సరిగ్గా ఇంకో ఇరవై రోజుల్లో గుంటూరు కారం విడుదల. జనవరి 12 అట్టే దూరంలో లేదు. షూటింగ్ విపరీతమైన ఒత్తిడి మధ్య ఆఘమేఘాల మీద జరుగుతోంది. శ్రీలీల తన ఎంబిబిఎస్ పరీక్షలు వదులుకుని మరీ చిత్రీకరణలో పాల్గొంటోంది. ఒకవేళ ఎగ్జామ్స్ రాయాల్సి వస్తే వారం గ్యాప్ తీసుకోవాలి. అదే జరిగితే విడుదల వాయిదా వేయాల్సి వస్తుంది. అందుకే సప్లిమెంటరీ రాసుకోవాలని నిర్ణయించుకుంది. ఇంకొక్క పాట బాలన్స్ షూట్ జరుపుతున్నారు. ఈలోగా మహేష్ కు పాటలు నచ్చడం లేదని, మళ్ళీ చేసుకుని రమ్మని చెబుతున్నారని రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అవి నిజమైనా కాకపోయినా చేతిలో ఉన్న అతి తక్కువ టైంలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం అంత సులభం కాదు. ట్రైలర్ వదలాలి. లిరికల్ వీడియోలు సిద్ధం చేయాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేయాలనేది నిర్ణయించాలి. ఎవరెవరికి ఇంటర్వ్యూలు ఇవ్వాలనేది చూసుకోవాలి. చివరి అయిదారు రోజులు ఫైనల్ రీ రికార్డింగ్, సెన్సార్ ఫార్మాలిటీ, ఓవర్సీస్ లకు హార్డ్ డిస్క్ డిస్ప్యాచ్ లాంటి బోలెడు తతంగాలు ఉంటాయి. అంటే నికరంగా చేతిలో ఉన్నది రెండు వారాలే అనుకోవాలి. మాములుగా న్యూ ఇయర్ విదేశాల ట్రిప్ ప్లాన్ చేసుకునే మహేష్ ఇప్పుడు వెళ్తాడో లేదో తెలియదు.
సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలన్నీ ప్రాపర్ టీజర్, ట్రైలర్లు వదిలేశాయి. పాటలు కూడా తిరుగుతున్నాయి. గుంటూరు కారంకు సంబంధించి మాత్రం ఓ మై బేబీ మీద జరిగిన నెగటివ్ ప్రాపగండానే పెద్ద పీఠ తీసుకుంది. ఆరు నూరైనా సరే జనవరి 12 విడుదల చేయాల్సిన ప్రెజర్ ని తట్టుకోవడం మాటల్లో అనుకున్నంత తేలిక కాదు. ఏ మాత్రం మార్చాలని చూసినా స్వంత ఫ్యాన్స్ నుంచే తీవ్ర నిరశన వ్యక్తమవుతుంది. ఇంత హడవిడిలోనూ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇవ్వబోయే క్వాలిటీ గురించి అనుమాన పడొద్దని యూనిట్ నుంచి వినిపిస్తున్న మాట. బిజినెస్ మాత్రం యమా క్రేజీగా జరిగిపోయింది.
This post was last modified on December 22, 2023 3:21 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…