నేచురల్ స్టార్ నాని అంటే పక్కా క్లాస్ హీరో అని ముద్ర ఉంది. అతడి కెరీర్లో మెజారిటీ సినిమాలు క్లాస్ టచ్ ఉన్నవే. వాటిలో చాలా వరకు మంచి విజయం సాధించాయి కూడా. అయితే ఎప్పుడూ ఈ క్లాస్ ముద్రతోనే ఉండిపోవడం ఏ హీరో కైనా ఇబ్బందే. మాస్ లో పెరిగితేనే మార్కెట్ కూడా పెరుగుతుంది. అందుకే నాని కూడా అప్పుడప్పుడు మాస్ సినిమాలో ట్రై చేస్తున్నాడు గత కొన్నేళ్లుగా. కొన్నేళ్ల కిందట ఎంసీఏ, ఈ ఏడాది దసరా అతడికి మంచి ఫలితాన్ని ఇచ్చాయి.
ముఖ్యంగా దసరా చిత్రానికి వచ్చిన ఓపెనింగ్స్ చూసి ట్రేడ్ పండిట్లు కూడా ఆశ్చర్యపోయారు. ఆ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజిలో జరిగాయి. క్లాస్ హీరోగా ముద్ర ఉన్న నాని.. మాస్ సినిమాతో చేసిన బాక్సాఫీస్ విధ్వంసం చూసి అందరూ షాక్ అయ్యారు. కేవలం ఓపెనింగ్స్ తోనే ఆ సినిమా సేఫ్ అయిపోయింది.
అయితే అంత ఊర మాస్ సినిమా తర్వాత నాని మళ్లీ తన శైలిలో హాయ్ నాన్న అనే పక్కా క్లాస్ మూవీ చేశాడు. ఇది అతని స్ట్రాంగ్ జోన్ అయినప్పటికీ.. అడ్వాన్స్ బుకింగ్స్ లో అంతగా ఊపు కనిపించడం లేదు. బేసిగ్గా మాస్ సినిమాలకు ప్రేక్షకులు ఎగబడినట్లు క్లాస్ సినిమాలకు ఉండదు. కానీ హాయ్ నాన్న లాంటి ఎమోషనల్ క్లాస్ లవ్ స్టోరీలతోనే నాని గతంలో ప్రేక్షకులను థియేటర్లకు బాగా పుల్ చేసేవాడు. నిన్ను కోరి లాంటి సినిమాలు అందుకు ఉదాహరణ.
కానీ ఇప్పుడు ప్రేక్షకుల మూడ్ వేరేగా ఉంది. మాస్, యాక్షన్ సినిమాలకే ఎక్కువగా థియేటర్లకు వస్తున్నారు. అందులోనూ ఇప్పుడు యూత్ ఆడియన్స్ యానిమల్ ఫీవర్ తో ఊగిపోతున్నారు. అది హాయ్ నాన్న మీద ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ డల్ గా ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హాయ్ నాన్నకు టాక్ చాలా కీలకంగా మారింది. మరి ఆ టాక్.. ఓవరాల్ వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.
This post was last modified on December 6, 2023 1:06 pm
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…