నిర్మాత సేఫ్ అవ్వాలంటే దర్శకుడు బడ్జెట్ ని కంట్రోల్ ఉంచాలి. హెచ్చుతగ్గులు సహజమే కానీ మరీ హద్దులు మీరితే చాలా ప్రమాదం. కల్ట్ దర్శకుడిగా తమిళంతో పాటు తెలుగులోనూ పేరున్న వెట్రిమారన్ దీనికి సంబందించి కొన్ని షాకింగ్ విషయాలు పంచుకున్నారు. ఈ ఏడాది విమర్శకుల ప్రశంసలు అందుకున్న విడుదల పార్ట్ 1 కోసం ముందు వేసుకున్న బడ్జెట్ 4 కోట్ల 50 లక్షలు. ఒక ఎత్తైన కొండ ప్రాంతంని షూటింగ్ కోసం ఎంచుకుని అక్కడ 250 మందికి సరిపడా టెంట్లు వేశారు. దగ్గర్లోని గ్రామస్థులకు కూడా ఉపయోగపడేలా పన్నెండు టాయిలెట్లు నిర్మించి అంతా సిద్ధం చేసుకున్నారు.
అక్కడికే డెబ్భై శాతం డబ్బులు ఖర్చయిపోయాయి. ఇంకా షూటింగ్ మొదలుపెట్టనేలేదు. ఈలోగా గాలి తుఫాను వచ్చి మొత్తం టెంట్లు కూలిపోయాయి. దీంతో ఇక ఈ ప్రాజెక్టు ఆగినట్టేనని వెట్రిమారన్ ఫిక్సయిపోయి అదే మాట నిర్మాతతో అన్నారు. ఇక్కడి దాకా వచ్చి వెనుకడుగు వేయడం ఎందుకని, ధైర్యంగా ముందుకు వెళదామని చెప్పడంతో లొకేషన్ మార్చుకుని మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేశారు. ఇలా క్రమంగా రోజులు గడిచే కొద్దీ బడ్జెట్ కాస్తా 65 కోట్లకు చేరుకుంది. అంటే ముందు వేసుకున్న లెక్కలకు ఏకంగా పదిహేనింతలు ఎక్కువ. ఏ మాత్రం తేడా కొట్టినా ప్రొడ్యూసర్ నిలువునా మునిగిపోతాడు.
35 రోజుల్లో పూర్తి చేయాలనుకున్న సినిమా కాస్తా ఏకంగా నెలల తరబడి నిర్మాణం జరుపుకుంది. రెండు భాగాలకు రెడీ అయ్యాడు. అదృష్టవశాత్తు తమిళంలో విడుదల పార్ట్ 1 వర్కౌట్ అయ్యింది. సీక్వెల్ కు కావాల్సిన బజ్, డిమాండ్ వచ్చాయి. ఒకవేళ డిజాస్టర్ అయ్యుంటే వెట్రిమారన్ కు తలెత్తుకుని తిరిగే పరిస్థితి ఉండేది కాదు. ఇదంతా ఆయనే స్వయంగా ఒక రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. విడుదల పార్ట్ 2 త్వరలో ప్రారంభం కానుంది. వంద కోట్ల బడ్జెట్ కావొచ్చని చెన్నై టాక్ ఉంది. ఈసారి విజయ్ సేతుపతి కేంద్రంగా కథను నడిపించబోతున్నారు. 2024 దీపావళి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…