సోషల్ మీడియాలో రికార్డుల కోసం అభిమానుల వేలం వెర్రి కొనసాగుతోంది. కొత్తగా ట్వీట్ల రికార్డులు ప్రతిష్టాత్మకంగా మారిపోతున్నాయి అభిమానులకు. కొత్త సినిమాల రిలీజ్లు లేవు. వాటి కలెక్షన్ల గురించి కొట్టుకునే పరిస్థితి లేదు. దీంతో సోషల్ మీడియాలో అమీతుమీ తేల్చుకుంటున్నారు. హీరోల పుట్టిన రోజుల్ని పురస్కరించుకుని కామన్ హ్యాష్ ట్యాగ్ పెట్టి అందరూ దాని మీద ట్వీట్లు వేయడం.. 24 గంటల వ్యవధిలో ఎన్ని ట్వీట్లు వేశాం అన్నదాని మీద సవాళ్లు విసురుకోవడం లాక్ డౌన్లో మొదలైన కొత్త సంస్కృతి. కోటి ట్వీట్ల మార్కుతో మొదలైన ఈ రికార్డుల గొడవ.. ఇప్పుడు 6 కోట్ల రేంజిని దాటేసింది. గత నెలలో మహేష్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకుని అతడి అభిమానులు 60 మిలియన్ ట్వీట్లతో కొత్త రికార్డు నెలకొల్పారు. అది ప్రపంచ రికార్డు కావడం విశేషం.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు ‘అడ్వాన్స్ బర్త్ డే’ ట్రెండ్తోనే ఈ రికార్డును బద్దలు కొట్టేశారు. వాళ్ల ట్రెండ్ 65 మిలియన్ల ట్వీట్ల వరకు వెళ్లింది. ఐతే వాళ్లు అంతటితో సంతృప్తి చెందట్లేదు. కొత్త టార్గెట్తో రెడీ అయిపోయారు పవన్ ఫ్యాన్స్. ఈసారి వాళ్ల టార్గెట్ 100 మిలియన్స్.. అంటే 10 కోట్ల ట్వీట్లట. బుధవారం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని.. మంగళవారం సాయంత్రం ఈ ట్రెండ్ మొదలుపెట్టారు. ఐతే కొన్ని రోజుల కిందటే చిరంజీవి పుట్టిన రోజు వచ్చింది. అప్పుడు చిరు అభిమానులు ఇలాంటి ట్రెండ్ల జోలికి వెళ్లలేదు. పనిగట్టుకుని ట్వీట్లు వేసే పని పెట్టుకోలేదు. మామూలుగా అభిమానులు స్పందిస్తూ.. 3 మిలియన్ల దాకా ట్వీట్లు వేశారు. అనవసరంగా ప్రయాస పడలేదు. ఒక్కొక్కరు వందల్లో వేలల్లో ట్వీట్లు వేయాలని కూర్చోలేదు. చిరు విషయంలో అలా ఆలోచించని మెగా అభిమానులకు పవన్ విషయంలో మాత్రం ఇంత పట్టుదల ఏమిటో? ఇలాంటి రికార్డులతో వచ్చే ప్రయోజనమేంటో?
This post was last modified on September 2, 2020 12:50 am
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…