Movie News

30 లక్షల టికెట్లంటే నిజంగా భీభత్సమే

సలార్ ఇంకా మొదటి షో పడకుండానే బాక్సాఫీస్ కు భీభత్సం స్పెల్లింగ్ రాయిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే సరికొత్త రికార్డులు సృష్టించి రాబోయే ప్యాన్ ఇండియా సినిమాలకు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తోంది. ఇంకా పన్నెండు గంటలు సమయం మిగిలి ఉండగానే దేశవ్యాప్తంగా 30 లక్షల 25 వేల టికెట్లు అమ్ముడుపోయి ట్రేడ్ మతులు పోగొట్టింది. వీటిలో పివిఆర్, ఐనాక్స్, సినీపోలీస్ లు లేవు. డంకీకి సంబంధించిన స్క్రీన్ల పంపకాల్లో చూపించిన అసమానత కారణంగా హోంబాలే ఫిలింస్ వాటికి కంటెంట్ ఇచ్చే విషయంలో కఠినంగా ఉన్న విషయం తెలిసిందే. ఇష్యూ ఇప్పటికైతే పరిష్కారం కాలేదు.

ఆంధ్రప్రదేశ్ 13 లక్షల 25 వేలు, తెలంగాణ 6 లక్షలు, ఉత్తరాది రాష్ట్రాలు 5 లక్షల 25 వేలు, కర్ణాటక 3 లక్షల 25 వేలు, కేరళ 1 లక్ష 50 వేలు, తమిళనాడు 1 లక్ష టికెట్లతో ఇంకా ట్రెండ్ ని పైకి తీసుకెళ్లే పనిలో ఉంది. వీటిలో కరెంట్ బుకింగ్స్ జరిగే చాలా సింగల్ స్క్రీన్లను కలపలేదు. బిసి సెంటర్లలో ఆన్ లైన్ ఎక్కువగా ఉండదు కాబట్టి వాటి లెక్కలు ఇంకా రావాల్సి ఉంది. నిర్మాణ సంస్థ స్వయంగా ఈ ఫిగర్లను ప్రకటించడం గమనించాల్సిన విషయం. అర్ధరాత్రి ఒంటి గంట నుంచే షోలు మొదలవుతున్న తరుణంలో మూవీ ఎలా ఉండబోతోందనే అంచనాలు విపరీతంగా పెరుగుతున్నాయి.

ఇది ఊహించిన స్పందనే అయినప్పటికీ మరీ ఈ స్థాయిలో కాదనేది వాస్తవం. మొదటి ట్రైలర్ వచ్చినప్పుడు మిశ్రమ స్పందన వచ్చింది. రెండో ట్రైలర్ మొత్తం సీన్ నే మార్చేసింది. ఒక్కసారిగా మాస్ వర్గాల్లో ఎక్కడ లేని హైప్ వచ్చింది. ప్రభాస్ ఇమేజ్, కెజిఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ చేసిన మూవీ కావడం, వందల కోట్ల బడ్జెట్ ఇవన్నీ బజ్ ని ఎక్కడికో తీసుకెళ్లాయి. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సంక్రాంతి వచ్చేదాకా ఇరవై రోజుల పాటు సలార్ ప్రభంజనం మాములుగా ఉండదు. బ్లాక్ బస్టర్ అయితే మాత్రం పండగ టైంలోనూ కొనసాగించే అవకాశాలు కొట్టిపారేయలేం.

Satya

Recent Posts

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

4 minutes ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

2 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

2 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

3 hours ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

5 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

7 hours ago