Movie News

30 లక్షల టికెట్లంటే నిజంగా భీభత్సమే

సలార్ ఇంకా మొదటి షో పడకుండానే బాక్సాఫీస్ కు భీభత్సం స్పెల్లింగ్ రాయిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే సరికొత్త రికార్డులు సృష్టించి రాబోయే ప్యాన్ ఇండియా సినిమాలకు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తోంది. ఇంకా పన్నెండు గంటలు సమయం మిగిలి ఉండగానే దేశవ్యాప్తంగా 30 లక్షల 25 వేల టికెట్లు అమ్ముడుపోయి ట్రేడ్ మతులు పోగొట్టింది. వీటిలో పివిఆర్, ఐనాక్స్, సినీపోలీస్ లు లేవు. డంకీకి సంబంధించిన స్క్రీన్ల పంపకాల్లో చూపించిన అసమానత కారణంగా హోంబాలే ఫిలింస్ వాటికి కంటెంట్ ఇచ్చే విషయంలో కఠినంగా ఉన్న విషయం తెలిసిందే. ఇష్యూ ఇప్పటికైతే పరిష్కారం కాలేదు.

ఆంధ్రప్రదేశ్ 13 లక్షల 25 వేలు, తెలంగాణ 6 లక్షలు, ఉత్తరాది రాష్ట్రాలు 5 లక్షల 25 వేలు, కర్ణాటక 3 లక్షల 25 వేలు, కేరళ 1 లక్ష 50 వేలు, తమిళనాడు 1 లక్ష టికెట్లతో ఇంకా ట్రెండ్ ని పైకి తీసుకెళ్లే పనిలో ఉంది. వీటిలో కరెంట్ బుకింగ్స్ జరిగే చాలా సింగల్ స్క్రీన్లను కలపలేదు. బిసి సెంటర్లలో ఆన్ లైన్ ఎక్కువగా ఉండదు కాబట్టి వాటి లెక్కలు ఇంకా రావాల్సి ఉంది. నిర్మాణ సంస్థ స్వయంగా ఈ ఫిగర్లను ప్రకటించడం గమనించాల్సిన విషయం. అర్ధరాత్రి ఒంటి గంట నుంచే షోలు మొదలవుతున్న తరుణంలో మూవీ ఎలా ఉండబోతోందనే అంచనాలు విపరీతంగా పెరుగుతున్నాయి.

ఇది ఊహించిన స్పందనే అయినప్పటికీ మరీ ఈ స్థాయిలో కాదనేది వాస్తవం. మొదటి ట్రైలర్ వచ్చినప్పుడు మిశ్రమ స్పందన వచ్చింది. రెండో ట్రైలర్ మొత్తం సీన్ నే మార్చేసింది. ఒక్కసారిగా మాస్ వర్గాల్లో ఎక్కడ లేని హైప్ వచ్చింది. ప్రభాస్ ఇమేజ్, కెజిఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ చేసిన మూవీ కావడం, వందల కోట్ల బడ్జెట్ ఇవన్నీ బజ్ ని ఎక్కడికో తీసుకెళ్లాయి. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సంక్రాంతి వచ్చేదాకా ఇరవై రోజుల పాటు సలార్ ప్రభంజనం మాములుగా ఉండదు. బ్లాక్ బస్టర్ అయితే మాత్రం పండగ టైంలోనూ కొనసాగించే అవకాశాలు కొట్టిపారేయలేం.

This post was last modified on December 21, 2023 3:47 pm

Share
Show comments

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

7 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

9 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

9 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

10 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

11 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

13 hours ago