పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కోసం ఘనంగా సన్నాహాలు జరుగుతున్న సమయంలో నిన్న సాయంత్రం ఒక పెద్ద విషాదం చోటు చేసుకుంది. పవన్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తూ చిత్తూరు జిల్లాలో శాంతిపురంలో ముగ్గురు అభిమానులు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు వదలడం విషాదాన్ని నింపింది. ఇందులో ఇద్దరు అన్నదమ్ములు కావడం, వాళ్లను నమ్ముకున్న కుటుంబం అన్యాయం అయిపోవడం బాధాకరం.
ఈ ఉదంతం పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానన్నాడు. జనసేన పార్టీ తరఫున సాయం కూడా ప్రకటించాడు. ఐతే ఈ అభిమానులకు పవన్ మాత్రమే కాక వేరే వాళ్లు కూడా సాయానికి ముందుకు వచ్చారు. పవన్ ప్రస్తుతం నటిస్తున్న రెండు చిత్రాల బృందాలూ ఆర్థిక సాయం ప్రకటించాయి.
‘వకీల్ సాబ్’ నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి బాధితులు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న చిత్రాన్ని నిర్మిస్తున్న సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం కూడా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. వీరికి తోడు అల్లు అర్జున్ సైతం ఆర్థిక సాయానికి ముందుకు రావడం గమనార్హం. పవన్ అభిమానుల మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేసిన బన్నీ.. తన వంతుగా వారికి రెండేసి లక్షల చొప్పున సాయం ప్రకటిస్తున్నట్లు ట్విట్టర్లో వెల్లడించాడు.
కొన్నేళ్లుగా పవన్ అభిమానులకు బన్నీ అంటే గిట్టట్లేదు. ‘సరైనోడు’ ఆడియో వేడుకలో ‘చెప్పను బ్రదర్’ కామెంట్ చేయడం, ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో బన్నీ ప్రవర్తన పవన్ అభిమానులకు నచ్చలేదు. పలు సందర్భాల్లో బన్నీపై తమ వ్యతిరేకతను చూపించారు కూడా. ఐతే వాళ్లతో ప్యాచప్ కోసం బన్నీ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో పవన్ అభిమానుల కుటుంబాలకు బన్నీ సాయం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు చిరంజీవి, సాయిధరమ్ తేజ్ సైతం పవన్ అభిమానుల మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
This post was last modified on September 2, 2020 2:50 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…