రియా చక్రవర్తి నిజంగా సుషాంత్ సింగ్ మరణానికి కారణమయిందో లేదో సిబిఐ నిర్ధారించలేదు. అయితే సుషాంత్ మరణానికి రియా కారణమంటూ అతని తండ్రి కంప్లయింట్ పెట్టిన దగ్గర్నుంచీ ఆమెను నేరస్థురాలిగానే చిత్రీకరిస్తూ మీడియా ట్రయల్ జరుగుతోంది. దీని పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నా కానీ బాలీవుడ్ నుంచి పెద్ద గొంతుకలు వినిపించలేదు. స్వర భాస్కర్ లాంటి చిన్న యాక్టర్లు మాత్రం ఇదెక్కడి చోద్యమంటూ స్పందించారు. బాలీవుడ్ సెలబ్రిటీలు సైలెంట్గా వుండిపోయిన సమయంలో మంచు లక్ష్మి తన వాయిస్ వినిపించింది.
రియాకు జరుగుతోన్నది అన్యాయమని, ఆమె నేరస్థురాలో కాదో న్యాయ వ్యవస్థ, చట్టం తేల్చే వరకు ఎదురు చూడాలని, అంతవరకు ఆమె కుటుంబాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వాలని, ఆమెకు అండగా పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్కి సుషాంత్ కుటుంబ సభ్యుల నుంచి నిరసన వ్యక్తమయినా కానీ దీని వల్ల సైలెంట్గా వున్న బాలీవుడ్ బడా సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా మాట్లాడుతున్నారు. మంచు లక్ష్మిని సమర్ధిస్తూ తాప్సీ కూడా రియాకు సపోర్ట్ గా మాట్లాడింది. విద్యాబాలన్ కూడా మంచు లక్ష్మి పోస్ట్ని ట్యాగ్ చేస్తూ తాను కూడా రియాకు జరుగుతోన్న దానిని నిరసిస్తున్నట్టు పేర్కొంది. ఇంకా సూపర్స్టార్లు, పెద్ద డైరెక్టర్లు బయటకు రాలేదు కానీ మొత్తానికి చలనమయితే వచ్చింది.
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…
పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…
రాజకీయ చతురతలో మరోసారి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చాణక్యం వెలుగు చూసింది. ఇంకేముంది.. సర్కారును ఇరుకున పెట్టేసి.. కుల,…