కేవలం 240 గంటల్లో సలార్ విడుదలనే తలంపే ప్రభాస్ అభిమానులకు ఎక్కడ లేని ఉత్సాహాన్ని తీసుకొస్తోంది. అయితే నిర్మాతలు ప్రమోషన్ విషయంలో వహిస్తున్న అలక్ష్యం పట్ల మాత్రం అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం. నిజానికి సలార్ స్టామినాని ప్రొడ్యూసర్లతో సహా అపోజిషన్ ఎంత తక్కువగా అంచనా వేస్తుందో ఒక్క చిన్న ఉదాహరణ చాలు. అమెరికాలో ప్రీమియర్ల అడ్వాన్స్ బుకింగ్ రూపంలో సలార్ 347 లొకేషన్లకు గాను 6 లక్షల డాలర్ల దాకా వసూలు చేయగా డంకీ అంతే స్థాయిలో 328 లొకేషన్లను దక్కించుకున్నప్పటికీ కేవలం 90 వేల డాలర్లను అతి కష్టం మీద దాటగలిగింది.
ఈ ఫిగర్లు చెబుతాయి సలార్ ఫీవర్ ఏ స్థాయిలో ఆడియన్స్ లో ఉందో. రాజ్ కుమార్ హిరానీ బ్రాండ్, రెండు వెయ్యి కోట్లు సాధించిన షారుఖ్ ఖాన్ మార్కెట్ ఇవేవీ డంకీకి ప్లస్ కావడం లేదు. పైగా ట్రైలర్ కు మిశ్రమ స్పందన రావడంతో రెడ్ చిల్లీస్ పాలుపోని పరిస్థితిలో ఇరుక్కుంది. వాయిదా వేయమని బయ్యర్లు ఎంతగా పోరినా వెనక్కు తగ్గేదెలే అంటూ సిద్ధపడిన వైనం నష్టం చేసేలా ఉంది. సలార్ కు కెజిఎఫ్ రేంజ్ లో హోంబాలే ఫిలిమ్స్ పబ్లిసిటీ చేయడం లేదు. ఫస్ట్ ఆడీయో సింగల్ ప్రకటన కూడా ఇవాళ వస్తోంది. కొత్త ట్రైలర్ ఉంటుందో లేదో ఖచ్చితంగా చెప్పడం లేదు.
వీటి సంగతి ఎలా ఉన్నా కంటెంట్ మాట్లాడితే చాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. బెనిఫిట్ షోలు ఏ సమయానికి మొదలవుతాయనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. ముందైతే టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు రావాలి. ఏపీలో ఎలాంటి కండీషన్లు పెడతారో తెలియదు. తెలంగాణలో ప్రభుత్వం మారింది కాబట్టి వాళ్ళ ఆలోచనా ధోరణి ఎలా ఉండబోతోందో సలార్ వ్యవహారంలో తేలిపోతుంది. అర మిలియన్ అడ్వాన్స్ లోనే దాటేసిన సలార్ డిసెంబర్ 22 లోపే రెండు మిలియన్లు చేరుకున్నా ఆశ్చర్యం లేదు. ఇండియా వైడ్ బుకింగ్స్ శుక్రవారం నుంచి మొదలుపెడతారు.
This post was last modified on December 12, 2023 3:11 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…