్రాపగండానే పెద్ద పీఠ తీసుకుంది. ఆరు నూరైనా సరే జనవరి 12 విడుదల చేయాల్సిన ప్రెజర్ ని తట్టుకోవడం మాటల్లో అనుకున్నంత తేలిక కాదు. ఏ మాత్రం మార్చాలని చూసినా స్వంత ఫ్యాన్స్ నుంచే తీవ్ర నిరశన వ్యక్తమవుతుంది. ఇంత హడవిడిలోనూ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇవ్వబోయే క్వాలిటీ గురించి అనుమాన పడొద్దని యూనిట్ నుంచి వినిపిస్తున్న మాట. బిజినెస్ మాత్రం యమా క్రేజీగా జరిగిపోయింది.
This post was last modified on December 22, 2023 3:21 pm
నిన్న విడుదలైన డబుల్ ఇస్మార్ట్ టీజర్ పట్ల రామ్ అభిమానుల స్పందన కాసేపు పక్కనపెడితే సగటు ప్రేక్షకులకు మాత్రం మరీ…
ఇంకో నలభై రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి 2898 ఏడికి సంబంధించి పూర్తి స్థాయి ప్రమోషన్లు మొదలుకాలేదని ఎదురు చూస్తున్న…
అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న దేవర ఆడియోలోని మొదటి లిరికల్ సాంగ్ ఈ వారమే విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్…
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. తాజాగా ఏపీ ఎన్నికల ఫలితంపై స్పందించారు. ఇంకా ఫలితం…
ఏపీ సీఎం జగన్ నివాసం ఉంటే తాడేపల్లిలోని ఇంట్లో విశిష్ఠ రాజశ్యామల యాగం నిర్వహించారు. అయితే.. ఇది 41 రోజుల…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల కోలాహలం ముగిసింది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. దీనికి 20 రోజుల సమయం ఉంది.…