తెలుగు రాష్ట్రాల్లోని చాలా పట్టణాల్లో థియేటర్ల సంఖ్య అయిదు నుంచి పది మధ్యలోనే ఉంది. ఇక సి, డి సెంటర్లుగా చెప్పుకునే గ్రామాల్లో మూడు కంటే ఎక్కువ ఉండవు. జిల్లా కేంద్రాల్లో మాత్రమే పదిహేనుకి పైగా చూడొచ్చు. అది కూడా మల్టీప్లెక్సుల పుణ్యమాని స్క్రీన్లు పెరిగాయి కానీ లేదంటే పరిస్థితి ఇంకా కిందకు ఉండేది. సంక్రాంతికి ఎవరికి వారు తగ్గమని మొండికేయడంతో వీటి సర్దుబాటు డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద సమస్యగా మారబోతోంది. ముందు జాగ్రత్తగా అడ్వాన్సులు ఇచ్చి బ్లాక్ చేయడం లాంటివి చేస్తున్నారు కానీ డిమాండ్ కు తగ్గ సప్ప్లై లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. ఓవర్ ఫ్లోస్ వల్ల ప్రొడ్యూసర్లు నష్టపోయే ఛాన్స్ ఉంటుంది.
గుంటూరు కారంకి ఉన్న బజ్ నేపథ్యంలో దానికి వీలైనన్ని ఎక్కువ స్క్రీన్లు ఇవ్వడం ధర్మమే. అలా అని వెంకటేష్, రవితేజ, నాగార్జున మార్కెట్ ని తక్కువంచనా వేయడానికి లేదు. ఓ చిన్న ఊళ్ళో మూడే థియేటర్లు ఉంటే ఇక్కడ చెప్పిన వాటిలో నాలుగోది రావడం అసాధ్యం. ఏదైనా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే ఉన్న అయిదు షోలు ఏ మూలకు సరిపోవు. పోటీ లేని టైంలో అయితే సులభంగా రెండు మూడు స్క్రీన్లు మహేష్ రేంజ్ హీరోలకు సులభంగా ఇస్తారు. వీటికే ఇలా ఉంటే మరి హనుమాన్ కి ఎలా సర్దుబాటు చేస్తారనేది పెద్ద ఛాలెంజ్. కొన్ని చోట్ల రిలీజే ఉండకపోయే రిస్క్ ఉంది. తేజ సజ్జ మార్కెట్ కన్నా గ్రాఫిక్స్ మీద ఎక్కువ ప్రమోషన్ చేస్తున్న మూవీ ఇది.
గతంలోనూ ఈ సమస్య వచ్చింది కానీ ఇంత తీవ్రంగా అయితే లేదు. హేమాహేమీ హీరోలు ఒకేసారి బరిలో దిగితే ఇలాగే ఉంటుంది. పంపకాల్లో ఏ మాత్రం తేడా వచ్చినా అభిమానులు నిర్మాతల మీద సోషల్ మీడియా వేదికగా దాడి చేస్తారు. మా హీరోకు అన్యాయం జరిగిందని గగ్గోలు పెడతారు. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిల విషయంలో ఈ వాదోపవాదాలు జరిగాయి. అన్ని ఒకే రోజు రావడం లేదు. కానీ గుంటూరు కారం-హనుమాన్, సైంధవ్-ఈగల్ క్లాష్ అవుతున్నాయి. నా సామిరంగా రేపో ఎల్లుండో నిర్ణయం తీసుకుంటారు. ఇంత టైట్ షెడ్యూల్ లో ధనుష్, రజనీకాంత్, శివ కార్తికేయన్ డబ్బింగ్ సినిమాలు వచ్చేందుకు ప్రయత్నం చేయడం ఇంకో ట్విస్టు.
This post was last modified on December 13, 2023 7:41 pm
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…