టాలీవుడ్ యువ కథానాయకుల్లో శర్వానంద్ది ప్రత్యేకమైన శైలి. అతను ఏదో ఒక తరహా సినిమాలకు ఎప్పుడూ పరిమితం కాలేదు. ‘ప్రస్థానం’ లాంటి ఇంటెన్స్ మూవీ చేశాడు. ‘ఎక్స్ప్రెస్ రాజా’, ‘మహానుభావుడు’ లాంటి ఎంటర్టైనర్గా మెప్పించాడు. ‘శతమానం భవతి’ లాంటి ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తోనూ ఆకట్టుకున్నాడు. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ గాఢమైన ప్రేమకథతోనూ ఇంప్రెస్ చేశాడు.
ఎప్పటికప్పుడు అతను వైవిధ్యమైన సినిమాలతోనే సాగిపోతుంటాడు. కరోనా లేకుంటే అతడి కొత్త చిత్రం ‘శ్రీకారం’ ఈపాటికి విడుదలయ్యేది. ఆ సినిమా చివరి దశలో ఉండగా.. కొత్తగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ సినిమాను ఓకే చేశాడు శర్వా. అతను హీరోగా ఇంకో రెండు ప్రాజెక్టులు కూడా ఖరారైనట్లు వార్తలొస్తున్నాయి.
శర్వా ఓకే చేసిన కొత్త ప్రాజెక్టుల్లో ఒకటి ప్రకాష్ అనే నూతన దర్శకుడితో అని సమాచారం. అది శర్వా ఇంతకుముందు చేయని ఓ వైవిధ్యమైన కథతో తెరకెక్కనుందట. ఇందులో శర్వానంద్ వికలాంగుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. శర్వా లాంటి హ్యాండ్సమ్ హీరో.. వికలాంగుడిగా నటించడం అంటే సాహసమనే చెప్పాలి. ఇలాంటి పాత్రలు తమిళంలో వర్కవుట్ అవుతాయి కానీ.. తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చెప్పలేం.
శర్వా అంత రిస్క్ చేస్తున్నాడంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది. ఈ చిత్రానికి ఇంకా నిర్మాత ఖరారవ్వలేదు. శర్వానే నిర్మాతను వెతికే పనిలో ఉన్నాడట. మరోవైపు శర్వా చాలా ఏళ్ల విరామం తర్వాత మళ్లీ కోలీవుడ్లోకి వెళ్లనున్నట్లు సమాచారం. అతను కొరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ రాజు సుందరంతో ఓ సినిమా చేయబోతున్నాడు. ‘ఎంగేయుం ఎప్పోదుం’ (తెలుగులో జర్నీ) తర్వాత తమిళంలో శర్వా చేయనున్న సినిమా ఇది. దీన్ని తెలుగులోకి కూడా అనువదిస్తారు.
This post was last modified on August 31, 2020 4:50 pm
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…
నందమూరి బాలకృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…
సాధారణంగా సినిమాల ఫలితాల విషయంలో హీరోయిన్ల వాటా తక్కువ అన్నది వాస్తవం. మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వాళ్లు గ్లామర్…
పెద్ద సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యం కావడం ఇటీవల పెద్ద సమస్యగా మారుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు…
అధికారంలోకి రాకముందు.. ప్రజల మధ్య ఉండే పార్టీల గురించి తెలుసు. కానీ, అధికారం వచ్చిన తర్వాత కూడా నిరంతరం ప్రజలను…
"రూపాయి విలువ పడిపోయింది" అనే వార్త చూడగానే.. "మనకేంటిలే, మనం ఇండియాలోనే ఉన్నాం కదా" అని లైట్ తీసుకుంటే పొరపాటే.…