మాములుగా రాజకీయ నాయకులు సినిమా ప్రపంచంతో పెద్దగా సంబంధం లేనట్టుగా ఉంటారు. ఏదైనా వివాదం వచ్చినపుడు తప్ప తల దూర్చడం లాంటివి ఉండవు. తాజాగా ఛత్తీస్ గడ్ కు చెందిన ఎంపీ రంజిత్ రంజన్ రాజ్య సభ్యలో పుష్ప, యానిమల్, కబీర్ సింగ్ గురించి లేవనెత్తిన అంశాలు చర్చకు దారి తీస్తున్నాయి. వీటిలో హీరోలను విపరీత ప్రవర్తనతో చూపించి, ఆడవాళ్ళ పట్ల అనైతిక ప్రవర్తనలు ప్రేరేపించడం వల్ల దాని ప్రభావం సమాజం మీద పడుతోందని, యువత ఆలోచనలు పెడదారి పట్టే ప్రమాదం ఉందని స్పీకర్ ని ఉద్దేశించి సభ్యులందరికీ తన ప్రశ్నలు వినిపించింది.
ఆవిడ చెప్పడమే కానీ నిజానికి ఇక్కడ కొన్ని అంశాలు గమనించుకోవాలి. సినిమాలు చూసి ప్రజానీకం ప్రభావితం చెందుతారా అంటే దీనికి సమాధానం సులభంగా చెప్పలేం. భారతీయుడు, ఠాగూర్, అపరిచితుడు చూసి ఎవరూ లంచాలు తీసుకోవడం, ఇవ్వడం మానలేదు. మహానటి చూసి తాగుడుకి దూరమైన వాళ్ళు ఎందరు. అలా అని మంచి తీసుకోనంత మాత్రాన చెడుని అంటించుకోరని కాదు. ఆ మధ్య ఢిల్లీలో ఒకడు భార్యని హత్య చేసి ఫ్రిడ్జ్ లో దాచి పెట్టాడు. ఎలా తట్టిందంటే ఒక హాలీవుడ్ వెబ్ సిరీస్ చూసి యధాతధంగా దాన్నే ఫాలో అయ్యాడట. విస్తుపోవడం పోలీసుల వంతైంది.
ట్రెండ్లు ఫ్యాషన్లు అధిక శాతం సినిమాల నుంచి వచ్చే మాట వాస్తవమే కానీ జరిగే ప్రతి తప్పుకు ఫిలిం మేకర్స్ నే బాద్యులు చేయడం సరికాదు. ఆ మాటకొస్తే మంచి చిత్రాలు తీసినప్పుడు ప్రోత్సహించే రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయని అడిగితే ఠక్కున సమాధానం రాదు. పుష్ప చూసి ఎవరూ స్మగ్లర్ కారు, యానిమల్ నుంచి బయటికి వచ్చాక ఇంటికెళ్లి ఎవడూ భార్య మీద చేయి చేసుకోడు. ఫాంటసీకి రియాలిటీకి తేడా పబ్లిక్ కి తెలుసు. ఎంపీ అడగటం బాగానే ఉంది కానీ అంతులేని చర్చకు దారి తీసే ఇలాంటి టాపిక్స్ మీద అంత సులభంగా కంక్లూజన్ కి రావడం అసాధ్యమనే చెప్పాలి.
This post was last modified on December 8, 2023 7:27 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…