దేశమంతా సినీ ప్రేమికులు సలార్ జపం చేస్తున్న టైంలో డంకీ ఒక రోజు ముందు గురువారమే థియేటర్లలో అడుగు పెడుతోంది. ఇది ఒక కోణంలో కలిగించే పెద్ద లాభమేంటంటే ఎవరితోనూ స్క్రీన్లు షేర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా సోలో రన్ ఎంజాయ్ చేయడం. హాలీవుడ్ మూవీ అక్వమెన్ ది ఫాలెన్ కింగ్ డమ్ ఉన్నప్పటికీ అదేమీ స్పైడర్ మ్యాన్, అవెంజర్స్ రేంజ్ లో హైప్ ఉన్న మూవీ కాదు. సో ఉత్తరాది రాష్ట్రాల్లో డంకీకి భారీ ప్రయోజనం కలగనుంది. ఒకవేళ శుక్రవారాన్ని ఎంచుకుని ఉంటే సలార్ ధాటికి ముఖ్యంగా సౌత్ ఇండియాలో చాలా సమస్యలు వచ్చేవి.
ఇక నష్టం సంగతికొస్తే డంకీ టాక్ పాజిటివ్ గా వస్తే ఓకే. లేదంటే ప్రేక్షకుల దృష్టి పూర్తిగా సలార్ వైపు వెళ్ళిపోతుంది. ప్రభాస్ మూవీలో ఉన్నంత ఊర మాస్ కనీసం ఓ పావు వంతు కూడా షారుఖ్ సినిమాలో ఉండదు. రెండు సంబంధం లేని వేర్వేరు జనార్లే అయినప్పటికీ కంటెంట్ పరంగా పోలికలు వస్తాయి కాబట్టి మెజారిటి ప్రేక్షకుల మద్దతు ఆటోమేటిక్ గా సలార్ వైపే మొగ్గు చూపుతుంది. ఒకవేళ దీనికి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులో షోలు, థియేటర్ల లెక్కలు మారిపోయి సోమవారం నుంచి అదంతా డంకీకి ప్రతికూలంగా మారుతుంది.
పోటీ ఎలా ఉన్నా ఫలితం పట్ల ఇద్దరి దర్శక నిర్మాతలు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ ఇలా వరస ఫ్లాపుల తర్వాత కూడా దాని ప్రభావం సలార్ మీద ఇనుమంత ప్రభావం లేకపోవడం విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. రాజమౌళి చేసిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ చెప్పినట్టు స్టార్ ఎప్పటికైనా స్టారే. రెండు కాదు ఇంకో ఇరవై ఫ్లాపులు వచ్చినా కూడా సరైన బ్లాక్ బస్టర్ వస్తే అతని సత్తా మళ్ళీ బయట పడుతుంది. పఠాన్, జవాన్ లను ఉదాహరణగా చూపారు. సో సలార్ కూడా ఆ రేంజ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం డంకీకి బాక్సాఫీస్ కష్టాలు తప్పవు.
This post was last modified on December 20, 2023 1:01 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…