Animal
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆలోచనా విధానం ఏ స్థాయిలో ఉంటుందో అర్జున్ రెడ్డి, యానిమల్ లో చూశాం కానీ ఎడిటింగ్ లో పక్కన పెట్టిన ఫుటేజ్ లో సంగతులు వింటే ఇంకెన్ని హింసాత్మక ఆలోచనలు ఉన్నాయో అనిపిస్తుంది. క్లైమాక్స్ లో రన్బీర్ కపూర్, బాబీ డియోల్ మధ్య విమానం దగ్గర జరిగే ఫైట్ సీన్ లో బ్యాక్ గ్రౌండ్ లో అన్నా దమ్ముళ్ల బంధాన్ని వివరించే సెంటిమెంట్ సాంగ్ రావడం మొదట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. తండ్రి మీద హత్య ప్రయత్నం చేసినవాడు ఎంత సవితి సోదరుడైనా సరే నరికి అవతల పారేయకుండా కొట్టుకుంటూ ఈ పాట ఏంటనే డౌట్ కలగడం సహజం.
దీనికి ఇంకో కోణం వివరించాడు బాబీ డియోల్. నిజానికి సందీప్ వంగా ఈ ఇద్దరి మధ్య ఒక ముద్దుని కూడా షూట్ చేశాడట. చంపుకోవడం ఎందుకు, ఇప్పుడు కూడా రాజీ పడే అవకాశం ఉందనే రీతిలో ఆ ప్రేమని చుంబనం ద్వారా వ్యక్తపరిచేలా సీన్ రాసుకున్నాడు వంగా. తీరా ఎడిట్ చేసేటప్పుడు అది తప్పుడు సంకేతం ఇచ్చి, రణ్ విజయ్ పగలో డెప్త్ ని తగ్గించేస్తుందని భావించి ఇష్టం లేకపోయినా కత్తెర వేయాలని నిర్ణయించుకున్నాడు. ఇది ఫైనల్ వెర్షన్ చూశాక బాబీ డియోల్ కు అర్థమైంది. ఒకవేళ ఓటిటిలో అన్ కట్ వెర్షన్ వస్తే అప్పుడా సీన్ ని ఎంజాయ్ చేయొచ్చని అంటున్నాడు.
ఇదంతా ఒక బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబీనే స్వయంగా వెల్లడించడం విశేషం. యానిమల్ దెబ్బకు ఇప్పుడితని డిమాండ్ మాములుగా లేదు. మొన్నటి దాకా నాలుగు కోట్లు ఉన్న రెమ్యునరేషన్ ఇప్పుడు ఏకంగా డబుల్ డిజిట్ దాటిపోయిందట. పైగా తెలుగు తమిళం నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. హిందీలో భారీ పారితోషికాలతో నిర్మాతలు క్యూ కడుతున్నారు. సక్సెస్ కి మొహం వాచిపోయిన ఇతనికి కేవలం ఓ ముప్పావు గంట అబ్రార్ పాత్ర గొప్ప ఇన్నింగ్స్ నిర్మించి ఇచ్చింది. క్యారెక్టర్ చనిపోయినా యానిమల్ పార్క్ లో తనకూ చోటు ఉంటుందని ఆశిస్తున్నాడు బాబీ డియోల్.
This post was last modified on December 14, 2023 8:13 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…