గతంలోనే కొన్ని సినిమాలు చేసినప్పటికీ విరాజ్ అశ్విన్ కి గుర్తింపు వచ్చింది బేబీతోనే. ఎక్కువ పేరు ప్రాధాన్యం ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యలు దక్కించుకున్నప్పటికీ కథలో కీలకంగా వ్యవహరించడం వల్ల విరాజ్ సైతం జనం దృష్టిలో పడ్డాడు. అందుకే తను సోలో హీరోగా నటించిన జోరుగా హుషారుగా విడుదల చేస్తే ఆడియన్స్ కి రీచ్ అవుతుందనే ఉద్దేశంలో నిర్మాతలు నిన్న విడుదల చేశారు. అను ప్రసాద్ దర్శకత్వం వహించగా పూజిత పొన్నాడ హీరోయిన్ గా చేసింది. సాయికుమార్, బ్రహ్మాజీ, మధునందన్, రోహిణి తదితరులు పేరున్న క్యాస్టింగ్ తోనే తెరకెక్కించారు.
మధ్యతరగతి కుటుంబానికి చెందిన సంతోష్(విరాజ్ అశ్విన్)కు పెద్ద లక్ష్యాలు ఉన్నప్పటికీ పరిస్థితుల వల్ల చిన్న కంపెనీలో ఉద్యోగం సంపాదించి అప్పులు తీర్చడం గురించి సతమతమవుతూ ఉంటాడు. ఒకప్పటి స్నేహితురాలే టీమ్ లీడర్ నిత్య(పూజిత పొన్నాడ). జీతం పెంచుకోవడం కోసం లేట్ ఏజ్ బ్రహ్మచారి బాస్ ఆనంద్(మధునందన్)ని ఇంప్రెస్ చేసే పనిలో పడ్డ సంతోష్ అతనికి అమ్మాయిలను ప్రేమించడం గురించి టిప్స్ చెబుతూ ఉంటాడు. అనూహ్యంగా ఆనంద్ నిత్యని ఇష్టపడటంతో కథ కొత్త మలుపులు తిరుగుతుంది. ఆ తర్వాత జరిగేది అసలు స్టోరీ.
టైటిల్ లో ఉన్న హుషారు, జోరు సినిమాలో లేకపోవడంతో పాటు దర్శకుడు అను ప్రసాద్ తీసుకున్న పాయింట్ లో ఎలాంటి కొత్తదనం లేకపోవడం నిరాశపరుస్తుంది. లవ్, ఎంటర్ టైన్మెంట్, ఫాదర్ ఎమోషన్ ఈ మూడింటిని బ్యాలన్స్ చేసే క్రమంలో అవసరంలేని సాగతీతకు చోటివ్వడంతో కథనం ఎంతకీ ముందుకు సాగక బోర్ కొట్టిస్తుంది. కామెడీ పరంగా నవ్వించే ప్రయత్నం చేసినా అదంతా రొటీన్ గా ఉండటంతో చప్పగా అనిపిస్తుంది. ఓ రెండు పాటలు పర్వాలేదనిపించినా పేరు చూసి థియేటర్ కొచ్చిన ఆడియన్స్ ని మెప్పించడంలో పూర్తిగా తడబడింది. ఫైనల్ గా బేబీ హీరోకి సోలో బ్రేక్ కాలేకపోయింది.
This post was last modified on December 16, 2023 1:43 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…