Movie News

డబుల్ ఆఫర్లతో తెలుగులో త్రిష పునఃప్రవేశం

ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా స్టార్ హీరోలందరి సరసన నటించిన త్రిష తర్వాత అవకాశాలు తగ్గిపోయి పూర్తిగా తమిళంకే అంకితమైపోయింది. అయితే పొన్నియిన్ సెల్వన్ చూశాక జనాల అభిప్రాయాలు మారిపోయాయి. పదిహేనేళ్ల కెరీర్ తర్వాత కూడా త్రిష ఇంత అందంగా నటించడం చూసి ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతైంది. విజయ్ లియోలో ఏరికోరి ఆమెను తీసుకోవడానికి కారణం ఇదే. అజిత్ సరసన ఆఫర్ కొట్టేసింది. సోలోగా నటించే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు ఓటిటిలో మంచి డిమాండ్ వస్తోంది. ఇప్పుడు తన కాంబో కోరుకుంటున్న వాళ్ళలో తెలుగు స్టార్లు కూడా ఉన్నారు.  

చిరంజీవి విశ్వంభరలో త్రిష హీరోయిన్ కావడం కన్ఫర్మే. యూనిట్ అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ త్వరలోనే ప్రకటన ఇచ్చేందుకు సరైన టైం కోసం ఎదురు చూస్తున్నారు. అజిత్ తో షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్న త్రిష తిరిగి రాగానే డేట్ల సర్దుబాటుని బట్టి డేట్స్ ప్లాన్ చేస్తారు. గతంలో ఈ కాంబోలో స్టాలిన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక నాగార్జున హీరోగా తమిళ దర్శకుడు నవీన్ తో చేయబోయే మూవీకి కూడా త్రిషనే అనుకుంటున్నారట. లవ్ యాక్షన్ రొమాన్స్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ ప్యాన్ ఇండియా మూవీకి సూర్య బంధువు జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.

అధికారికంగా చెప్పకపోయినా ఈ రెండు ఫిక్స్ చేసుకున్నట్టే. నిజానికి ఈ సెకండ్ ఇన్నింగ్స్ కెరీర్ ఇంత స్పీడ్ గా ఉంటుందని త్రిష ఊహించి ఉండదు. నాలుగు పదుల వయసుకు దగ్గరలో ఉన్న సాటి హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతే తను మాత్రం ఇంకా టాప్ డిమాండ్ లో ఉండటం అనూహ్యమే. నాగ్ త్రిషల కలయిక కింగ్ గొప్ప విజయం సాధించకపోయినా అందులో కామెడీని ఇప్పటి జనాలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. తిరిగి మళ్ళీ కలుసుకోవడం ఫ్యాన్స్ కి శుభవార్తే. ప్రస్తుతం నా సామి రంగా, తర్వాత ధనుష్-శేఖర్ కమ్ముల సినిమాలతో నాగ్ బిజీగా ఉన్నాడు. 

This post was last modified on December 10, 2023 1:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago