తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు దాటింది. ఫలితాల రోజు తెలుగు సినీ పరిశ్రమ నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. తెరాస అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ పార్టీకే అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన సినీ జనాలందరూ తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో ఒక రోజంతా వ్యూహాత్మక మౌనం పాటించారు. కానీ మరుసటి రోజు నుంచి ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే అల్లు అరవింద్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతించారు.
తాజాగా నేచురల్ స్టార్ నాని.. ట్విట్టర్లో అభిమానులతో సంభాషణ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కొత్త చిత్రం హాయ్ నాన్న ప్రమోషన్లలో భాగంగా చిట్ చాట్ జరిపిన నానిని ఎన్నికల ఫలితాలపై స్పందించమని ఒక అభిమాని అడిగాడు. అందుకు నాని బదులిస్తూ.. పదేళ్లపాటు ఒక బ్లాక్ బస్టర్ సినిమా చూశామని.. ఇప్పుడు థియేటర్లోకి కొత్త సినిమా వచ్చిందని.. అది కూడా బ్లాక్ బస్టర్ కావాలని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించాడు.
ఇన్నాళ్లు అధికారంలో ఉన్న తెరాసను నొప్పించకుండా కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ నూ మెప్పించేలా నాని చేసిన వ్యాఖ్యకి ఫిదా అవుతున్నారు. మరోవైపు మీరు కొత్తగా పనిచేయాలని ఆశపడుతున్న దర్శకుడు ఎవరు అని నానిని అడిగితే.. బలగం చిత్రంతో అందరి మన్ననలు పొందిన కమెడియన్ వేణు పేరు చెప్పాడు నేచురల్ స్టార్. ఎక్కువగా కొత్త యువ దర్శకులతోనే పనిచేయడంపై నాని స్పందిస్తూ తాను స్టార్ దర్శకుల కోసం ఎదురుచూడనని.. తనతో సినిమా చేయాలని ఎవరిని అడగనని.. తనకు కుదిరిన వాళ్లతో సినిమా చేసుకుపోతానని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
This post was last modified on December 5, 2023 10:11 am
స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ…
బాక్సాఫీస్ వద్ద కరుప్పు / వీరభద్రుడు జోరు బాగానే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో రికార్డులు రాసే దిశగా పరుగులు పెడుతోంది.…
హఠాత్తుగా పెద్ది సినారియో మారిపోయింది. ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్ది గురించి రెండు మూడు రోజులు మాట్లాడుకుంటారనుకుంటే దానికి భిన్నంగా…
మంచు మనోజ్.. కొన్నేళ్ల ముందు భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అది అతడికి రెండో పెళ్లి. మరోవైపు…
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మరో దారుణం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ అవకాశం ఇస్తామని నమ్మించి ఇద్దరు అనాథ యువతులను సికింద్రాబాద్లోని గదికి…