కరోనా వైరస్ ధాటికి ప్రపంచమంతా స్తంభించిపోయింది. అన్ని ఆఫీసులూ మూతపడ్డాయి. డాక్టర్లు, పోలీసులు, జర్నలిస్టులు, పారిశుద్ధ్య కార్మికులు.. వీళ్లు మాత్రమే తమ కార్య క్షేత్రాల్లో పని చేస్తున్నారు. మిగతా వాళ్లందరూ పనులు మానేశారు. లేదంటే ఇంటి నుంచి పని చేస్తున్నారు. సినీ పరిశ్రమ విషయానికి వస్తే చాలామంది పని లేక ఖాళీగా ఉన్నారు. కొంతమంది వీలు చేసుకుని ఖాళీ సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
రచయితలు, దర్శకులు కథల మీద కసరత్తు చేస్తుంటే హీరోలు ఫిట్నెస్ మీద దృష్టిపెడుతున్నారు. అలాగే కొత్త కథలు వింటున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న సినిమాలకు సంబంధించి వాటి మేకర్స్ షూటింగ్ అయిన రషెస్ వరకు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసే పనుల్లో పడ్డారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘వకీల్ సాబ్’ టీం కూడా ఈ పనిలోనే నిమగ్నమైంది. చిత్రీకరణ చాలా వరకు అయిపోవడంతో దాని వరకు డబ్బింగ్, రీరికార్డింగ్, ఇతర ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడానికి ఈ ఖాళీ సమయాన్ని ఉపయోగించుకుంటోంది. ఇందులో పవన్ కళ్యాణ్ సైతం భాగం అవుతున్నట్లు సమాచారం. ఆయన ఈ సినిమాలో పూర్తయిన తన పార్ట్ వరకు డబ్బింగ్ కానిచ్చేస్తున్నారట.
డబ్బింగ్ సెటప్ అంతా ఇంటికి తెప్పించుకుని అస్టిస్టెంట్ డైరెక్టర్ల సాయంతో డబ్బింగ్ అవగొడుతున్నాడట పవన్. మళ్లీ షూటింగ్ మొదలయ్యే సమయానికి ప్రస్తుత రషెస్ మొత్తానికి చిత్ర బృందంలో అందరూ డబ్బింగ్ పూర్తి చేసేయనున్నారట. తమన్ రీరికార్డింగ్, పాటల పని కూడా దాదాపుగా పూర్తి చేసేస్తాడని సమాచారం. ఎడిటింగ్, డీఐ పనులు కూడా చురుగ్గా సాగుతున్నట్లు తెలిసింది.
This post was last modified on April 17, 2020 5:18 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…