రియా చక్రవర్తి నిజంగా సుషాంత్ సింగ్ మరణానికి కారణమయిందో లేదో సిబిఐ నిర్ధారించలేదు. అయితే సుషాంత్ మరణానికి రియా కారణమంటూ అతని తండ్రి కంప్లయింట్ పెట్టిన దగ్గర్నుంచీ ఆమెను నేరస్థురాలిగానే చిత్రీకరిస్తూ మీడియా ట్రయల్ జరుగుతోంది. దీని పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నా కానీ బాలీవుడ్ నుంచి పెద్ద గొంతుకలు వినిపించలేదు. స్వర భాస్కర్ లాంటి చిన్న యాక్టర్లు మాత్రం ఇదెక్కడి చోద్యమంటూ స్పందించారు. బాలీవుడ్ సెలబ్రిటీలు సైలెంట్గా వుండిపోయిన సమయంలో మంచు లక్ష్మి తన వాయిస్ వినిపించింది.
రియాకు జరుగుతోన్నది అన్యాయమని, ఆమె నేరస్థురాలో కాదో న్యాయ వ్యవస్థ, చట్టం తేల్చే వరకు ఎదురు చూడాలని, అంతవరకు ఆమె కుటుంబాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వాలని, ఆమెకు అండగా పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్కి సుషాంత్ కుటుంబ సభ్యుల నుంచి నిరసన వ్యక్తమయినా కానీ దీని వల్ల సైలెంట్గా వున్న బాలీవుడ్ బడా సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా మాట్లాడుతున్నారు. మంచు లక్ష్మిని సమర్ధిస్తూ తాప్సీ కూడా రియాకు సపోర్ట్ గా మాట్లాడింది. విద్యాబాలన్ కూడా మంచు లక్ష్మి పోస్ట్ని ట్యాగ్ చేస్తూ తాను కూడా రియాకు జరుగుతోన్న దానిని నిరసిస్తున్నట్టు పేర్కొంది. ఇంకా సూపర్స్టార్లు, పెద్ద డైరెక్టర్లు బయటకు రాలేదు కానీ మొత్తానికి చలనమయితే వచ్చింది.
This post was last modified on September 2, 2020 1:14 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…