ఇవాళ హైదరాబాద్ వచ్చిన అంతర్జాతీయ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ సిఈఓ టెడ్ సరండోస్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనతో పాటు రామ్ చరణ్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశంలో సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తో పాటు సదరు సంస్థ కీలక ప్రతినిథులు పాల్గొన్నారు. అయితే అజెండా ఏంటనేది బయటికి రాలేదు కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇది స్నేహపూర్వక కలయిక మాత్రమేనని తెలిసింది. హిందీ ఆర్ఆర్ఆర్ కు నెట్ ఫ్లిక్స్ లో వరల్డ్ వైడ్ అమోఘమైన స్పందన దక్కింది. ఆస్కార్ వచ్చాక మిలియన్ల వ్యూస్ వెల్లువలా ఆ ఓటిటిని ముంచెత్తాయి.
నిజానికి నెట్ ఫ్లిక్స్ ఇండియాలో మార్కెట్ ని పెంచుకునేందుకు తీవ్ర ప్రణాళికలు వేస్తోంది. కేవలం తెలుగు తమిళ సినిమాల మీదే ఈ ఏడాది 800 కోట్లకు పైగా పెట్టుబడిని హక్కుల కోసం ఖర్చు పెట్టింది. ఎన్నడూ లేనిది ఈ సంవత్సరమే అత్యధిక పెద్ద చిత్రాలు నెట్ ఫ్లిక్స్ లోనే వచ్చాయి. షూటింగ్ దశలో ఉండగానే భారీ ఆఫర్లు ఇచ్చి మరీ రైట్స్ సొంతం చేసుకునే ఎత్తుగడని గత కొన్ని నెలలుగా పాటిస్తోంది. వాల్తేర్ వీరయ్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ లను కొన్నది ఈ కంపెనీనే. మైత్రి మూవీ మేకర్స్ సైతం అమెజాన్ ప్రైమ్ నుంచి షిఫ్ట్ అయిపోయి పుష్ప 2 కూడా ఇచ్చేశారు.
ఒరిజినల్ కంటెంట్ సృష్టించే క్రమంలో భాగంగా ఇండిపెండెంట్ మూవీస్, వెబ్ సిరీస్ లు నిర్మించే ప్లాన్ లో ఉంది నెట్ ఫ్లిక్స్. చరణ్, చిరులతో కొన్ని ప్రతిపాదనలు చర్చల దశలో ఉన్నట్టుగా తెలిసింది. టెడ్ ఇండియాలో ఉండేది కొద్దిరోజులు అయినా తెలుగు తమిళ హిందీకి సంబంధించిన అగ్ర హీరోలు, దర్శకులు, నిర్మాతలను కలుస్తారని తెలిసింది. ఒప్పందాలు జరిగే అవకాశాలు లేకపోలేదు. వెంకటేష్, రానాలతో ఆల్రెడీ రానా నాయుడు తీసిన నెట్ ఫ్లిక్స్ త్వరలో రెండో సీజన్ కి ప్లాన్ చేస్తోంది. భారతీయ శైలిలో నాన్ వెజ్ వంటకాలను టెడ్ కి రుచి చూపించినట్టు ఇన్ సైడ్ టాక్
This post was last modified on December 7, 2023 9:10 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…