చియాన్ విక్రమ్ కు బొత్తిగా టైం కలిసి రావడం లేదు కాబోలు. గత నెల అన్నీ పక్కా అనుకుని విడుదల ప్లాన్ చేసుకున్న ధృవ నక్షత్రం ఆఖరి క్షణంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో టికెట్లు అమ్మాక షోలు రద్దు చేయాల్సి వచ్చింది. నిర్మాత కం దర్శకుడు గౌతమ్ మీనన్ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడం వల్లే దీనికి మోక్షం కలగడం లేదు. తాజాగా ఇంకో ప్యాన్ ఇండియా మూవీ వాయిదా బాట పట్టేలా ఉందని చెన్నై టాక్. పా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన తంగలాన్ ముందు జనవరి 26 రిలీజ్ డేట్ ని అఫీషియల్ లాక్ చేసుకుంది. కానీ ఇప్పుడు డ్రాపయ్యింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తంగలాన్ షూటింగ్ పూర్తయినప్పటికీ కీలకమైన పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పడుతోంది. కేవలం నెల రోజులు ప్రమోషన్లకు సరిపోవనే ఉద్దేశంతో నిర్మాతలు పోస్ట్ పోన్ నిర్ణయం తీసుకున్నారట. దీనికన్నా పలు జాతీయ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో తంగలాన్ ని ప్రదర్శించి తద్వారా వచ్చే వరల్డ్ వైడ్ పాపులారిటీని పబ్లిసిటీకి వాడుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారట. థియేట్రికల్ గా రిలీజయ్యాక ఇలాంటి సినిమాలు ఫిలిం ఫెస్టివల్స్ లో సరైన ఆదరణకు నోచుకోవనే ఉద్దేశంతో ప్రణాళిక మార్చుకున్నారని తెలిసింది.
తంగలాన్ కోసం విక్రమ్ విపరీతంగా కష్టపడ్డాడు. ఐ తరహాలో ఒంటిని హూనం చేసుకుని తగ్గడం, పెరగడం లాంటి శరీర ప్రక్రియలతో మళ్ళీ రిస్క్ చేశాడు. రజనీకాంత్ తో కాలా, కబాలి లాంటి సినిమాలు తీసిన పా రంజిత్ ఈసారి పూర్తిగా షాకింగ్ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నాడు. హైదరాబాద్ వచ్చినప్పుడు ఇందులో తన పాత్రకు మాటలే ఉండవని విక్రమ్ చెప్పిన సంగతి గుర్తే. టీమ్ తర్వాత దాన్ని ఖండించినప్పటికీ టీజర్ చూశాక మాత్రం హీరో చెప్పిందే నిజమనిపిస్తుంది. తంగలాన్ తప్పుకోవడం వల్ల ఫైటర్, వ్యూహం 2, ప్రతనిధి 2లకు కాంపిటీషన్ తగ్గించినట్టు అయ్యింది.
This post was last modified on December 18, 2023 2:01 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…