Movie News

సైంధ‌వ్‌ ఇంజెక్షన్ ఒక్కడున్నాడు కనెక్షన్

గురు నుంచి వెంకటేష్ పూర్తి యాక్షన్ మాస్ సినిమా చేయడమే మానేశారు. ఎఫ్2, ఎఫ్3 రెండూ కామెడీ ఎంటర్ టైనర్లు. నారప్ప ఓటిటి రిలీజ్ కావడంతో దాని స్థాయి జనాలకు తెలియలేదు. దృశ్యం 2 ఫ్యామిలీ థ్రిల్లర్ కావడంతో దాని రీచ్ పరిమితమే. అందుకే అభిమానుల ఆశలన్నీ సైంధ‌వ్‌ మీద ఉన్నాయి. జనవరి 13 విడుదల కాబోతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీలో వెంకీ చాలా ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇంత వయొలెంట్ మాస్ ని చూసి ఫ్యాన్స్ వేరెత్తిపోవడం ఖాయమని ఊరిస్తున్నారు. సరే ఒక్కడున్నాడు ఏంటనే పాయింట్ కి వద్దాం.

సైంధ‌వ్‌ కథ పాపను బ్రతికించుకోవడానికి అవసరమైన ఒక ఇంజెక్షన్ చుట్టూ తిరుగుతుందని ఇన్ సైడ్ టాక్. అదేం పెద్ద విషయం అనుకోకండి. అరుదైన వ్యాధికి సంబంధించిన చికిత్స కోసం వాడే ఆ సూది మందు ధర 17 కోట్లకు పై మాటే. ఇది విలన్ నవాజుద్దీన్ సిద్ధిక్ కూడా అవసరం పడటంతో ఇద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఒకప్పుడు శత్రువులైన వెంకీ, నవాజ్ లు దీని కోసం హింసాత్మక నరమేధానికి తెరతీస్తారు. ఇదంతా దర్శకుడు శైలేష్ కొలను చాలా డిఫరెంట్ ట్రీట్ మెంట్ తో తీశాడట. 2007లో గోపిచంద్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి ఒక్కడున్నాడు వచ్చింది.

అందులో అరుదైన బాంబే బ్లడ్ కోసం హీరోని చంపేందుకు విలన్ మహేష్ మంజ్రేకర్ ముఠా వెంటపడుతుంది. ఫస్ట్ హాఫ్ లో మంచి థ్రిల్స్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు యేలేటి. రెండో సగం దెబ్బ కొట్టడంతో సినిమా ఫ్లాప్ అయ్యింది. అక్కడ రక్తం కోసం కొట్టుకుంటే ఇక్కడ ఇంజెక్షన్ కోసం వార్ చేస్తారు. అలా అని రెండు స్టోరీ లైన్స్ ఒకటే కాదు కానీ ఇద్దరు దర్శకులు మాత్రం నిజ జీవిత సంఘటనల ఆధారంగా వీటి కథలు రాసుకోవడం గమనించాల్సిన విషయం. సైంధ‌వ్‌ లో శ్రద్ధ శ్రీనాథ్, ఆర్య, రుహాని శర్మ, ఆండ్రియా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉన్నా సైంధ‌వ్‌ కాన్ఫిడెంట్ గా ఉంది.

This post was last modified on December 11, 2023 5:37 pm

Share

Recent Posts

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

1 hour ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

1 hour ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

1 hour ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

5 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

5 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

7 hours ago