ఒక సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉంటాయి. సందీప్ కిషన్- విఐ ఆనంద్ కలయికలో మొదలైన ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా మీద కూడా ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన తొలి పాట “నిజమే నే చెబుతున్నా” పాట సంగీత ప్రియులను విపరీతంగా కట్టుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ పాట వల్ల సినిమాకు మంచి బజ్ కూడా వచ్చింది.
సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాన్నాళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. కానీ ఎంతకీ ఈ సినిమా రిలీజ్ డేట్ ఇవ్వలేదు. సందీప్ కిషన్ కెరీర్కు కీలకమైన ఈ సినిమా గురించి ఏ సమాచారం లేకపోవడంపై తన అభిమానుల్లో నిరాశ వ్యక్తమైంది. అయితే సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్ర బృందం.
వచ్చే ఏడాది వాలెంటెన్స్ డే వీకెండ్ కు ముందుగా ఊరు పేరు భైరవకోనను రిలీజ్ చేయబోతున్నారు. ఫిబ్రవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని సందీప్ కిషన్ ట్విట్టర్ లో ప్రకటించాడు. మూడేళ్ల కష్టం, ఎన్నో ఏళ్ల కల ఆ రోజు నెరవేరుతుందంటూ సందీప్ కిషన్ ఎమోషనల్ గా సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశాడు.
గత ఏడాది వ్యవధిలో కాంతార, విరూపాక్ష, మా ఊరి పొలిమేర-2 లాంటి మిస్టరీ థ్రిల్లర్లు మంచి విజయం సాధించిన నేపథ్యంలో అదే జానర్లో తెరకెక్కిన ఊరు పేరు భైరవకోన మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అయితే విరూపాక్ష మూవీతో పోలికులుండటం వల్లే స్క్రిప్టులో మార్పులు చేసి రీషూట్లు చేస్తున్నారని, అందుకే రిలీజ్ ఆలస్యం అవుతోందని ఇటీవల రూమర్లు వినిపించాయి. దీంతో చిత్ర దర్శక నిర్మాతలు స్పందించారు. విరూపాక్షతో తమ సినిమాకు పోలికేమీ లేదని వీఐ ఆనంద్ స్పష్టం చేశాడు. జానర్ ఒక్కటైనంత మాత్రాన కథలు ఒకలా ఉండవని అతనన్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం వల్లే సినిమా రిలీజ్ లేటవుతోందని ఆనంద్ తెలిపాడు. కొన్నేళ్ల కిందట ఎక్కడికి పోతావు చిన్నవాడాతో బ్లాక్ బస్టర్ మళ్లీ అలాంటి సినిమాను డెలివర్ చేస్తాడని సందీప్ కిషన్ అభిమానులు ఆశిస్తున్నారు.
This post was last modified on December 21, 2023 3:46 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…