సంక్రాంతి సినిమాల పందెం చాలా రసవత్తరంగా మారుతోంది. ఫస్ట్ కాపీ ఇంకా ఎవరిదీ సిద్ధం కాలేదు కానీ ఆయా దర్శక నిర్మాతలందరూ పోస్ట్ ప్రొడక్షన్లు, ప్రమోషన్లు చేసుకుంటున్నారు. జనవరి 12 గుంటూరు కారం – హనుమాన్, జనవరి 13 సైంధవ్ – ఈగల్ ఇప్పటిదాకా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసుకున్న డేట్లు. ఏదైనా అనూహ్యంగా జరిగితే తప్ప వీటిలో ఎలాంటి మార్పు ఉండదు. డబ్బింగ్ సినిమాలు రజినీకాంత్ లాల్ సలామ్, ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివ కార్తికేయన్ అయలన్ ఇంకా తేదీలను ఖరారు చేసుకోలేదు. వీటి సంగతి పక్కనపెడితే నా సామిరంగా సైతం పండగ బరికే రెడీ అవుతోంది.
సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సెంటిమెంట్ ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని కంకణం కట్టుకున్న నాగార్జున ఈసారి అందరికంటే ముందొచ్చే ఆలోచన చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. జనవరి 10 లేదా 11 వీటిలో ఏదో ఒకటి లాక్ చేసుకుని మంచి ఓపెనింగ్స్ తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. టాక్ మీద ఎలాగూ నమ్మకం ఉంది కాబట్టి ప్రేక్షకులు కనక ఆదరిస్తే తర్వాత వచ్చేవాటి ఫలితంతో సంబంధం లేకుండా నిలబడవచ్చని ఆలోచిస్తున్నారట. పైగా అగ్రిమెంట్లు ముందుగానే చేసుకుంటారు కాబట్టి హఠాత్తుగా థియేటర్ల నుంచి తీసేయడం లాంటివి జరగకపోవచ్చు. ఇవన్నీ సీరియస్ గా విశ్లేషిస్తున్నారు.
ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకుని ట్రైలర్ తో పాటుగా ప్రకటించే అవకాశాలు పెరుగుతున్నాయి. విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందుతున్న నా సామిరంగాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొన్నేళ్లుగా యాక్షన్ డ్రామాలతో అవసరం లేని ప్రయోగాలు చేసి వరసగా దెబ్బ తిన్న నాగార్జునకి మాస్ లో తగ్గిపోయిన పట్టుని తిరిగి నిలబెట్టే సత్తా నా సామి రంగాకు ఉందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మలయాళం హిట్ మూవీ పోరంజు మరియం జోస్ పాయింట్ ని తీసుకుని తెలుగు నేటివిటికి అనుగుణంగా మార్చారు.
This post was last modified on December 10, 2023 2:11 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…