నిర్మాత సేఫ్ అవ్వాలంటే దర్శకుడు బడ్జెట్ ని కంట్రోల్ ఉంచాలి. హెచ్చుతగ్గులు సహజమే కానీ మరీ హద్దులు మీరితే చాలా ప్రమాదం. కల్ట్ దర్శకుడిగా తమిళంతో పాటు తెలుగులోనూ పేరున్న వెట్రిమారన్ దీనికి సంబందించి కొన్ని షాకింగ్ విషయాలు పంచుకున్నారు. ఈ ఏడాది విమర్శకుల ప్రశంసలు అందుకున్న విడుదల పార్ట్ 1 కోసం ముందు వేసుకున్న బడ్జెట్ 4 కోట్ల 50 లక్షలు. ఒక ఎత్తైన కొండ ప్రాంతంని షూటింగ్ కోసం ఎంచుకుని అక్కడ 250 మందికి సరిపడా టెంట్లు వేశారు. దగ్గర్లోని గ్రామస్థులకు కూడా ఉపయోగపడేలా పన్నెండు టాయిలెట్లు నిర్మించి అంతా సిద్ధం చేసుకున్నారు.
అక్కడికే డెబ్భై శాతం డబ్బులు ఖర్చయిపోయాయి. ఇంకా షూటింగ్ మొదలుపెట్టనేలేదు. ఈలోగా గాలి తుఫాను వచ్చి మొత్తం టెంట్లు కూలిపోయాయి. దీంతో ఇక ఈ ప్రాజెక్టు ఆగినట్టేనని వెట్రిమారన్ ఫిక్సయిపోయి అదే మాట నిర్మాతతో అన్నారు. ఇక్కడి దాకా వచ్చి వెనుకడుగు వేయడం ఎందుకని, ధైర్యంగా ముందుకు వెళదామని చెప్పడంతో లొకేషన్ మార్చుకుని మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేశారు. ఇలా క్రమంగా రోజులు గడిచే కొద్దీ బడ్జెట్ కాస్తా 65 కోట్లకు చేరుకుంది. అంటే ముందు వేసుకున్న లెక్కలకు ఏకంగా పదిహేనింతలు ఎక్కువ. ఏ మాత్రం తేడా కొట్టినా ప్రొడ్యూసర్ నిలువునా మునిగిపోతాడు.
35 రోజుల్లో పూర్తి చేయాలనుకున్న సినిమా కాస్తా ఏకంగా నెలల తరబడి నిర్మాణం జరుపుకుంది. రెండు భాగాలకు రెడీ అయ్యాడు. అదృష్టవశాత్తు తమిళంలో విడుదల పార్ట్ 1 వర్కౌట్ అయ్యింది. సీక్వెల్ కు కావాల్సిన బజ్, డిమాండ్ వచ్చాయి. ఒకవేళ డిజాస్టర్ అయ్యుంటే వెట్రిమారన్ కు తలెత్తుకుని తిరిగే పరిస్థితి ఉండేది కాదు. ఇదంతా ఆయనే స్వయంగా ఒక రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. విడుదల పార్ట్ 2 త్వరలో ప్రారంభం కానుంది. వంద కోట్ల బడ్జెట్ కావొచ్చని చెన్నై టాక్ ఉంది. ఈసారి విజయ్ సేతుపతి కేంద్రంగా కథను నడిపించబోతున్నారు. 2024 దీపావళి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on December 9, 2023 11:11 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…