ప్రీమియర్లు ఇంకొద్ది గంటల్లో మొదలుకాబోతుండగా పివిఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్సుల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టకపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఎందుకంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో అందుబాటులో ఉన్న సింగల్ స్క్రీన్లు, ఇతర బహుళ సముదాయాల్లో టికెట్లు మొత్తం అయిపోయాయి. ఫ్లడ్ లైట్లు వేసుకుని వెతికినా ముక్క దొరికే పరిస్థితి లేదు. నగరంలో అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న పివిఆర్ కాంప్లెక్సుల్లో షోలు లేకపోవడంతో ఆ ఒత్తిడి మొత్తం మిగిలిన స్క్రీన్ల మీద పడి ప్రేక్షకుల డిమాండ్ ని తట్టుకోలేని స్థితికి ఎగ్జిబిటర్లు చేరుకున్నారు. ఇంకా కొనని వాళ్ళు లక్షల్లో ఉన్నారు.
ఫైనల్ గా పివిఆర్ ఐనాక్స్ యాజమాన్యాలు సలార్ నిర్మాతలతో చేసిన చర్చలు ఫలితాన్ని ఇచ్చాయి. తెల్లవారుఝామున నాలుగు గంటల షోల నుంచి బుకింగ్స్ పెట్టేస్తున్నారు. ఈ సమస్య మొదలయ్యింది డంకీ షోల పంపకాలతో. నార్త్ లో ప్రాధాన్యం షారుఖ్ ఖాన్ సినిమాకు ఇచ్చి తమకు కనీస మద్దతు ఇవ్వడం లేదని సలార్ నిర్మాతలు నిరసనగా కంటెంట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారనే వార్త నిన్న దేశం మొత్తం మీడియాలో హోరెత్తిపోయింది. ముందు మౌనంగా ఉంటూ వచ్చిన ఐనాక్స్ మేనేజ్ మెంట్ ఫైనల్ గా సద్దుమణగడంతో ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.
రాబోయే రోజుల్లో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మన నిర్మాతలు ముందే జాగ్రత్త పడటం అవసరం. ఏ భాషలో లేనన్ని ప్యాన్ ఇండియాలు టాలీవుడ్ నుంచే రాబోతున్నాయి. గేమ్ చేంజర్, పుష్ప 2, కల్కి, విశ్వంభర, మహేష్ బాబు-రాజమౌళి ఇలా మొత్తం భారతీయ మార్కెట్ ని శాసించే స్థాయిలో వేల కోట్ల పెట్టుబడులు ట్రేడ్ ని ముంచెత్తబోతున్నాయి. ఐసిసిని మన ఇండియన్ క్రికెట్ బోర్డు కంట్రోల్ చేసినట్టు బాలీవుడ్ ని దాటేసి మన గుప్పిట్లోకి అన్ని వుడ్డులు రాబోతున్నాయి. ఒకరకంగా సలార్ నిర్మాతలు అనుసరించిన ధోరణి రైటేనని చెప్పాలి.లేదంటే మళ్ళీ రిపీట్ అయ్యేది.
This post was last modified on December 21, 2023 5:19 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…