ఉప్పెన విడుదలై బ్లాక్ బస్టర్ సాధించాక కృతి శెట్టికి తిరుగులేదనే అనుకున్నారందరూ. దానికి తగ్గట్టే అవకాశాలు వచ్చాయి. నాని, నాగచైతన్య, నితిన్, రామ్, సుధీర్ బాబు ఇలా మార్కెట్ ఉన్న మీడియం రేంజ్ హీరోలందరూ తననే ఫస్ట్ ఛాయస్ గా తీసుకున్నారు. తీరా చూస్తే శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు తప్ప మిగిలినవన్నీ డిజాస్టర్లే. ఈ దెబ్బ మాములుగా లేదు. ఒక్కసారిగా మార్కెట్ డౌన్ అయిపోయింది. కోటి దాటిన రెమ్యునరేషన్ కు కోతలు అడిగారు నిర్మాతలు. ఇంకోవైపు శ్రీలీల దూకుడుతో ఒక్కసారిగా కృతికి అవకాశాలు తగ్గిపోయాయి. అయినా పక్క బాషలు ఆదుకుంటున్నాయి.
తెలుగు వరకు చూసుకుంటే కృతి శెట్టి చేతిలో శర్వానంద్ సినిమా ఒకటే ఉంది. ఇది కూడా ఆలస్యమవుతోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. తమిళంలో మాత్రం మంచి ఛాన్సులే వస్తున్నాయి. కార్తీతో వా వాతియారే, జయం రవి సరసన జెనీలో జోడి కట్టింది. తాజాగా లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాధన్ కు ఓకే చెప్పింది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందే లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో హీరోయిన్ గా షూటింగ్ మొదలుపెట్టుకుంది. మలయాళంలో అజయంటే రండం మోశానంలో టోవినో థామస్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇవన్నీ వచ్చే ఏడాది వరసగా విడుదల కాబోతున్నాయి.
ఒకరకంగా కృతి లక్కీనే. ఎందుకంటే హిట్లు లేక మెహ్రీన్, రాశి ఖన్నా లాంటి వాళ్ళు రేస్ లో వెనుకబడితే ఈ అమ్మడికి మాత్రం కోలీవుడ్ నుంచి పిలుపులు వస్తున్నాయి. శర్వానంద్ తో చేస్తున్నది హిట్ అయితే తిరిగి ఇక్కడ కుదురుకోవచ్చు కానీ లేట్ అవుతోంది కాబట్టి వెయిట్ చేయడమే బెటర్. సూర్య సరసన ఛాన్స్ వచ్చినట్టే వచ్చి ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడంతో నిరాశ పడింది కానీ అతని తమ్ముడు కార్తీ సరసన తళుక్కుమననుంది. సినీ పరిశ్రమలో మాట్లాడేది సక్సెసే కాబట్టి అది ఉంటేనే ప్రొడ్యూసర్ల నుంచి కాల్స్ వస్తాయి. లేదంటే ఇలా షిఫ్ట్ అయిపోవడం ఉత్తమమైన పని.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…