ఏ ముహూర్తంలో కలర్ ఫోటో ఒప్పుకున్నాడో కానీ జాతీయ అవార్డు సాధించిన ఆ సినిమా హీరో సుహాస్ జాతకాన్ని మార్చేసింది. తక్కువ బడ్జెట్ తో కొత్త దర్శకులకు చాలా కంఫర్ట్ గా అనిపించే ఇతనితో చేయడానికి ఔత్సాహికులు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రస్తుతం తను అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్ విడుదల కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ట్రైలర్ అంచనాలు రేపినప్పటికీ సరైన రిలీజ్ స్లాట్ దొరక్క నిర్మాతలు తర్జన భర్జన పడుతున్నారు. కంటెంట్ మీద మంచి బజ్ ఉండటంతో వీలైనంత సోలోగా రావడానికి చూస్తున్నారు కానీ కొంచెం టైం పట్టేలా ఉంది.
దీని సంగతి కాసేపు పక్కన పెడితే సుహాస్ తంతే బూరెల బుట్టలో పడ్డట్టు భలే ఆఫర్లు పడుతున్నాడు. చాయ్ బిస్కెట్ టీమ్ తో రైటర్ పద్మభూషణ్ చేయడం ఎంత ప్లస్సయ్యిందో చూశాం. తాజాగా దిల్ రాజు కాంపౌండ్ లోకి వచ్చి చేరాడు. బలగంతో బ్లాక్ బస్టర్ అందుకున్న హన్షిత రెడ్డి తన తండ్రి పేరు మీద నెలకొల్పిన బ్యానర్ లో సుహాస్ హీరోగా కొత్త సినిమా మొదలైంది. ప్రశాంత్ నీల్ దగ్గర పని చేయడమే కాక సలార్ డైలాగ్స్ రాసిన సందీవ్ రెడ్డి బండ్ల దీనికి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. బేబీ లాంటి సెన్సేషనల్ మ్యూజికల్ హిట్ తో వరస ఆఫర్లు పడుతున్న విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తున్నారు.
ఇది కోర్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఫ్యామిలీ ఎంటర్ టైనరని యూనిట్ టాక్. ఆద్యంతం నవ్విస్తూనే భావోద్వేగాలు కలగజేస్తుందని అంటున్నారు. సుహాస్ కేవలం హీరోగానే చేస్తానని పట్టుబట్టడం లేదు. హిట్ 2 ది సెకండ్ కేస్ లో విలన్ గా నటించాడు. ఫ్యామిలీ డ్రామాలో భయపెట్టాడు. మను చరిత్ర, మిషన్ ఇంపాజిబుల్ లో క్యామియోలు చేశాడు. ఇకపై మాత్రం కథానాయకుడిగానే ఎక్కువ కొనసాగేలా కనిపిస్తున్నాడు. బాక్సాఫీస్ వద్ద పెద్ద బ్లాక్ బస్టర్ మరొక్కటి పడితే సుహాస్ పూర్తిగా సెటిలైపోయినట్టే.
This post was last modified on December 19, 2023 9:29 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…