Categories: Movie News

కరోనా దెబ్బ.. పవన్ వర్క్ ఫ్రమ్ హోమ్

కరోనా వైరస్ ధాటికి ప్రపంచమంతా స్తంభించిపోయింది. అన్ని ఆఫీసులూ మూతపడ్డాయి. డాక్టర్లు, పోలీసులు, జర్నలిస్టులు, పారిశుద్ధ్య కార్మికులు.. వీళ్లు మాత్రమే తమ కార్య క్షేత్రాల్లో పని చేస్తున్నారు. మిగతా వాళ్లందరూ పనులు మానేశారు. లేదంటే ఇంటి నుంచి పని చేస్తున్నారు. సినీ పరిశ్రమ విషయానికి వస్తే చాలామంది పని లేక ఖాళీగా ఉన్నారు. కొంతమంది వీలు చేసుకుని ఖాళీ సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

రచయితలు, దర్శకులు కథల మీద కసరత్తు చేస్తుంటే హీరోలు ఫిట్నెస్ మీద దృష్టిపెడుతున్నారు. అలాగే కొత్త కథలు వింటున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న సినిమాలకు సంబంధించి వాటి మేకర్స్ షూటింగ్ అయిన రషెస్ వరకు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసే పనుల్లో పడ్డారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘వకీల్ సాబ్’ టీం కూడా ఈ పనిలోనే నిమగ్నమైంది. చిత్రీకరణ చాలా వరకు అయిపోవడంతో దాని వరకు డబ్బింగ్, రీరికార్డింగ్, ఇతర ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడానికి ఈ ఖాళీ సమయాన్ని ఉపయోగించుకుంటోంది. ఇందులో పవన్ కళ్యాణ్ సైతం భాగం అవుతున్నట్లు సమాచారం. ఆయన ఈ సినిమాలో పూర్తయిన తన పార్ట్ వరకు డబ్బింగ్ కానిచ్చేస్తున్నారట.

డబ్బింగ్ సెటప్ అంతా ఇంటికి తెప్పించుకుని అస్టిస్టెంట్ డైరెక్టర్ల సాయంతో డబ్బింగ్ అవగొడుతున్నాడట పవన్. మళ్లీ షూటింగ్ మొదలయ్యే సమయానికి ప్రస్తుత రషెస్ మొత్తానికి చిత్ర బృందంలో అందరూ డబ్బింగ్ పూర్తి చేసేయనున్నారట. తమన్ రీరికార్డింగ్, పాటల పని కూడా దాదాపుగా పూర్తి చేసేస్తాడని సమాచారం. ఎడిటింగ్, డీఐ పనులు కూడా చురుగ్గా సాగుతున్నట్లు తెలిసింది.

This post was last modified on April 17, 2020 5:18 pm

Share

Recent Posts

లోకేష్ సహనానికి బాబు ప్రశంసల జల్లు

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై సీఎం చంద్ర‌బాబు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఏక‌బిగిన ఏడున్న‌ర గంట‌ల పాటు నిల‌బ‌డి.. ప్ర‌జ‌ల‌కు…

22 minutes ago

నాని మీద ఒత్తిడి పెరుగుతోంది

ఆగస్ట్ నుంచి తప్పుకున్నాక ది ప్యారడైజ్ కొత్త విడుదల తేదీ ఇప్పటిదాకా ప్రకటించలేదు. సెప్టెంబర్ 24 అని బలంగా ప్రచారం…

32 minutes ago

మంగాపురంకు చిక్కు వచ్చేలా ఉందే

ఈ నెల 30 విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురంకు ప్రమోషన్లు జోరుగా జరుగుతున్నాయి. అయితే గ్రౌండ్ లెవెల్ లో మాత్రం…

43 minutes ago

మేమూ కాక్రోచ్ లమే అన్నావుగా జగన్.. ఇప్పుడేమైంది?

ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తే కాక్రోచ్‌లు లేస్తాయని, ఆంధ్రప్రదేశ్‌లో తాము కూడా కాక్రోచ్‌లమేనని అని స్వయాన మాజీ ముఖ్యమంత్రి వైఎస్…

2 hours ago

జనం ఏమనుకుంటున్నారు నాయకా

రాజకీయ రంగప్రవేశానికి ముందు ఇదే తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించుకున్న జన నాయకుడు థియేటర్లలో అడుగు పెట్టేసింది. తమిళనాడులో…

3 hours ago

హృతిక్‌తో పరశురామ్ బుస్సేనా?

యువత, సోలో లాంటి చిత్రాలతో మెప్పించి.. ‘గీత గోవిందం’ చిత్రంతో తెలుగులో మంచి డిమాండ్ తెచ్చుకున్న దర్శకుడు పరశురామ్. ఆ…

4 hours ago