Movie News

బిగ్ బాస్ లక్ష్యం పక్కదారి పడుతోంది

ఎన్నడూ లేనిది తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ఆట పూర్తయ్యాక కూడా వార్తల్లో వాడివేడిగా నిలుస్తోంది. విజేత పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన రచ్చ, ప్రభుత్వ ఆస్తులకు నష్టం, ఓ రెండు మూడు రోజులు అతను అజ్ఞాతంలోకి వెళ్లడం, పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచడం, రెండు వారాల రిమాండ్ విధించడం లాంటి పరిణామాలు సినిమా డ్రామాని మించిపోయాయి. రైతు బిడ్డ అంటూ సానుభూతి కార్డు ప్లే చేసి చాలా ప్రయోజనం పొందాడంటూ కొందరు, పైకి వస్తున్న వాడిని తొక్కేస్తున్నారని మరికొందరు ఇలా ఎవరికి తోచిన వాదనలు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు.

ఇదంతా పబ్లిసిటీ పరంగా ఓకే కానీ ఈ తరహా మైలేజ్ ని బిగ్ బాస్ నిర్వాహకులు ఖచ్చితంగా కోరుకోరు. ఎందుకంటే భవిష్యత్తులో ఎవరైనా ఈ గేమ్ షో ఆపాలంటూ కేసు వేస్తే పల్లవి ప్రశాంత్ ఉదంతాన్ని ఉదాహరణగా చూపిస్తారు. సాక్ష్యాలుగా వీడియోలు, ఫోటోలు బోలెడుంటాయి. సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరిగినా పర్వాలేదు కానీ ఎప్పుడైతే పోలీస్ స్టేషన్, న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సి వస్తుందో ఆసలు సమస్య అక్కడ వస్తుంది. బయట జరిగింది కాబట్టి టెక్నికల్ గా సదరు ఛానల్ మేనేజ్ మెంట్ కి సంబంధం లేకపోవచ్చు కానీ ఈ రచ్చ మూలం మొదలయ్యిందే హౌస్ లో కాబట్టి కాదని అనలేం.

నెక్స్ట్ సీజన్ 8 మీద దీని ప్రభావం ఉంటుంది. నాగార్జున చేయకపోవచ్చనే టాక్ ఫైనల్ కు ముందే వినిపించింది. బాలకృష్ణతో మాట్లాడుతున్నారనే వార్త చక్కర్లు కొట్టింది. కానీ ఇదంతా చూశాక ఎవరి నిర్ణయాలు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేం. పిఆర్ ల సహాయంతో పార్టిసిపెంట్స్ చేస్తున్న హంగామా, అభిమానుల పేరుతో కొందరు ఫాలోయర్స్ చేస్తున్న రాద్ధాంతం క్రమంగా ఈ షో మీద నీలినీడలు తెచ్చే ప్రమాదం లేకపోలేదు. అయినా ఇన్ని సీజన్ల గెలిచిన ఏ విన్నరూ సూపర్ స్టారో ఆన్ లైన్ స్టారో అయిపోలేదు. ఇదంతా సీజనల్. ఈ సత్యం గుర్తుంచుకుంటే ఈ సమస్యలే రావేమో.

This post was last modified on December 21, 2023 5:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాధేశ్యామ్ దర్శకుడెక్కడ?

‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు ప్రభాస్. అలాంటి హీరోతో సినిమా తీసే…

48 minutes ago

కేసీఆర్‌ కావాల‌నే మౌనంగా ఉన్నారా?

తెలంగాణ రాష్ట్ర సేన‌.. అంటూ టీఆర్ ఎస్ పార్టీని స్థాపించిన క‌విత వ్య‌వ‌హారంపై బీఆర్ ఎస్ నాయ‌కులు మౌనంగా ఉన్నారు.…

5 hours ago

దాగుడుమూతల దృశ్యానికి మోక్షం దక్కింది

మోహన్ లాల్ దృశ్యం 3 మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించింది. మే 21 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా…

6 hours ago

మనసు మారిందా వీరభద్రుడా

బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…

7 hours ago

తప్పు చేస్తే చంద్రబాబుకి ఎవరైనా ఒకటే

సొంత పార్టీ నాయ‌కుడు త‌ప్పు చేస్తే ఒక‌విధంగా.. ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌లు త‌ప్పులు చేస్తే మ‌రో విధంగా మారి పోయిన…

7 hours ago

సింహాన్ని దాచకుండా మంచి పని చేశారు

మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…

9 hours ago