గురు నుంచి వెంకటేష్ పూర్తి యాక్షన్ మాస్ సినిమా చేయడమే మానేశారు. ఎఫ్2, ఎఫ్3 రెండూ కామెడీ ఎంటర్ టైనర్లు. నారప్ప ఓటిటి రిలీజ్ కావడంతో దాని స్థాయి జనాలకు తెలియలేదు. దృశ్యం 2 ఫ్యామిలీ థ్రిల్లర్ కావడంతో దాని రీచ్ పరిమితమే. అందుకే అభిమానుల ఆశలన్నీ సైంధవ్ మీద ఉన్నాయి. జనవరి 13 విడుదల కాబోతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీలో వెంకీ చాలా ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇంత వయొలెంట్ మాస్ ని చూసి ఫ్యాన్స్ వేరెత్తిపోవడం ఖాయమని ఊరిస్తున్నారు. సరే ఒక్కడున్నాడు ఏంటనే పాయింట్ కి వద్దాం.
సైంధవ్ కథ పాపను బ్రతికించుకోవడానికి అవసరమైన ఒక ఇంజెక్షన్ చుట్టూ తిరుగుతుందని ఇన్ సైడ్ టాక్. అదేం పెద్ద విషయం అనుకోకండి. అరుదైన వ్యాధికి సంబంధించిన చికిత్స కోసం వాడే ఆ సూది మందు ధర 17 కోట్లకు పై మాటే. ఇది విలన్ నవాజుద్దీన్ సిద్ధిక్ కూడా అవసరం పడటంతో ఇద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఒకప్పుడు శత్రువులైన వెంకీ, నవాజ్ లు దీని కోసం హింసాత్మక నరమేధానికి తెరతీస్తారు. ఇదంతా దర్శకుడు శైలేష్ కొలను చాలా డిఫరెంట్ ట్రీట్ మెంట్ తో తీశాడట. 2007లో గోపిచంద్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి ఒక్కడున్నాడు వచ్చింది.
అందులో అరుదైన బాంబే బ్లడ్ కోసం హీరోని చంపేందుకు విలన్ మహేష్ మంజ్రేకర్ ముఠా వెంటపడుతుంది. ఫస్ట్ హాఫ్ లో మంచి థ్రిల్స్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు యేలేటి. రెండో సగం దెబ్బ కొట్టడంతో సినిమా ఫ్లాప్ అయ్యింది. అక్కడ రక్తం కోసం కొట్టుకుంటే ఇక్కడ ఇంజెక్షన్ కోసం వార్ చేస్తారు. అలా అని రెండు స్టోరీ లైన్స్ ఒకటే కాదు కానీ ఇద్దరు దర్శకులు మాత్రం నిజ జీవిత సంఘటనల ఆధారంగా వీటి కథలు రాసుకోవడం గమనించాల్సిన విషయం. సైంధవ్ లో శ్రద్ధ శ్రీనాథ్, ఆర్య, రుహాని శర్మ, ఆండ్రియా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉన్నా సైంధవ్ కాన్ఫిడెంట్ గా ఉంది.
This post was last modified on December 11, 2023 5:37 pm
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…