టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు పవన్ కళ్యాణ్. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ స్టామినా గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే ఈ రేంజిలో ఉన్నప్పటికీ మిగతా హీరోల్లాగా తన సినిమాల ఫలితాలు, కలెక్షన్లు, రికార్డుల గురించి కానీ.. తన పుట్టిన రోజు వేడుకలప్పుడు అభిమానుల హంగామా గురించి కానీ పవన్ పెద్దగా స్పందించడు. అవేమీ పట్టనట్లు ఉండిపోతాడు. ఐతే ఈసారి మాత్రం తన పుట్టిన రోజు ముంగిట పవన్ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తన అభిమానులు చేసే సందడి గురించి.. చిన్నతనం నుంచి పుట్టిన రోజు నాడు ఎదురైన అనుభవాల గురించి పవన్ ఆసక్తికర విషయాలు మాట్లాడాడు. చిన్నతనం నుంచే పుట్టిన రోజు వేడుకల పట్ల తనకు అంత ఆసక్తి లేదని.. ఒక దశ దాటాక అవి ఎబ్బెట్టుగా అనిపించి మానేశానని పవన్ చెప్పాడు. ఐతే ప్రస్తుతం తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలు, మంచి పనులు మాత్రం తనకెంతో ఆనందాన్నిస్తున్నట్లు పవన్ వెల్లడించాడు. ఇంకా తన పుట్టిన రోజు వేడుకల విషయమై ఈ ఇంటర్వ్యూలో పవన్ ఏమన్నాడంటే..
‘‘చిన్నతనంలో నా పుట్టిన రోజుకు ఒకట్రెండు సందర్భాల్లో స్కూల్లో చాక్లెట్లు పంచినట్లు గుర్తు. తర్వాత అలాంటివన్నీ పక్కన పెట్టేశాను. ఒక దశ దాటాక నా పుట్టిన రోజును నేనే కాక మా ఇంట్లో వాళ్లు కూడా మరిచిపోయేవాళ్లు. రెండు రోజుల తర్వాత ఇంట్లో ఎవరికో ఒకరికి గుర్తొచ్చేది. గుర్తొచ్చినప్పుడు మా వదిన డబ్బులు ఇస్తే పుస్తకాలు కొనుక్కునేవాణ్ని. అంతకుమించి ప్రత్యేకంగా జరుపుకోవడం అలవాటు లేదు. సినిమాల్లోకి వచ్చాక స్నేహితులు, నిర్మాతలు పుట్టిన రోజు వేడుకలు చేయాలని చూసినా ఇబ్బందిగా అనిపించేది. కేక్ కట్ చేయడం.. వాళ్లు నా నోట్లో కేక్ పెట్టడం ఎబ్బెట్టుగా అనిపించేది. అందుకే పూర్తిగా మానేశాను. ఇక అభిమానుల విషయానికి వస్తే నన్ను లక్షలాది మంది అభిమానించడం, అదరించడం, నా పుట్టిన రోజు వేడుకలు చేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. నా ప్రమేయం లేకుండా నా పుట్టిన రోజును పురస్కరించుకొని సేవా వారోత్సవాలు చేస్తున్నారు. అది జన సైనికులు, వీర మహిళలు, అభిమానుల గొప్పతనం. వారికి నా తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా. ఒక వ్యక్తి మీద ఉన్న అభిమానం సమాజానికి ఉపయోగపడితే నిజంగా చాలా తృప్తిగా ఉంటుంది’’ అని పవన్ పేర్కొన్నాడు.
This post was last modified on September 1, 2020 10:03 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…