యానిమల్ సృష్టించిన భీభత్సానికి ట్రేడ్ సైతం నివ్వెరపోతోంది. రెండు వారాలు దాటకుండానే 660 కోట్ల గ్రాస్ వసూలు చేయడం చూసి ఎవరికీ నోటమాట రావడం లేదు. ఈ సునామి అంత సులభంగా నెమ్మదించేలా లేదు. అసలు ట్విస్టు వేరే ఉంది. మాములుగా రిలీజైన మొదటి మూడు రోజులు స్పెషల్ షోలు మాములే కానీ పదో రోజు అర్ధరాత్రిళ్ళు ప్రీమియర్లు వేయడం మాత్రం ఒక్క యానిమల్ కే జరిగింది. ఆదివారం కటిక చీకటి అర్ధరాత్రి 12 గంటలు మొదలుపెట్టి ఉదయం 4 దాకా ముంబై మల్టీప్లెక్సుల్లో షోలు వేయడం విచిత్రమైతే చాలా మటుకు హౌస్ ఫుల్స్ కావడం మరో షాక్.
ఒకరకంగా చెప్పాలంటే యానిమల్ కోసం నార్త్ ఆడియన్స్ ఏకంగా శివరాత్రి జాగారాలు చేస్తున్నారు. మూడున్నర గంటల సినిమా, పావు గంట ఇంటర్వెల్, రానుపోను గంట ప్రయాణం మొత్తం లెక్కేసుకుంటే అసలు ఇంటికెళ్ళాక కునుకు వేసేందుకు కూడా ఛాన్స్ ఉండదు. అయినా సరే ఆడియన్స్ లెక్క చేయడం లేదు. అలా అని టికెట్ రేట్లలో డిస్కౌంట్లు ఇవ్వడం లేదు. రెండు వందలతో మొదలుపెట్టి వెయ్యికి పైగానే ధరలు పెడుతున్నా ఆన్ లైన్లోనే ప్రేక్షకులు కొనేస్తున్నారు. ఇంత మేనియాని గత కొన్నేళ్లలో షారుఖ్, అమీర్, సల్మాన్ లాంటి బడా స్టార్లు చూడలేదన్నది వాస్తవం.
ఇది డిసెంబర్ మూడో వారం సలార్, డంకీ వచ్చే దాకా కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రన్బీర్ కపూర్ కెరీర్ లోనే కాదు వరల్డ్ వైడ్ టాప్ 10 హయ్యెస్ట్ గ్రాసర్స్ లో చోటు సంపాదించుకున్న యానిమల్ వెయ్యి కోట్ల మార్క్ దాటడం లాంఛనమే. జవాన్ ని ఇప్పట్లో ఎవరూ క్రాస్ చేయరు అనుకుంటే రెండు నెలలు తిరక్కుండానే సందీప్ రెడ్డి వంగా దాటి చూపించేలా ఉన్నాడు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క లీడ్ యాక్టర్ సోషల్ మీడియా అకౌంట్ల ఫాలోయర్స్ విపరీతంగా పెరిగిపోతున్నారు. రష్మిక మందన్న కన్నా త్రిప్తి డిమ్రి ఎక్కువ హైలైట్ కావడం చూశాంగా.
This post was last modified on December 10, 2023 8:25 pm
ఏపీలో పోలింగ్ ప్రక్రియకు మరికొన్ని గంటల ముందు.. సంచలనం చోటు చేసుకుంది. కూటమి పార్టీల ముఖ్య నేత, టీడీపీ అధినేత…
ఏపీలో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. శనివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసిపోవడంతో నాయకులు, పార్టీల అధినే తలు ఎక్కడికక్కడ సేద…
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్పల్లిలో చోటు చేసుకుంది.…
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో యూత్లో పవన్కు ఉన్నది మామూలు క్రేజ్ కాదు. సినిమాల్లో సూపర్ స్టార్ ఇమేజ్ వల్ల…
ఆంధ్రప్రదేశ్లో గత పర్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ 151 సీట్లతో ఘనవిజయం సాధించడంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్…
దాదాపు 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పీసీసీచీఫ్ ఎనుముల రేవంత్…