ఉప్పెన విడుదలై బ్లాక్ బస్టర్ సాధించాక కృతి శెట్టికి తిరుగులేదనే అనుకున్నారందరూ. దానికి తగ్గట్టే అవకాశాలు వచ్చాయి. నాని, నాగచైతన్య, నితిన్, రామ్, సుధీర్ బాబు ఇలా మార్కెట్ ఉన్న మీడియం రేంజ్ హీరోలందరూ తననే ఫస్ట్ ఛాయస్ గా తీసుకున్నారు. తీరా చూస్తే శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు తప్ప మిగిలినవన్నీ డిజాస్టర్లే. ఈ దెబ్బ మాములుగా లేదు. ఒక్కసారిగా మార్కెట్ డౌన్ అయిపోయింది. కోటి దాటిన రెమ్యునరేషన్ కు కోతలు అడిగారు నిర్మాతలు. ఇంకోవైపు శ్రీలీల దూకుడుతో ఒక్కసారిగా కృతికి అవకాశాలు తగ్గిపోయాయి. అయినా పక్క బాషలు ఆదుకుంటున్నాయి.
తెలుగు వరకు చూసుకుంటే కృతి శెట్టి చేతిలో శర్వానంద్ సినిమా ఒకటే ఉంది. ఇది కూడా ఆలస్యమవుతోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. తమిళంలో మాత్రం మంచి ఛాన్సులే వస్తున్నాయి. కార్తీతో వా వాతియారే, జయం రవి సరసన జెనీలో జోడి కట్టింది. తాజాగా లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాధన్ కు ఓకే చెప్పింది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందే లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో హీరోయిన్ గా షూటింగ్ మొదలుపెట్టుకుంది. మలయాళంలో అజయంటే రండం మోశానంలో టోవినో థామస్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇవన్నీ వచ్చే ఏడాది వరసగా విడుదల కాబోతున్నాయి.
ఒకరకంగా కృతి లక్కీనే. ఎందుకంటే హిట్లు లేక మెహ్రీన్, రాశి ఖన్నా లాంటి వాళ్ళు రేస్ లో వెనుకబడితే ఈ అమ్మడికి మాత్రం కోలీవుడ్ నుంచి పిలుపులు వస్తున్నాయి. శర్వానంద్ తో చేస్తున్నది హిట్ అయితే తిరిగి ఇక్కడ కుదురుకోవచ్చు కానీ లేట్ అవుతోంది కాబట్టి వెయిట్ చేయడమే బెటర్. సూర్య సరసన ఛాన్స్ వచ్చినట్టే వచ్చి ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడంతో నిరాశ పడింది కానీ అతని తమ్ముడు కార్తీ సరసన తళుక్కుమననుంది. సినీ పరిశ్రమలో మాట్లాడేది సక్సెసే కాబట్టి అది ఉంటేనే ప్రొడ్యూసర్ల నుంచి కాల్స్ వస్తాయి. లేదంటే ఇలా షిఫ్ట్ అయిపోవడం ఉత్తమమైన పని.
This post was last modified on December 15, 2023 2:38 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…