గద్దలకొండ గణేష్ లాంటి మంచి హిట్ ఇచ్చిన తర్వాత నాలుగేళ్ల విలువైన సమయాన్ని వృథా చేసుకున్నాడు హరీష్ శంకర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా కమిట్ అవ్వడంతో అది ఎంత ఆలస్యమైనా అతను పక్క చూపులు చూడలేదు. అసలు సినిమా సెట్స్ మీదకే వెళ్లకపోయినా.. అతను పవన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఒక దశలో పవన్ సినిమా మీద పూర్తిగా ఆశలు కోల్పోయినప్పటికీ హరీష్ మారలేదు. ఈ ప్రాజెక్టు ఎంత ఆలస్యమైనా సరే పక్కకు వెళ్లే అవకాశం ఏ లేదని సంకేతాలు ఇచ్చాడు. ఆ మాటకు కట్టుబడే ఉస్తాద్ భగత్ సింగ్ ను పట్టాలెక్కించి కొంత షూటింగ్ జరిగే వరకూ హరీష్ పట్టుదల వీడలేదు. అయితే ఈ సినిమా షెడ్యూళ్లు కొన్ని జరిగాక అనివార్య పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలకు పరిమితమయ్యాడు.
ఏపీలో ఎన్నికలు ముగిసే వరకు మళ్లీ ఉస్తాద్ కోసం డేట్లు ఇచ్చే అవకాశం లేదని తేలిపోయింది. దీంతో హరీష్ శంకర్ పంతం తప్పలేదు. రవితేజతో వేగంగా ఒక రీమేక్ మూవీ చేయడానికి అతడికి కాంట్రాక్టు కుదిరింది. హిందీ రైడ్ ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం ఈరోజే ప్రారంభోత్సవం జరుపుకుంది.
మొత్తానికి హరీష్ శంకర్ ఉస్తాద్ తిరిగి పట్టాలెక్కేలోపు ఒక సినిమా లాగించేయబోతున్నాడు. అయితే పవన్ తో సినిమాలు చేస్తూ మధ్యలో ఖాళీ అయిన ఇంకో ఇద్దరు దర్శకులు పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఆ ఇద్దరే క్రిష్, సుజిత్. దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న హరిహర వీరమల్లు సంగతి అటు ఇటు తేలకుండా ఉంది. ఆ చిత్ర షూటింగ్ సుదీర్ఘకాలంగా వాయిదా పడుతుంది. అందువల్ల ఇప్పటికే చాలా సమయం వృథా చేసుకున్నాడు క్రిష్.
పవన్ రాజకీయాల నుంచి ఫ్రీ అయ్యి మళ్ళీ సినిమాలకు అందుబాటులోకి వచ్చినా.. తన ప్రయారిటీ హరిహర వీరమల్లు కాకపోవచ్చు. అది పునః ప్రారంభం కావడానికి, పూర్తి అవ్వడానికి ఇంకా చాలా సమయం పట్టొచ్చు. ఈ నేపథ్యంలో హరీష్ లాగే క్రిష్ సైతం మధ్యలో ఇంకో సినిమా తీసుకోవడానికి అవకాశం ఉంది. అందుకు పవన్ కూడా అభ్యంతరం చెప్పకపోవచ్చు. అయితే సుజిత్ మాత్రం వేరే సినిమా వైపు చూసే అవకాశాలు తక్కువే. అతడి ఓజీ చాలా వరకు పూర్తయింది. అతను ఎడిటింగ్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. పవన్ తిరిగి అందుబాటులోకి రాగానే ఓజీనే ముందుగా పూర్తి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సుజిత్ కు పెద్దగా ఇబ్బంది లేదు. కానీ క్రిష్ మాత్రం హరీష్ బాట పడితేనే మంచిదేమో.
This post was last modified on December 17, 2023 7:03 pm
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత చెలరేగిన తీవ్ర హింస పై కేంద్ర ఎన్నికల సంఘం…
https://www.youtube.com/watch?v=BacOcD8e_3k బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సరైన సినిమా కోసం మూవీ లవర్సే కాదు ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తోంది.…
కథలు, కాంబోలు చూసేందుకు ఎంత బాగున్నా బడ్జెట్ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే చాలా సమస్యలు తలెత్తే పరిస్థితులను నిర్మాతలు…
చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోతోంది. ఎన్నికలు ప్లస్ విదేశీ…